Trends

ఒడిషా విషాదం.. కేటుగాళ్లు తయార్

ఒక పెద్ద ప్రమాదం, దాంతో పాటే విషాదం చోటు చేసుకున్నపుడు మానవత్వంతో స్పందించే వాళ్లు ఒకవైపు ఉంటే.. ఆ సమయంలోనూ దుర్మార్గంగా ఆలోచించి ప్రయోజనం పొందాలని చూసేవాళ్లు ఇంకోవైపు ఉంటారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటనదగ్గది ఇటీవల ఒడిషాలో చోటు చేసుకుంది. మూడు రైళ్లు ఒకదాంతో ఒకటి ఢీకొట్టిన ఈ ప్రమాదంలో దాదాపు మూడొందల మందిదాకా ప్రాణాలు కోల్పోయారు.

వందల మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఐతే ఈ ప్రమాదం జరిగిన అనంతరం చుట్టు పక్కల వాళ్లు ఎంతోమంది స్వచ్ఛందంగా తరలి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రక్తదానం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు. కానీ అదే సమయంలో ప్రమాద బాధితుల నుంచి దొరికిందంతా దోచుకోవడానికి చూశారు కొందరు దుర్మార్గులు. ఈ ప్రమాదం తర్వాత ఇంకో రకం కేటుగాళ్లు తయారై ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందడానికి చూస్తుండటం గమనార్హం.

రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.12 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా చనిపోయిన వారిలో పలువురి మృతదేహాలను ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేదు. అవి గుర్తు తెలియని మృతదేహాల్లాగానే ఉన్నాయి ఇప్పటిదాకా. ఐతే ప్రభుత్వ పరిహారం గురించి తెలుసుకున్న కొందరు.. ఈ గుర్తు తెలియని మృతదేహాలను తమవిగా చెప్పి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.

కటక్‌కు చెందిన గీతాంజలి అనే మహిళ.. బాలేశ్వర్‌లో రైలు ప్రమాద మృతుల ఫొటోలు పెట్టిన చోటికి వచ్చి.. తన భర్త ఈ ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పింది. ఐతే పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది. గట్టిగా అడిగితే అసలు విషయం వెల్లడైంది. ఆమె భర్త బతికే ఉన్నాడు. పరిహారం కోసమే ఆమె డ్రామా ఆడినట్లు తేలింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి కేసులు మరికొన్ని రావడంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. 

This post was last modified on June 7, 2023 4:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

12 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago