స్మార్ట్ ఫోన్ వాడుతూ.. సోషల్ మీడియాను ఉపయోగించే ఏ వ్యక్తి.. ఫేస్ బుక్ యాప్ను వాడకుండా ఉండలేడు. దాన్నో దినసరి వ్యవహారంలా.. వ్యసనంలా మార్చేసిన వ్యక్తి మార్క్ జుకర్బర్గ్. టీనేజీలోనే ఈ సంస్థను నెలకొల్పి.. పాతికేళ్ల వయసొచ్చేసరికే వేల కోట్ల ఆదాయానికి పడగలెత్తిన వ్యక్తి అతను.
ఫేస్ బుక్తో సరిపెట్టకుండా వాట్సాప్ సహా మరికొన్ని సంస్థల్ని సొంతం చేసుకుని మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆదాయం పెంచుకున్నాడు. రోజు రోజుకూ అతడి సంస్థలు పెద్దవవుతున్నాయి. జుకర్బర్గ్ను మరింత సంపాదన పరుడిగా మారుస్తున్నాయి. తాజాగా అతను అరుదైన క్లబ్లోకి చేరాడు.
ప్రపంచంలో ఇప్పటిదాకా ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేరుకున్న క్లబ్ అది. 100 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించిన మూడో వ్యక్తిగా జుకర్బర్గ్ రికార్డులకెక్కాడు. ఇప్పటిదాకా అమేజాన్ అధినేత జెఫ్ బిజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాత్రమే ఈ క్లబ్బులోకి చేరారు.
గత వార్షిక సంవత్సరంలో 22 బిలియన్ డాలర్ల ఆదాయం పొందడం ద్వారా జుకర్బర్గ్ కూడా 100 బిలియన్ డాలర్ల సంపాదన పరుడిగా మారాడు. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే అతడి సంపద 75 వేల కోట్ల పైమాటే అన్నమాట. మరోవైపు మన ముకేష్ అంబాని 81 బిలియన్ డాలర్లతో ఈ క్లబ్బు దిశగా అడుగులు వేస్తున్నాడు.
This post was last modified on August 9, 2020 10:36 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…