Trends

పెద్దనోట్లన్నీ బంగారం షాపులకు వెళిపోతున్నాయా ?

పెద్ద నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ఉద్దేశ్యంతో రద్దు చేసిందో తెలీదు. నాలుగు రోజుల క్రితం 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రకటించిన మరుసటి రోజునుండి జనాలు నగల షాపులకు క్యూ కడుతున్నారు. ఆర్బీఐ ఉద్దేశ్యం ఏమిటంటే రద్దయిన నోట్లను జనాలు బ్యాంకులకు తీసుకొచ్చి డిపాజిట్ చేసుకుంటారు లేదా మార్చుకుంటారని. పెద్దనోట్లు రద్దయిన తర్వాత భూములు, వస్తువులు కొనుగోలుకు పెద్దగా ఉపయోగించరు. ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు రద్దయిన నోట్లను తీసుకోవటానికి అంగీకరించరు.

అయితే ఆర్బీఐ ఆలోచనకు విరుద్ధంగా బంగారం షాపుల దగ్గర జనాల క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. ఇంత మంది జనాలు బంగారం షాపుల్లోకి వెళుతున్నారంటే అర్ధమేంటి ? 2 వేల రూపాయల నోట్లతో బంగారం, వజ్రాలు, వెండి ఇలా ఏదో ఒక విలువైన వస్తువులను కొనేస్తున్నారనే కదా. ముంబాయ్, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, సూరత్ తదితర నగరాల్లోని బంగారం వ్యాపారస్తుల దగ్గర గడచిన మూడురోజులుగా వ్యాపారం విపరీతంగా పెరిగిపోయిందని సమాచారం.

కొంతమంది వ్యాపారాస్తులైతే బంగారం కొనుగోలు సమయంలో 2 రెండువేల రూపాయల నోట్లు తీసుకోవాలంటే 5 శాతం అదనంగా ఛార్జ్ చేస్తున్నారట. అదనపు చార్జ్ చేస్తున్నా జనాలు ఆ మొత్తాన్ని చెల్లించేసి నగలు కొనేస్తున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంటే చాలామంది రు. 2 వేల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లకు బ్యాంకులకు వెళ్ళటం లేదు. తమ దగ్గర ఉన్న డబ్బుతో నేరుగా నగల షాపులకు వెళిపోతున్నారు.

తాము దాచుకున్న లేదా దగ్గరున్న 2 వేల రూపాయల నోట్లతో పెద్ద ఎత్తున నగలు కొనేస్తున్నారట. కొంతమంది పెద్ద ఫర్నీచర్ షాపుల యాజమాన్యాలు కూడా 2 వేల నోట్లను తీసుకుంటామని ప్రకటించటంతో ఇంకొంతమంది విలువైన ఫర్నీచర్ ను కొనేస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ లెక్కల ప్రకారం జనాల నుండి రు. 3.6 లక్షల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు సెప్టెంబర్ 30వ తేదీకల్లా బ్యాంకులకు వచ్చేయాలి. కానీ పరిస్ధితి చూస్తుంటే అలా వచ్చేట్లు కనబడటంలేదు. అంటే గడువు తర్వత కూడా బ్యాంకులకు రాని డబ్బును బ్లాక్ మనీగా పరిగణిస్తారు. అందుకనే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు నగల షాపుల మీద కన్నేసుంచారట. మరి చివరకు ఎంత డబ్బు బ్యాంకులకు వస్తుందో చూడాల్సిందే.

This post was last modified on May 22, 2023 11:40 am

Share

Recent Posts

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

8 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

12 minutes ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago