Trends

హైదరాబాద్‌కు.. పాకిస్థాన్ మ్యాచ్‌లు విదిల్చారు

ఏ రకంగా చూసినా దేశంలో అత్యంత ప్రాధాన్యమున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ అభిమానుల క్రికెట్ పిచ్చి గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా స్టేడియం నిండిపోతుంది. స్టేడియంలోనే కాక బయట కూడా క్రికెటర్లకు ఇక్కడి అభిమానులు బ్రహ్మరథం పడతారు. బీసీసీఐకి బోలెడంత ఆదాయం తెచ్చిపెడతారు. అలాంటి అభిమానుల మీద, సిటీ మీద బీసీసీఐకి ఎప్పుడూ చులకనభావమే.

హైదరాబాద్ క్రికెట్ సంఘం అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతుండటం వల్ల కావచ్చు.. అందులో బలమైన నాయకులు లేక కావచ్చు.. మ్యాచ్‌ల కేటాయింపులో ఎప్పుడూ అన్యాయమే జరుగుతున్నా స్పందన ఉండదు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే వేదికల్లో ఒకటిగా హైదరాబాద్ ఉందని సంతోషించేలోపే.. ఇండియా మ్యాచ్ ఒక్కటీ లేకుండా ఈ సిటీ మీద శీతకన్నేశారు.

ముందు నుంచి ప్రచారంలో ఉన్న విషయాన్నే నిజం చేస్తూ ఈ రోజు ప్రకటించిన ప్రపంచకప్ షెడ్యూల్లో ఇండియా మ్యాచ్‌ ఒక్కటీ హైదరాబాద్‌కు కేటాయించలేదు. మన పొరుగు నగరాలే అయిన బెంగళూరు, చెన్నైలకు మాత్రం ఇండియా మ్యాచ్‌లను కేటాయించారు. ప్రధాని మోడీ సొంత నగరం అహ్మదాబాద్‌లో అయితే ఒక ఇండియా మ్యాచ్‌తో పాటు ఆరంభ మ్యాచ్, ఫైనల్ కూడా జరగబోతున్నాయి.

కానీ హైదరాబాద్‌కు మాత్రం పాకిస్థాన్ ఆడే లీగ్ మ్యాచ్‌లు, న్యూజిలాండ్ మ్యాచ్ ఒకటి కేటాయించి సరిపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్‌ పాకిస్థాన్ జట్టుకు సొంత గడ్డలా అనమాట. ఇండియా ఏదైనా చిన్న జట్టుతో ఆడే మ్యాచ్ కూడా హైదరాబాద్‌కు కేటాయించలేదు. హైదరాబాద్‌తో పోలిస్తే చిన్న నగరాలైన పుణె, ధర్మశాల నగరాలకు సైతం ఇండియా మ్యాచ్‌లు ఉన్నాయి.

మహారాష్ట్రలోనే రెండు ఇండియా మ్యాచ్‌లు జరగబోతున్నాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక్క మ్యాచ్ కూడా కేటాయించలేదు. వైజాగ్‌ అయితే ప్రపంచకప్‌కు వేదికగానే ఎంపిక కాలేదు. అక్టోబరు 5న మొదలయ్యే ప్రపంచకప్.. నవంబరు 19న ఫైనల్‌తో ముగుస్తుంది. ఇండియా-పాకిస్థాన్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ అక్టోబరు 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.

This post was last modified on June 27, 2023 6:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

41 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

49 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 hours ago