Trends

రిపోర్ట్ – ఏపీలో కరోనా ఔట్ ఆఫ్ కంట్రోల్

ఏపీలో కరోనా ఔట్ ఆఫ్ కంట్రోల్.. ఇది ప్రతిపక్ష పార్టీలో, జగన్ సర్కారు అంటే గిట్టని వాళ్లో అంటున్న మాట కాదు. కొవిడ్ ఇండియా వెబ్ సైట్ చేసిన హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందంటూ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది ఆ వెబ్ సైట్. దేశంలో కరోనా పరిస్థితిని అంచనా వేస్తూ సమగ్ర వివరాలు అందిస్తున్న అధికారిక వెబ్ సైట్ అది.

ఏపీలో గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకు అటు ఇటుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు 60, 70, 80, 80, 90.. ఇలా పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు సగటున ఒక రోజు మరణాల సంఖ్య వందకు చేరువగా ఉంటుంది. ఎంతకీ కేసులు, మరణాల సంఖ్య తగ్గట్లేదు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ ఇండియా వెబ్ సైట్ ఈ హెచ్చరిక జారీ చేసింది.

ఐదు వేలకు పైగా కరోనా కేసులు నమోదైన 15 రోజుల్లోపే రెట్టింపవుతున్న జిల్లాలు దేశవ్యాప్తంగా 22 మాత్రమే ఉండగా.. అందులో 9 మినహా ఏపీలోనివే అని కొవిడ్ ఇండియా వెబ్ సైట్ చెబుతోంది. ఏపీలో అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలు 20 వేల కేసుల మార్కును దాటేశాయి. విశాఖపట్నం, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలు కూడా 20 వేల కేసుల మార్కుకు చేరువగా ఉన్నాయి. ఆరు జిల్లాల పరిధిలో 7 నుంచి 15 రోజుల వ్యవధిలోనే రెట్టింపు కేసులు నమోదు కావడం గమనార్హం.

జాతీయ స్థాయిలో 28 రోజుల్లో కేసులు రెట్టింపు అవుతుండగా.. ఏపీలో మాత్రం 15 రోజుల్లోపే డబుల్ అవుతున్నాయని కొవిడ్ ఇండియా వెబ్ సైట్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. ఇలాగే కొనసాగితే ఆగస్టు నెలాఖరుకు ఇంకో రెండు లక్షల కేసులు నమోదు కావచ్చని హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.

Satya

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

3 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

3 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

5 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

5 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

5 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

6 hours ago