Trends

చైనాలో తొలి చాట్ జీపీటీ అరెస్టు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (కృత్రిమ మేధ) ఆటం బాంబ్ కంటే ప్రమాదకరమైనదంటూ ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. అందుకు తగ్గట్లే చోటు చేసుకున్న ఈ పరిణామం చూస్తే.. రానున్న రోజుల్లో మరెన్ని విపరిణామాలు చోటు చేసుకుంటాయన్న భావన కలుగక మానదు. మానవ మేధస్సును మించిపోయే ఈ కృత్రిమ మేధతో బోలెడన్ని అరాచకాలు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళలోనే.. కృత్రిమ మేధతో సిద్ధం చేసిన చాట్ జీపీటీ సాయంతో క్రియేట్ చేసిన ఒక వార్త చైనాలో పలువురిని పక్కదారి పట్టించింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఒక రైలు ప్రమాదం జరిగిందని.. తొమ్మిది మంది చనిపోయినట్లుగా ఒక ఫేక్ వార్తను క్రియేట్ చేశారు. అది కూడా చాట్ జీపీటీ సాయంతో. అనంతరం ఆ వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చి పలువురిని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. చైనాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై పోలీసులు రియాక్టు అయ్యారు. ఈ తప్పుడు పనికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.

వాయువ్య గాన్సు ప్రావిన్స్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. హాంగ్ అనే మారు పేరుతో నిందితుడు తప్పుడు వార్తను క్రియేట్ చేసినట్లుగా గుర్తించారు. చైనాలో చాట్ జీపీటీని దుర్వినియోగపరుస్తూ జరిగిన తొలి అరెస్టు ఇదేనని చెబుతున్నారు. ఇతగాడు క్రియేట్ చేసిన తప్పుడు వార్తను నిజమేనని నమ్మి.. కొన్నిమీడియా సంస్థలు ఈ వార్తను పబ్లిష్ చేయటం గమనార్హం. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తను క్రియేట్ చేసిన వ్యక్తిని చైనా పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో చాట్ జీపీటీని తప్పుడు మార్గాల్లో వినియోగించటం ద్వారా జరిగే నష్టాలు ఎంత భారీగా ఉంటాయన్న ఆందోళన కలుగక మానదు.

This post was last modified on May 9, 2023 12:53 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chat Gpt

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago