స్మార్ట్ ఫోన్ వాడుతూ.. సోషల్ మీడియాను ఉపయోగించే ఏ వ్యక్తి.. ఫేస్ బుక్ యాప్ను వాడకుండా ఉండలేడు. దాన్నో దినసరి వ్యవహారంలా.. వ్యసనంలా మార్చేసిన వ్యక్తి మార్క్ జుకర్బర్గ్. టీనేజీలోనే ఈ సంస్థను నెలకొల్పి.. పాతికేళ్ల వయసొచ్చేసరికే వేల కోట్ల ఆదాయానికి పడగలెత్తిన వ్యక్తి అతను.
ఫేస్ బుక్తో సరిపెట్టకుండా వాట్సాప్ సహా మరికొన్ని సంస్థల్ని సొంతం చేసుకుని మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆదాయం పెంచుకున్నాడు. రోజు రోజుకూ అతడి సంస్థలు పెద్దవవుతున్నాయి. జుకర్బర్గ్ను మరింత సంపాదన పరుడిగా మారుస్తున్నాయి. తాజాగా అతను అరుదైన క్లబ్లోకి చేరాడు.
ప్రపంచంలో ఇప్పటిదాకా ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేరుకున్న క్లబ్ అది. 100 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించిన మూడో వ్యక్తిగా జుకర్బర్గ్ రికార్డులకెక్కాడు. ఇప్పటిదాకా అమేజాన్ అధినేత జెఫ్ బిజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాత్రమే ఈ క్లబ్బులోకి చేరారు.
గత వార్షిక సంవత్సరంలో 22 బిలియన్ డాలర్ల ఆదాయం పొందడం ద్వారా జుకర్బర్గ్ కూడా 100 బిలియన్ డాలర్ల సంపాదన పరుడిగా మారాడు. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే అతడి సంపద 75 వేల కోట్ల పైమాటే అన్నమాట. మరోవైపు మన ముకేష్ అంబాని 81 బిలియన్ డాలర్లతో ఈ క్లబ్బు దిశగా అడుగులు వేస్తున్నాడు.
This post was last modified on August 9, 2020 10:36 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…