Trends

పాస్ట‌ర్ మాట‌లు న‌మ్మి ఉప‌వాసం.. 200 మంది మృతి..

గీత‌-ఖురాన్‌-బైబిల్‌.. ఏం చెప్పినా..చివ‌రి సారాంశం మాత్రం.. దేహాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటూ.. భ‌గ‌వంతునివైపు దృష్టి పెట్టి.. ఆఖ‌రుకు భ‌గ‌వంతుడిని చేరుకునే మార్గాన్ని అన్వేషించాల‌నే. అంతే త‌ప్ప‌.. ఈ దేహాన్ని కృశింప‌జేసుకుని.. భ‌గ‌వంతుడిని చేరాల‌ని ఏ గ్రంధం కూడా బోధించ‌లేదు. మ‌ధ్యలో ఉన్న ఉప‌వాస నియ‌మాలు.. ఆయా కాలాల‌ను బ‌ట్టి.. దేహాన్ని రిపేర్ చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని కూడా పెద్ద‌లు చెబుతారు. అంతేకాదు.. భ‌గ‌వంతుడిని చేరుకునేందుకు స‌న్మార్గం.. దైవ చింత‌న‌.. నీతి నియ‌మాల‌కు పెద్ద‌పీట వేయ‌డ‌మే ప్ర‌ధాన మార్గ‌మ‌ని కూడా బోధిస్తారు.

అయితే.. దీనికి విరుద్ధంగా ఓ పాస్ట‌ర్‌… చేసిన ప్ర‌బోధం.. వంద‌ల మందిని మృత్యు కూపంలోకి నెట్టేసింది. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలి, క‌ఠిన ఉప‌వాసంతో మరణిస్తే జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని కెన్యా దేశంలోని ఓ చర్చి పాస్ట‌ర్ పాల్ మెకంజీ చేసిన ప్ర‌బోధం అక్క‌డి వారుగుడ్డిగా న‌మ్మారు. దీంతో ఆయ‌న‌ను అనుస‌రించారు. కానీ, ఆయ‌న ఆరోగ్యంగా ఉన్నారు. ఆయ‌న మాట‌లు న‌మ్మిన వారు మాత్రం క‌ఠిన ఉప‌వాసాల‌తో కొద్ది వారాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న ప్ర‌పంచ వ్యాప్తంగా అల‌జ‌డి రేపుతోంది.

ఇప్పటి వరకు 200 మందికిపైగా ప్రాణాలు తీసుకొన్నారని కెన్యా అధికారులు తెలిపారు. గత నెల నుంచి అధికారులు కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. మరో 600 మంది జాడ తెలియడం లేదని చెప్పారు. వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహారదీక్ష చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

ఎవ‌రీ పాల్‌?
పాల్ మెకంజీ త‌న‌ను తాను దైవ దూత‌గా ప్ర‌చారం చేసుకున్నారు.

2019లో పాల్‌ మెకంజీ అనే చర్చి పాస్టర్‌ ఈ అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల్లో విస్తరించిన ప్రాపర్టీలో మకాం వేశా డు. గతంలో మెకంజీ చర్చిలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతను అడవిలోకి మకాం మార్చాడు. అతడి అనుచరులు కూడా అడవిలోకి వెళుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు.ఈ క్ర‌మంలోనే నిరాహార దీక్ష‌లు.. మృతుల విష‌యం వెలుగు చూసింది.

ప్ర‌భువును చేరుకునేందుకు క‌ఠిన ఉప‌వాసాలు చేయాల‌న్న మెకంజీ పిలుపుతో చాలా మంది ఆహారం తినక, గొంతు నొప్పి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లుఅధికారులు గుర్తించారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు కనుగొన్నారు. మెకంజీ భార్య సహా 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది మిస్సయినట్లు కోస్ట్‌ రీజియన్‌ కమిషనర్‌ రోడ వెల్లడించారు. అంతేకాదు.. అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను విడిపించారు. మొత్తానికి మ‌త మౌఢ్యంతో పాటు కుట్ర కోణంలోనూ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

This post was last modified on May 15, 2023 8:07 am

Share
Show comments
Published by
Satya
Tags: Kenya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago