Trends

కేరళలో 20 మంది ప్రాణాల్ని తీసిన పడవ ప్రమాదం

కేరళలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. మలప్పురం జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతంలో ఇరవై మంది మరణించారు.

షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలో పడవ ఎందుకు బోల్తా పడిందన్న విషయంపై స్పష్టత రావట్లేదు. దీనిపై అధికారులు విచారిస్తున్నారు. తనూర్ పట్టణ తువల్తీరం బీచ్ సమీపంలో 30 మందిలో వెళుతున్న పడవ బోల్తా పడింది.

దీంతో.. పలువురు పడవ అడుగు భాగానికి వెళ్లిపోయారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వటంతో వారంతా విహారయాత్రకు వచ్చి.. పడవ ప్రమాదంలో చిక్కుకుపోయారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పడవ అడుగు భాగంగా ఇరుక్కున్న విషయాన్ని గుర్తించారు. ఈ ఘోర ప్రమాదం నుంచి పది మంది బయటపడ్డారు. మరణించిన వారిలో పిల్లలే అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ ఘోర ప్రమాదంపై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. సహాయక చర్యల సమన్వయం కోసం చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. వీరితో పాటు కేరళ క్రీడా మంత్రి అబ్దు రహిమాన్.. పర్యాటక మంత్రి మహమ్మద్ రియాజ్ లు దగ్గరుండి సాయం చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల వేళలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం.. చీకటి కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి.

This post was last modified on May 8, 2023 3:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago