ఇటీవల కాలంలో నోట్ల కట్టలు.. రోడ్ల మీద విసిరేస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఏరుకునేవారు .. పెద్ద ఎత్తున గుమిగూడి వాటిని ఏరి సొంతం చేసుకుంటున్న ఘటనలు కూడా తరచుగా వార్తలుగా వస్తున్నాయి. ఇలానే ఇప్పుడు ఏకంగా కొన్ని నోట్ల కట్టలు ఏకంగా మురికి కాల్వలో కనిపించడం..వాటిని ఏరుకునేందుకు స్థానికులు ఆ డ్రైనేజీలో దిగి ఏరుకోవడం వంటివి దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారాయి. ఐటీకి భయపడో.. లేదా .. ఎవరికీ దొరకకూడదనో.. కొందరు అక్రమ సంపాదన పరులు ఇలా.. తమ వద్ద ఉన్న ధనాన్ని రోడ్లమీదకో.. కాల్వల్లోకో విసిరేస్తుండడం గమనార్హం.
తాజాగా ఘటన ఎక్కడంటే..
బిహార్ రోహ్తాస్ జిల్లా సాసారం ప్రాంతంలోని ఓ మురుగు కాలువలో నోట్ల కట్టలు పడేయడం సంచలనంగా మారింది. దీంతో స్థానికులందరు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకుని డబ్బుల కోసం వెతికారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ నోట్ల కట్టల కోసం కాలువ వద్దకు చేరి వెతకడం ప్రారంభించారు. సాసారంలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు.
అయినా డ్రైనేజీలోకి అప్పటికే చేరి డబ్బులు ఏరుకునే ప్రయత్నంలో ఉన్న స్థానికులను పోలీసులు ఏమీ చేయలేకపోయారు. పోలీసులు మాత్రం ఇదంతా పుకార్లు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం.. తమకు నోట్ల కట్టలు దొరికాయని చెబుతున్నారు. శనివారం ఉదయం తాము కాలువలో నోట్లు తేలడాన్ని గుర్తించామని వారు వెల్లడించారు. దీంతో అందులోకి దిగి డబ్బులు కోసం వెతుకామని పేర్కొన్నారు.
కాలువలో నోట్ల కట్టలు ఉన్నాయనే సమాచారం.. కొంత సమయంలోనే ఊరంతా పాకిందని వారు వెల్లడించారు. దీంతో చాలా మంది కాలువ వద్దకు చేరుకుని డబ్బుల కోసం వెతికారని తెలిపారు. అయితే.. పోలీసులు ఈ నోట్ల కట్టల విషయంపై ప్రత్యేకంగా దృష్టిప ఎట్టారు. ఎవరివి..? ఎక్కడి నుంచి వచ్చాయనే సమాచారాన్ని కూపీ లాగుతున్నారు.
This post was last modified on May 7, 2023 9:11 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…