బ్రిటన్ ప్రధాని, భారత మూలాలు ఉన్న రుషి సునాక్.. ఆయన సతీమణి అక్షతల సంపద ఆవిరి అయి పోయింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా.. 200 మిలియన్ పౌండ్ల సంపద హరించుకుపోయినట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రధానిగా సునాక్ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అంతకు ముందు ప్రభుత్వం పన్నులుతగ్గించడంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టేందుకు సునాక్ చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. ఇవి కట్టడి కావడం లేదనే సమాచారం తరచుగా వినిపిస్తోంది.
ఇంతలో ద్రవ్యోల్బణం కారణంగా.. బ్రిటన్ ప్రధాని దంపతుల సంపదే ఆవిరి కావడం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత 12 నెలల్లోనే వీరి సంపదలో సుమారు 200 మిలియన్ పౌండ్లు ఆవిరయ్యిందని బ్రిటన్ మీడియా అంచనా వేసింది. అంటే రోజూ సుమారు 5లక్షల పౌండ్లు కోల్పోతున్న ట్లు లెక్కలు చెబుతున్నారు. తాజాగా సండే టైమ్స్ విడుదల చేసిన బ్రిటన్ సంపన్నుల జాబితాలో రిషి సునాక్ దంపతులు 275వ స్థానంలో కొనసాగుతున్నారు.
అంతకు ముందు 222వ స్థానంలో ఉండగా.. ఏడాది కాలంలోనే ఈ క్షీణత కనిపించింది. అయితే, ఇన్ఫోసిస్ షేర్లు పతనమవ్వడమే ఇందుకు కారణమని విశ్లేషకుల అంచనా. దీనిలోనూ సునాక్ సతీమణి అక్షతకి 64 బిలియన్ డాలర్ల (52 బిలియన్ పౌండ్లు) విలువైన వాటా ఉంది. సంస్థ మొత్తం షేర్లలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అయితే, గత ఏడాది నుంచి ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో సునాక్ దంపతుల సంపద కూడా తరిగిపోయినట్లు సమాచారం.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు జీతభత్యాల కింద ఏడాదికి 1.65 లక్షల పౌండ్లు సమకూరుతుంది. గతేడాది యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిద్దరి సంపద విలువ 730 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. అయితే, ఇటీవల మార్కెట్లు పతనం అవుతుండటంతో వారి సంపద విలువ 529 మిలియన్ పౌండ్లకు (66.8కోట్ల డాలర్లు) పడిపోయింది. దీనిపై బ్రిటన్ పత్రికలు రోజుకో కథనం రాస్తుండడం గమనార్హం.
This post was last modified on May 21, 2023 12:43 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…