Trends

భారత అత్యుత్తమ బ్రాండ్ అదే.. టాప్ 10 లిస్ట్

భారత్ లో అత్యుత్తమ బ్రాండ్ గా నిలిచింది టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్). భారత అత్యుత్తమ టాప్ 50 బ్రాండ్ లకు సంబంధించిన జాబితాను తాజాగా ఇంటర్ బ్రాండ్ సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ ర్యాంకుల్లో టాప్ 5 స్థానాల్లో మొదటి స్థానాన్ని టీసీఎస్ సొంతం చేసుకుంటే.. రెండో స్థానంలో రిలయన్స్.. మూడు స్థానంలో ఇన్ఫోసిస్.. నాలుగో స్థానంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్.. ఐదోస్థానంలో జియో నిలిచాయి. మొత్తం టాప్ 5 అతి తక్కువ సమయంలో అత్యుత్తమ బ్రాండ్ గా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోవటంలో జియో ముందుందని చెప్పాలి.

జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన టీసీఎస్ రూ.1,09,576 కోట్ల బ్రాండ్ విలువతో నిలవగా.. రెండో స్థానంలో నిలిచిన రిలయన్స్ బ్రాండ్ విలువ రూ.65,320 కోట్లుగా తేల్చారు. మూడోస్థానంలో ఇన్ఫోసిస్ నిలిచింది. దీని బ్రాండ్ విలువ రూ.53,324 కోట్లుగా తేల్చారు. గడిచిన పదేళ్లలో వచ్చిన మార్పు ఏమంటే.. ఇతర రంగాలకు అధిగమించి టెక్నాలజీ రంగం అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 5 బ్రాండ్ లలో మూడు టెక్నాలజీ కంపెనీలే ఉండటం గమనార్హం.

ఆర్థిక సేవల రంగంలో తొమ్మిది సంస్థలు జాబితాలో చోటు సంపాదిస్తే.. హోమ్ బిల్డింగ్.. ఇన్ ఫ్రా రంగం నుంచి ఏడు కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. టాప్ 10 బ్రాండ్ ల మొత్తం విలువలో మొదటి మూడు బ్రాండ్ ల వాటానే 46 శాతంగా ఉండటం విశేషం. మొత్తం జాబితాలో అగ్రగామి ఐదు బ్రాండ్ వాటా 40 శాతంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో వ్రద్ధి సాధిస్తున్న రంగాల్లో ఎఫ్ఎంసీజీ తొలి స్థానంలోనిలిస్తే.. తర్వాతి స్థానంలో హోమ్ బిల్డింగ్.. మూడో స్థానంలో ఇన్ ఫ్రా.. నాలుగోస్థానంలో టెక్నాలజీ రంగాలు నిలిచాయి.

టాప్ 10 బ్రాండ్లను చూస్తే..

  1. టీసీఎస్
  2. రిలయన్స్
  3. ఇన్ఫోసిస్
  4. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్
  5. జియో
  6. ఎయిర్ టెల్
  7. ఎల్ ఐసీ
  8. మహీంద్రా
  9. ఎస్ బీఐ
  10. ఐసీఐసీఐ బ్యాంకు

This post was last modified on June 1, 2023 6:44 pm

Share

Recent Posts

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

21 minutes ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

3 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

7 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

11 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

11 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

12 hours ago