Trends

ఒడిషా విషాదం.. కేటుగాళ్లు తయార్

ఒక పెద్ద ప్రమాదం, దాంతో పాటే విషాదం చోటు చేసుకున్నపుడు మానవత్వంతో స్పందించే వాళ్లు ఒకవైపు ఉంటే.. ఆ సమయంలోనూ దుర్మార్గంగా ఆలోచించి ప్రయోజనం పొందాలని చూసేవాళ్లు ఇంకోవైపు ఉంటారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటనదగ్గది ఇటీవల ఒడిషాలో చోటు చేసుకుంది. మూడు రైళ్లు ఒకదాంతో ఒకటి ఢీకొట్టిన ఈ ప్రమాదంలో దాదాపు మూడొందల మందిదాకా ప్రాణాలు కోల్పోయారు.

వందల మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఐతే ఈ ప్రమాదం జరిగిన అనంతరం చుట్టు పక్కల వాళ్లు ఎంతోమంది స్వచ్ఛందంగా తరలి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రక్తదానం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు. కానీ అదే సమయంలో ప్రమాద బాధితుల నుంచి దొరికిందంతా దోచుకోవడానికి చూశారు కొందరు దుర్మార్గులు. ఈ ప్రమాదం తర్వాత ఇంకో రకం కేటుగాళ్లు తయారై ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందడానికి చూస్తుండటం గమనార్హం.

రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.12 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా చనిపోయిన వారిలో పలువురి మృతదేహాలను ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేదు. అవి గుర్తు తెలియని మృతదేహాల్లాగానే ఉన్నాయి ఇప్పటిదాకా. ఐతే ప్రభుత్వ పరిహారం గురించి తెలుసుకున్న కొందరు.. ఈ గుర్తు తెలియని మృతదేహాలను తమవిగా చెప్పి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.

కటక్‌కు చెందిన గీతాంజలి అనే మహిళ.. బాలేశ్వర్‌లో రైలు ప్రమాద మృతుల ఫొటోలు పెట్టిన చోటికి వచ్చి.. తన భర్త ఈ ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పింది. ఐతే పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది. గట్టిగా అడిగితే అసలు విషయం వెల్లడైంది. ఆమె భర్త బతికే ఉన్నాడు. పరిహారం కోసమే ఆమె డ్రామా ఆడినట్లు తేలింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి కేసులు మరికొన్ని రావడంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. 

This post was last modified on June 7, 2023 4:21 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సలార్ అక్కడెందుకు ఫ్లాప్ అయ్యింది

స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…

1 hour ago

సమీక్ష – ఆ ఒక్కటి అడక్కు

గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…

2 hours ago

మీనమేషాలు లెక్కబెడుతున్న భారతీయుడు 2

లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…

2 hours ago

వివేకా కేసులో సంచ‌ల‌నం.. అవినాష్‌కు ఊర‌ట‌

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డికేసులో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…

3 hours ago

రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ !

లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…

3 hours ago

ముద్రగ‌డ ఫ్యామిలీలో క‌ల్లోలం.. ప‌వ‌న్‌కు జైకొట్టిన కుమార్తె

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్తితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న…

4 hours ago