కర్ణాటక ఎన్నికల ఘన విజయం తాలూకు ఉత్సాహం కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతోంది. అందుకనే తొందరలోనే నాన్ ఎన్డీయే పార్టీల సమావేశానికి రెడీ అవుతోంది. ఇందుకోసం వేదికను, తేదీని సిద్ధం చేయడానికి అవసరమైన చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు చర్చించారు. వేదిక, తేదీ మరో రెండురోజుల్లో ఫైనల్ కావచ్చని అనుకుంటున్నారు.
వేదికయితే బీహార్ రాజధాని పాట్నాలోనే ఉండచ్చని సమాచారం. ఎందుకంటే పాట్నాలో ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించేందుకు నితీష్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వేదిక ఫిక్సయినట్లే. ఇక నిర్ణయమవ్వాల్సింది తేదీ మాత్రమే. అలాగే నాన్ ఎన్డీయే పార్టీలంటే ఎవరెవరిని పిలవాలనే విషయాన్ని కూడా ఫైనల్ చేయబోతున్నారు. పిలవాల్సిన వాళ్ళెవరు అన్నది తేలిపోతే డేట్ కూడా ఆటోమేటిగ్గా ఫైనల్ అయిపోయినట్లే అని నితీష్ చెబుతున్నారు.
2024 ఎన్నికల్లో నాన్ ఎన్డీయే పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ ఉండాలన్నది స్థూలంగా అందరు అనుకుంటున్నారు. అయితే దీనికి ఒక రూపమంటూ ఇవ్వలేదు. ఇదివరకే నితీష్ తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనొకటి కీలకంగా మారింది. అదేమిటంటే వన్ ఆన్ వన్ అన్నది ఈ సూత్రం. వన్ ఆన్ వన్ అంటే ఎన్డీయే తరపున పోటీ చేయబోయే అభ్యర్ధులపై ప్రతిపక్షాల తరపున కేవలం ఒక అభ్యర్థి మాత్రమే పోటీచేయాలి.
అంటే ప్రతిపక్షాల తరపున పోటీ చేయబోయే అభ్యర్ధే ఉమ్మడి అభ్యర్ధవుతారు. సదరు అభ్యర్ధి గెలుపుకు ప్రతిపక్షాలన్నీ కష్టపడి పనిచేస్తే గెలుపు సాధ్యమే అన్నది నితీష్, మమత ఆలోచన. ఆలోచన వరకు కరెక్టే అనిపిస్తోంది. కానీ ఆచరణలో సాధ్యమవుతుందా అన్నదే అనుమానం. వీళ్ళ సూచన ప్రకారం ఏ రాష్ట్రంలో ప్రాంతీయపార్టీలు బలంగా ఉంటే ఆ పార్టీలే ఎక్కువ సీట్లలో పోటీచేస్తాయి. అంటే కాంగ్రెస్ పోటీచేయబోయే సీట్ల సంఖ్య తక్కువైపోతుంది. పోటీచేసే సీట్లే తక్కువైపోతే ఇక గెలిచే సీట్లెన్ని ? అన్నదే అసలు సమస్య. ఒకవేళ ఈ సూత్రం వర్కవుటై అధికారంలోకి వచ్చేట్లయితే ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎవరుంటారో తేల్చే విషయంలో కాంగ్రెస్ వాయిస్ తగ్గిపోతుంది. మరి దీనికి కాంగ్రెస్ ఒప్పుకుంటుందా ?
This post was last modified on May 24, 2023 10:22 am
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…