ఈ హైటెక్ జమానాల సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్..అరచేతిలో వైకుంఠమే కాదు ప్రపంచాన్ని కూడా చూపిస్తోంది. వందల కొద్దీ డేటింగ్ వెబ్సైట్ లు, పదుల కొద్దీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు వెరసి ఆన్లైన్ లో చాలామంది ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. ఇదే అదునుగా మరికొందరు కేటుగాళ్లు, కిలాడీలు, కిలేడీలు సోషల్ మీడియా వేదికగా సరికొత్త సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కిలేడీ…నిత్య పెళ్లికూతురుగా అవతారం ఎత్తి సోషల్ మీడియాలో ఎనిమిది మందిని బురిడీ కొట్టించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
బాగా డబ్బున్న బడా బాబులకు ప్రేమ వల వేసే ఈ కిలేడీ…ఆ తర్వాత పద్ధతిగా పెళ్లి కూడా చేసుకుంటుంది. అయితే, పట్టుమని పది నెలలు కూడా కాపురం చేయకుండా తన భర్తకు చెందిన డబ్బులు, నగలు తీసుకుని ఉడాయిస్తుంది. ఇలా, ఏకంగా 8 మందిని రషీదా అనే యువతి మోసం చేసిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్సర్ మూర్తి ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే రషీదాతో మూర్తికి పరిచయం ఏర్పడింది.
గంటల కొద్ది చాటింగ్ తర్వాత ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు మూర్తి, రషీదాలు. ఈ క్రమంలోనే ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసి అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. మార్చి 30న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల పాటు కాపురం సజావుగా చేసినా….ఆ తర్వాత మూర్తితో గొడవలు పెట్టుకునేది రషీదా. చివరకు జులై 4న ఇంట్లో ఉన్న లక్షన్నర డబ్బుతో పాటు ఐదు సవర్ల బంగారం తీసుకొని రషీదా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో, తాను మోసపోయానని గ్రహించిన మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రషీదా గుట్టు రట్టయింది.
అయితే, రషీదా ఇలా మోసం చేయడం తొలిసారి కాదు. కేరళ, కర్ణాటక, ఏపీలో 8 మందిని పెళ్లి చేసుకొని ఈ తరహాలోనే కొద్ది నెలలు కాపురం చేసి డబ్బు, నగలతో ఉడాయించిందని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి బాగా డబ్బున్న వారికి వలవేసి వంచించడమే ఆమె ప్రవృత్తి అని పోలీసులు గుర్తించారు. రషీదా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ తరహా ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
This post was last modified on July 12, 2023 4:21 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…