Trends

హైదరాబాద్‌కు.. పాకిస్థాన్ మ్యాచ్‌లు విదిల్చారు

ఏ రకంగా చూసినా దేశంలో అత్యంత ప్రాధాన్యమున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ అభిమానుల క్రికెట్ పిచ్చి గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా స్టేడియం నిండిపోతుంది. స్టేడియంలోనే కాక బయట కూడా క్రికెటర్లకు ఇక్కడి అభిమానులు బ్రహ్మరథం పడతారు. బీసీసీఐకి బోలెడంత ఆదాయం తెచ్చిపెడతారు. అలాంటి అభిమానుల మీద, సిటీ మీద బీసీసీఐకి ఎప్పుడూ చులకనభావమే.

హైదరాబాద్ క్రికెట్ సంఘం అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతుండటం వల్ల కావచ్చు.. అందులో బలమైన నాయకులు లేక కావచ్చు.. మ్యాచ్‌ల కేటాయింపులో ఎప్పుడూ అన్యాయమే జరుగుతున్నా స్పందన ఉండదు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే వేదికల్లో ఒకటిగా హైదరాబాద్ ఉందని సంతోషించేలోపే.. ఇండియా మ్యాచ్ ఒక్కటీ లేకుండా ఈ సిటీ మీద శీతకన్నేశారు.

ముందు నుంచి ప్రచారంలో ఉన్న విషయాన్నే నిజం చేస్తూ ఈ రోజు ప్రకటించిన ప్రపంచకప్ షెడ్యూల్లో ఇండియా మ్యాచ్‌ ఒక్కటీ హైదరాబాద్‌కు కేటాయించలేదు. మన పొరుగు నగరాలే అయిన బెంగళూరు, చెన్నైలకు మాత్రం ఇండియా మ్యాచ్‌లను కేటాయించారు. ప్రధాని మోడీ సొంత నగరం అహ్మదాబాద్‌లో అయితే ఒక ఇండియా మ్యాచ్‌తో పాటు ఆరంభ మ్యాచ్, ఫైనల్ కూడా జరగబోతున్నాయి.

కానీ హైదరాబాద్‌కు మాత్రం పాకిస్థాన్ ఆడే లీగ్ మ్యాచ్‌లు, న్యూజిలాండ్ మ్యాచ్ ఒకటి కేటాయించి సరిపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్‌ పాకిస్థాన్ జట్టుకు సొంత గడ్డలా అనమాట. ఇండియా ఏదైనా చిన్న జట్టుతో ఆడే మ్యాచ్ కూడా హైదరాబాద్‌కు కేటాయించలేదు. హైదరాబాద్‌తో పోలిస్తే చిన్న నగరాలైన పుణె, ధర్మశాల నగరాలకు సైతం ఇండియా మ్యాచ్‌లు ఉన్నాయి.

మహారాష్ట్రలోనే రెండు ఇండియా మ్యాచ్‌లు జరగబోతున్నాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక్క మ్యాచ్ కూడా కేటాయించలేదు. వైజాగ్‌ అయితే ప్రపంచకప్‌కు వేదికగానే ఎంపిక కాలేదు. అక్టోబరు 5న మొదలయ్యే ప్రపంచకప్.. నవంబరు 19న ఫైనల్‌తో ముగుస్తుంది. ఇండియా-పాకిస్థాన్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ అక్టోబరు 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.

This post was last modified on June 27, 2023 6:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

3 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

3 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

4 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

4 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

5 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

5 hours ago