కేరళలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. మలప్పురం జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతంలో ఇరవై మంది మరణించారు.
షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలో పడవ ఎందుకు బోల్తా పడిందన్న విషయంపై స్పష్టత రావట్లేదు. దీనిపై అధికారులు విచారిస్తున్నారు. తనూర్ పట్టణ తువల్తీరం బీచ్ సమీపంలో 30 మందిలో వెళుతున్న పడవ బోల్తా పడింది.
దీంతో.. పలువురు పడవ అడుగు భాగానికి వెళ్లిపోయారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వటంతో వారంతా విహారయాత్రకు వచ్చి.. పడవ ప్రమాదంలో చిక్కుకుపోయారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పడవ అడుగు భాగంగా ఇరుక్కున్న విషయాన్ని గుర్తించారు. ఈ ఘోర ప్రమాదం నుంచి పది మంది బయటపడ్డారు. మరణించిన వారిలో పిల్లలే అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. సహాయక చర్యల సమన్వయం కోసం చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. వీరితో పాటు కేరళ క్రీడా మంత్రి అబ్దు రహిమాన్.. పర్యాటక మంత్రి మహమ్మద్ రియాజ్ లు దగ్గరుండి సాయం చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల వేళలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం.. చీకటి కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి.
This post was last modified on May 8, 2023 3:35 pm
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…