ప్రపంచ క్రికెట్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఉన్న ప్రాధాన్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా ఇది క్రేజీయెస్ట్ క్రికెట్ మ్యాచ్గా ఉంటోంది. అందులోనూ రెండు దేశాల మధ్య దశాబ్దంన్నరగా ద్వైపాక్షిక క్రికెట్ ఆగిపోవడంతో.. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడితే క్రికెట్ ప్రపంచమంతా కళ్లప్పగించి చూస్తోంది.
ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులనే కాక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మ్యాచ్ అంటే టీవీల ముందు కూలబడిపోతారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్లో తలపడ్డాక రెండు జట్ల మ్యాచ్ మరొకటి రాలేదు. ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీ మీద సందిగ్ధత కొనసాగుతుండగా.. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్లో మాత్రం రెండు జట్ల మ్యాచ్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది. అక్టోబరు 15న ఈ మెగా మ్యాచ్ జరగబోతోంది.
అక్టోబరు మొదటి వారంలో ప్రపంచకప్ మొదలు కానుండగా.. ఒకే గ్రూప్ల ఉన్న భారత్, పాకిస్థాన్ 15న ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ఏ స్టేడియంలో జరుగుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ఏదైనా పెద్ద సిటీలో ప్రముఖ స్టేడియంలోనే మ్యాచ్ ఉండబోతోంది. ఇక ఈ మెగా టోర్నీ ఫైనల్ వేదిక కూడా ఖరారైపోయింది. పునర్నిర్మాణం తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ మైదానం ఫైనల్కు వేదికగా నిలవనుంది.
టోర్నీలో మరికొన్ని మ్యాచ్లకు కూడా ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వబోతోంది. చివరగా 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలిచింది. మళ్లీ భారత్ వేదికగా జరగనున్న మెగా టోర్నీలో మరోసారి టైటిల్ గెలుస్తుందని అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.
This post was last modified on May 11, 2023 9:10 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…