ప్రగతి ఖిలా కృష్ణా జిల్లాలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంటుందంటారు. ఎన్టీయార్ స్వస్థలం కృష్ణా జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయభేరీ మోగించింది. ఈ లోపు కాలచక్రంలో నాలుగేళ్లు గడిచిపోయాయి. వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాన్ని తగ్గించుకునేందుకు జగన్ చేయని ప్రయత్నమూ లేదు..
కృష్ణా జిల్లాలో పట్టు పెంచుకునేందుకు జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. మచిలీపట్నానికి పేర్ని నాని, గుడివాడకు కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ బుతుల నేతలుగా పేరు పొందిన వారిద్దరూ ఈ సారి ఎన్నికల్లో గెలవడం కష్టమని చెబుతున్న తరుణంలో జగన్ అక్కడ పర్యటించాలనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నెల 19న గుడివాడలో టిడ్కో ఇళ్లని లబ్దిదారులకు అందజేయనున్నారు. అలాగే గుడివాడ బస్టాండ్కు శంఖుస్థానప చేయనున్నారు. ఇక ఈ నెల 22న బందరు పోర్టు శంఖుస్థానపన చేయనున్నారు. ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపట్టడం మంచిదే అయినా అసలు సంగతి తెలుసుకున్న వాళ్లు మాత్రం నవ్వుకుంటున్నారు.
గుడివాడలో టిడ్కో ఇళ్ళు టిడిపి హయాంలో నిర్మించారు. 90 శాతం పనులు చంద్రబాబు పాలనలో జరిగాయి. ఇప్పుడు వాటికి రంగులు వేసి హడావుడి చేస్తున్నారని టీడీపి విమర్శిస్తోంది. ఇక బందరు పోర్టు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. ఇప్పుడు జగన్ అదే పని చేస్తున్నారు. అంతకు మించి ఒక అడుగు ముందుకు పడటం లేదు. ఏదేమైనా చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మళ్లీ చేయడం జగనన్నకే చెల్లిందనుకోవాలి..
This post was last modified on May 9, 2023 7:07 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…