Trends

ఆలోచన మార్చుకుంటున్న కాంగ్రెస్

కర్ణాటక ఎన్నికల ఘన విజయం తాలూకు ఉత్సాహం కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతోంది. అందుకనే తొందరలోనే నాన్ ఎన్డీయే పార్టీల సమావేశానికి రెడీ అవుతోంది. ఇందుకోసం వేదికను, తేదీని సిద్ధం చేయడానికి అవసరమైన చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు చర్చించారు. వేదిక, తేదీ మరో రెండురోజుల్లో ఫైనల్ కావచ్చని అనుకుంటున్నారు.

వేదికయితే బీహార్ రాజధాని పాట్నాలోనే ఉండచ్చని సమాచారం. ఎందుకంటే పాట్నాలో ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించేందుకు నితీష్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వేదిక ఫిక్సయినట్లే. ఇక నిర్ణయమవ్వాల్సింది తేదీ మాత్రమే. అలాగే నాన్ ఎన్డీయే పార్టీలంటే ఎవరెవరిని పిలవాలనే విషయాన్ని కూడా ఫైనల్ చేయబోతున్నారు. పిలవాల్సిన వాళ్ళెవరు అన్నది తేలిపోతే డేట్ కూడా ఆటోమేటిగ్గా ఫైనల్ అయిపోయినట్లే అని నితీష్ చెబుతున్నారు.

2024 ఎన్నికల్లో నాన్ ఎన్డీయే పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ ఉండాలన్నది స్థూలంగా అందరు అనుకుంటున్నారు. అయితే దీనికి ఒక రూపమంటూ ఇవ్వలేదు. ఇదివరకే నితీష్ తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనొకటి కీలకంగా మారింది. అదేమిటంటే వన్ ఆన్ వన్ అన్నది ఈ సూత్రం. వన్ ఆన్ వన్ అంటే ఎన్డీయే తరపున పోటీ చేయబోయే అభ్యర్ధులపై ప్రతిపక్షాల తరపున కేవలం ఒక అభ్యర్థి మాత్రమే పోటీచేయాలి.

అంటే ప్రతిపక్షాల తరపున పోటీ చేయబోయే అభ్యర్ధే ఉమ్మడి అభ్యర్ధవుతారు. సదరు అభ్యర్ధి గెలుపుకు ప్రతిపక్షాలన్నీ కష్టపడి పనిచేస్తే గెలుపు సాధ్యమే అన్నది నితీష్, మమత ఆలోచన. ఆలోచన వరకు కరెక్టే అనిపిస్తోంది. కానీ ఆచరణలో సాధ్యమవుతుందా అన్నదే అనుమానం. వీళ్ళ సూచన ప్రకారం ఏ రాష్ట్రంలో ప్రాంతీయపార్టీలు బలంగా ఉంటే ఆ పార్టీలే ఎక్కువ సీట్లలో పోటీచేస్తాయి. అంటే కాంగ్రెస్ పోటీచేయబోయే సీట్ల సంఖ్య తక్కువైపోతుంది. పోటీచేసే సీట్లే తక్కువైపోతే ఇక గెలిచే సీట్లెన్ని ? అన్నదే అసలు సమస్య. ఒకవేళ ఈ సూత్రం వర్కవుటై అధికారంలోకి వచ్చేట్లయితే ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎవరుంటారో తేల్చే విషయంలో కాంగ్రెస్ వాయిస్ తగ్గిపోతుంది. మరి దీనికి కాంగ్రెస్ ఒప్పుకుంటుందా ?

This post was last modified on May 24, 2023 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

1 hour ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

1 hour ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago