చైనా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా జూన్ 29న సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. టిక్ టాక్ సహా 59 చైనా యాప్లను ఒకేసారి నిషేధించి వాటి యాజమాన్యాలకు, యూజర్లకు ఒకేసారి పెద్ద షాకే ఇచ్చింది కేంద్రం. రెండు వైపులా ఆవేదన స్వరాలు వినిపించినా మోడీ సర్కారు పట్టించుకోలేదు. తమ నిర్ణయానికి కట్టుబడే ఉంది. మిగతా యాప్ల మాటేమో కానీ.. టిక్ టాక్ నిషేధంతో మాత్రం కోట్లాది మంది గగ్గోలు పెట్టారు. కొన్నేళ్లుగా తమ జీవనంలో భాగంగా మారిపోయిన టిక్ టాక్ను ఒకేసారి ఇలా విడిచిపెట్టడం చాలా కష్టమైంది. కొందరు సైలెంటయ్యారు. కొందరు ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. మళ్లీ టిక్ టాక్ రాకపోదా అన్న ఆశతో కొందరున్నారు.
ఐతే ప్రపంచవ్యాప్తంగా చైనా అవతల టిక్ టాక్ యూజర్లు 20 కోట్లకు పైగానే ఉండగా.. అందులో సగానికి పైగా భారతీయులే కావడం గమనార్హం. భారత్లో టిక్ టాక్ మీద 20 వేల కోట్ల దాకా బిజినెస్ జరుగుతోందంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత బిజినెస్ను అంత సులువుగా ఎలా వదిలేసుకుంటారు. టిక్ టాక్ యాజమాని అయిన చైనా సంస్థ బైట్ డ్యాన్స్.. ఎలాగైనా ఆ యాప్ను తిరిగి తీసుకురావాలని కష్టపడుతోంది. ఓ అమెరికా సంస్థకు వాటాలిద్దామని ప్రయత్నించింది కానీ కుదర్లేదు. ఇప్పుడు బైట్ డ్యాన్స్.. భారతీయ సంస్థ జియోతో డీల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జియోకు మెజారిటీ వాటా ఇచ్చి ‘టిక్ టాక్’ను భారతీయ సంస్థగా మార్చి.. తద్వారా తిరిగి ఆ యాప్ను జన బాహుళ్యంలోకి తీసుకురావాలన్నది బైట్ డ్యాన్స్ ప్రయత్నం. ఇదెంత వరకు ఫలిస్తుందో చూడాలి మరి.
This post was last modified on August 13, 2020 8:28 pm
భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే…
నిన్న రిలీజైన కొత్త సినిమాలు ఏ దిశకు వెళ్తున్నాయో ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. పూర్తి క్లారిటీ సోమవారానికి…
కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ అల్లుడిగా ఎక్కువ గుర్తింపు ఉన్నా చాలా తక్కువ టైంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరోగా…
పాత క్లాసిక్స్, బ్లాక్ బస్టర్ సినిమాలకున్న అతి పెద్ద సమస్య ఒరిజినల్ నెగటివ్స్ లభ్యత. ఈ కారణంగానే జగదేకవీరుడు అతిలోకసుందరి,…
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఇవాళ విడుదలయ్యింది. తెలుగులో ఒక రోజు పేరుతో డబ్బింగ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్…
ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్రతి సినిమాకూ రిలీజ్ డేట్ మారడం అన్నది మామూలైపోయింది. ఐతే…