స్మార్ట్ ఫోన్ వాడుతూ.. సోషల్ మీడియాను ఉపయోగించే ఏ వ్యక్తి.. ఫేస్ బుక్ యాప్ను వాడకుండా ఉండలేడు. దాన్నో దినసరి వ్యవహారంలా.. వ్యసనంలా మార్చేసిన వ్యక్తి మార్క్ జుకర్బర్గ్. టీనేజీలోనే ఈ సంస్థను నెలకొల్పి.. పాతికేళ్ల వయసొచ్చేసరికే వేల కోట్ల ఆదాయానికి పడగలెత్తిన వ్యక్తి అతను.
ఫేస్ బుక్తో సరిపెట్టకుండా వాట్సాప్ సహా మరికొన్ని సంస్థల్ని సొంతం చేసుకుని మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆదాయం పెంచుకున్నాడు. రోజు రోజుకూ అతడి సంస్థలు పెద్దవవుతున్నాయి. జుకర్బర్గ్ను మరింత సంపాదన పరుడిగా మారుస్తున్నాయి. తాజాగా అతను అరుదైన క్లబ్లోకి చేరాడు.
ప్రపంచంలో ఇప్పటిదాకా ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేరుకున్న క్లబ్ అది. 100 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించిన మూడో వ్యక్తిగా జుకర్బర్గ్ రికార్డులకెక్కాడు. ఇప్పటిదాకా అమేజాన్ అధినేత జెఫ్ బిజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాత్రమే ఈ క్లబ్బులోకి చేరారు.
గత వార్షిక సంవత్సరంలో 22 బిలియన్ డాలర్ల ఆదాయం పొందడం ద్వారా జుకర్బర్గ్ కూడా 100 బిలియన్ డాలర్ల సంపాదన పరుడిగా మారాడు. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే అతడి సంపద 75 వేల కోట్ల పైమాటే అన్నమాట. మరోవైపు మన ముకేష్ అంబాని 81 బిలియన్ డాలర్లతో ఈ క్లబ్బు దిశగా అడుగులు వేస్తున్నాడు.
This post was last modified on August 9, 2020 10:36 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…