Trends

అమెరికాలో తుపాకీ పేలుళ్లు.. బైడెన్ నిర్వాక‌మే కార‌ణ‌మా?!

అమెరికాలో కాల్పులు. ఈ మాట త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది. 24 గంట‌ల కింద‌టే.. అమెరికాలో కాల్పులు జ‌రిగి.. 9 మంది మృతి చెందిన దుర్ఘ‌ట‌న‌.. ప్ర‌పంచాన్ని వ‌ణికించేలా చేసింది. ఇంత‌లోనే.. మ‌ళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్ర‌జ‌ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే మాల్స్‌ను టార్గెట్ చేసుకుంటున్న దుండ‌గులు.. పిట్ట‌ల‌ను కాల్చిన‌ట్టు మ‌నుషుల‌ను కాల్చేస్తున్నారు. ఇదేదో.. స‌ర‌దా.. అనుకుంటున్నారో.. మ‌రేమో.. తెలియ‌దు కానీ.. ఒక‌రిద్ద‌రు చేస్తున్న దారుణాల‌తో కుటుంబాల‌కు కుటుంబాలే క‌న్నీరు పెడుతున్నాయి.

అయితే.. అమెరికాలో జ‌రుగుతున్న ఈ దుండ‌గుల విచ్చ‌ల‌విడి కాల్పుల వెనుక‌.. బైడెన్ స‌ర్కారు నిర్వాక‌మే ఉంద‌ని అక్క‌డి మీడియా కోడై కూస్తోంది. దీనికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు చెబుతున్నారు ప‌రిశీల‌కులు. క‌రోనా అనంత‌రం త‌లెత్తిన ఆర్థిక పరిస్థితుల‌ను బైడెన్ ప్ర‌భుత్వం.. స‌రిగా డీల్ చేయ‌లేక పోయింది. దీంతో ఆర్థిక మాంద్యం త‌లెత్తింద‌ని వారు చెబుతున్న మాట‌. ఫ‌లితంగా అనేక ఐటీ సంస్థ‌ల్లో ఉద్యోగాల కోత కొన‌సాగుతోంది.

ఇలా.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త‌గా ఉద్యోగాలు కూడా దక్క‌డం లేద‌ని.. మీడియా చెబుతోంది. ప్ర‌స్తుతం అమెరికా నిరుద్యోగ‌త 40 శాతం ఉంద‌ని అంచ‌నాలు వేశారు. ట్రంప్ హ‌యాంలో 25 శాతం ఉన్న నిరుద్యోగ‌త‌.. ఇప్పుడు 15 శాతం పెరిగింద‌ని.. చెబుతున్నారు. ఇక‌, ఆర్థికంగా పెట్టుబ‌డులు కూడా అమెరికాకు మంద‌గించాయి. దీనికి తోడు.. ర‌ష్యా నుంచి దిగుమ‌తులు ఆగిపోయి.. ధ‌ర‌లు ఆకాశానికి అంటుతున్నాయి. ఉక్రెయిన్‌ను మ‌ద్ద‌తిస్తున్నందున‌.. ర‌ష్యా పెట్టుబ‌డి దారులు వెన‌క్కి వెళ్లిపోయారు.

దీంతో అమెరికాలో ఆర్థిక ప‌రిస్థితి తీవ్ర మంద‌గ‌మ‌నంలో ఉంద‌ని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఎలా చూసుకున్నా.. అమెరికాలో ప‌రిస్థితులు ఆశాజ‌నకంగా లేవ‌ని.. అందుకే..యువ‌త దారి త‌ప్పుతున్నార‌ని అంటున్నారు. చిత్రంగా అమెరికాలో ఏడాదికాలంగా మాన‌సిక కౌన్సిల్ కేంద్రాలు హౌస్ ఫుల్‌గా న‌డుస్తున్నాయి. అంటే..దాదాపు 80 శాతం మంది అమెరిక‌న్లు ఆర్థిక‌, వుద్యోగ ప‌ర‌మైన ఒత్తిడిని త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల కాలంలో కాల్పులు పెరిగిపోయాయ‌ని అక్క‌డి మీడియా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 8, 2023 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago