Trends

అమెరికాలో తుపాకీ పేలుళ్లు.. బైడెన్ నిర్వాక‌మే కార‌ణ‌మా?!

అమెరికాలో కాల్పులు. ఈ మాట త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది. 24 గంట‌ల కింద‌టే.. అమెరికాలో కాల్పులు జ‌రిగి.. 9 మంది మృతి చెందిన దుర్ఘ‌ట‌న‌.. ప్ర‌పంచాన్ని వ‌ణికించేలా చేసింది. ఇంత‌లోనే.. మ‌ళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్ర‌జ‌ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే మాల్స్‌ను టార్గెట్ చేసుకుంటున్న దుండ‌గులు.. పిట్ట‌ల‌ను కాల్చిన‌ట్టు మ‌నుషుల‌ను కాల్చేస్తున్నారు. ఇదేదో.. స‌ర‌దా.. అనుకుంటున్నారో.. మ‌రేమో.. తెలియ‌దు కానీ.. ఒక‌రిద్ద‌రు చేస్తున్న దారుణాల‌తో కుటుంబాల‌కు కుటుంబాలే క‌న్నీరు పెడుతున్నాయి.

అయితే.. అమెరికాలో జ‌రుగుతున్న ఈ దుండ‌గుల విచ్చ‌ల‌విడి కాల్పుల వెనుక‌.. బైడెన్ స‌ర్కారు నిర్వాక‌మే ఉంద‌ని అక్క‌డి మీడియా కోడై కూస్తోంది. దీనికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు చెబుతున్నారు ప‌రిశీల‌కులు. క‌రోనా అనంత‌రం త‌లెత్తిన ఆర్థిక పరిస్థితుల‌ను బైడెన్ ప్ర‌భుత్వం.. స‌రిగా డీల్ చేయ‌లేక పోయింది. దీంతో ఆర్థిక మాంద్యం త‌లెత్తింద‌ని వారు చెబుతున్న మాట‌. ఫ‌లితంగా అనేక ఐటీ సంస్థ‌ల్లో ఉద్యోగాల కోత కొన‌సాగుతోంది.

ఇలా.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త‌గా ఉద్యోగాలు కూడా దక్క‌డం లేద‌ని.. మీడియా చెబుతోంది. ప్ర‌స్తుతం అమెరికా నిరుద్యోగ‌త 40 శాతం ఉంద‌ని అంచ‌నాలు వేశారు. ట్రంప్ హ‌యాంలో 25 శాతం ఉన్న నిరుద్యోగ‌త‌.. ఇప్పుడు 15 శాతం పెరిగింద‌ని.. చెబుతున్నారు. ఇక‌, ఆర్థికంగా పెట్టుబ‌డులు కూడా అమెరికాకు మంద‌గించాయి. దీనికి తోడు.. ర‌ష్యా నుంచి దిగుమ‌తులు ఆగిపోయి.. ధ‌ర‌లు ఆకాశానికి అంటుతున్నాయి. ఉక్రెయిన్‌ను మ‌ద్ద‌తిస్తున్నందున‌.. ర‌ష్యా పెట్టుబ‌డి దారులు వెన‌క్కి వెళ్లిపోయారు.

దీంతో అమెరికాలో ఆర్థిక ప‌రిస్థితి తీవ్ర మంద‌గ‌మ‌నంలో ఉంద‌ని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఎలా చూసుకున్నా.. అమెరికాలో ప‌రిస్థితులు ఆశాజ‌నకంగా లేవ‌ని.. అందుకే..యువ‌త దారి త‌ప్పుతున్నార‌ని అంటున్నారు. చిత్రంగా అమెరికాలో ఏడాదికాలంగా మాన‌సిక కౌన్సిల్ కేంద్రాలు హౌస్ ఫుల్‌గా న‌డుస్తున్నాయి. అంటే..దాదాపు 80 శాతం మంది అమెరిక‌న్లు ఆర్థిక‌, వుద్యోగ ప‌ర‌మైన ఒత్తిడిని త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల కాలంలో కాల్పులు పెరిగిపోయాయ‌ని అక్క‌డి మీడియా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 8, 2023 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

54 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

2 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

3 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago