స్మార్ట్ ఫోన్ వాడుతూ.. సోషల్ మీడియాను ఉపయోగించే ఏ వ్యక్తి.. ఫేస్ బుక్ యాప్ను వాడకుండా ఉండలేడు. దాన్నో దినసరి వ్యవహారంలా.. వ్యసనంలా మార్చేసిన వ్యక్తి మార్క్ జుకర్బర్గ్. టీనేజీలోనే ఈ సంస్థను నెలకొల్పి.. పాతికేళ్ల వయసొచ్చేసరికే వేల కోట్ల ఆదాయానికి పడగలెత్తిన వ్యక్తి అతను.
ఫేస్ బుక్తో సరిపెట్టకుండా వాట్సాప్ సహా మరికొన్ని సంస్థల్ని సొంతం చేసుకుని మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆదాయం పెంచుకున్నాడు. రోజు రోజుకూ అతడి సంస్థలు పెద్దవవుతున్నాయి. జుకర్బర్గ్ను మరింత సంపాదన పరుడిగా మారుస్తున్నాయి. తాజాగా అతను అరుదైన క్లబ్లోకి చేరాడు.
ప్రపంచంలో ఇప్పటిదాకా ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేరుకున్న క్లబ్ అది. 100 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించిన మూడో వ్యక్తిగా జుకర్బర్గ్ రికార్డులకెక్కాడు. ఇప్పటిదాకా అమేజాన్ అధినేత జెఫ్ బిజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాత్రమే ఈ క్లబ్బులోకి చేరారు.
గత వార్షిక సంవత్సరంలో 22 బిలియన్ డాలర్ల ఆదాయం పొందడం ద్వారా జుకర్బర్గ్ కూడా 100 బిలియన్ డాలర్ల సంపాదన పరుడిగా మారాడు. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే అతడి సంపద 75 వేల కోట్ల పైమాటే అన్నమాట. మరోవైపు మన ముకేష్ అంబాని 81 బిలియన్ డాలర్లతో ఈ క్లబ్బు దిశగా అడుగులు వేస్తున్నాడు.
This post was last modified on August 9, 2020 10:36 am
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…