చైనా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా జూన్ 29న సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. టిక్ టాక్ సహా 59 చైనా యాప్లను ఒకేసారి నిషేధించి వాటి యాజమాన్యాలకు, యూజర్లకు ఒకేసారి పెద్ద షాకే ఇచ్చింది కేంద్రం. రెండు వైపులా ఆవేదన స్వరాలు వినిపించినా మోడీ సర్కారు పట్టించుకోలేదు. తమ నిర్ణయానికి కట్టుబడే ఉంది. మిగతా యాప్ల మాటేమో కానీ.. టిక్ టాక్ నిషేధంతో మాత్రం కోట్లాది మంది గగ్గోలు పెట్టారు. కొన్నేళ్లుగా తమ జీవనంలో భాగంగా మారిపోయిన టిక్ టాక్ను ఒకేసారి ఇలా విడిచిపెట్టడం చాలా కష్టమైంది. కొందరు సైలెంటయ్యారు. కొందరు ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. మళ్లీ టిక్ టాక్ రాకపోదా అన్న ఆశతో కొందరున్నారు.
ఐతే ప్రపంచవ్యాప్తంగా చైనా అవతల టిక్ టాక్ యూజర్లు 20 కోట్లకు పైగానే ఉండగా.. అందులో సగానికి పైగా భారతీయులే కావడం గమనార్హం. భారత్లో టిక్ టాక్ మీద 20 వేల కోట్ల దాకా బిజినెస్ జరుగుతోందంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత బిజినెస్ను అంత సులువుగా ఎలా వదిలేసుకుంటారు. టిక్ టాక్ యాజమాని అయిన చైనా సంస్థ బైట్ డ్యాన్స్.. ఎలాగైనా ఆ యాప్ను తిరిగి తీసుకురావాలని కష్టపడుతోంది. ఓ అమెరికా సంస్థకు వాటాలిద్దామని ప్రయత్నించింది కానీ కుదర్లేదు. ఇప్పుడు బైట్ డ్యాన్స్.. భారతీయ సంస్థ జియోతో డీల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జియోకు మెజారిటీ వాటా ఇచ్చి ‘టిక్ టాక్’ను భారతీయ సంస్థగా మార్చి.. తద్వారా తిరిగి ఆ యాప్ను జన బాహుళ్యంలోకి తీసుకురావాలన్నది బైట్ డ్యాన్స్ ప్రయత్నం. ఇదెంత వరకు ఫలిస్తుందో చూడాలి మరి.
This post was last modified on August 13, 2020 8:28 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…