అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలో శనివారం సాయంత్రం స్థానిక టెక్సాస్ మాల్లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో టీనేజీ యువతి సహా 9 మంది చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. కాల్పులకు తెగబడ్డ దుండగుడు ఎందుకు అలా చేశాడనేది మాత్రం తెలియలేదు. అయితే.. కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు.
దుండగుడిని వెంబడించిన పోలీసులు అతనిని కాల్చిచంపారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అలెన్ పోలీసులు పేర్కొన్నారు. టెక్సాస్ పరిధిలోని అలెన్ ప్రాంతంలో.. అలెన్ ప్రీమియం అవుట్లెట్స్ మాల్లో ఈ ఘటన చోటు చేసుకుందని సీటీ పోలీస్ చీఫ్ బ్రియాన్ హార్వే వెల్లడించారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. మాల్ నుంచి బయటకు వస్తున్న వందలాది మందిపై దుండగుడు తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు గుర్తించారు. అయితే.. కొందరు కాల్పుల నుంచి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ విచారం వ్యక్తం చేశారు.
దీనిని దారుణంగా పేర్కొన్నారు. ఈ కాల్పులను “మాటల్లో చెప్పలేని విషాదం”గా అభివర్ణిస్తూ, స్థానిక అధికారులకు అవసరమైన ఏదైనా సహాయం అందించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కాగా, యునైటెడ్ స్టేట్స్లో సామూహిక కాల్పులు ఇటీవల సర్వసాధారణంగా మారాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కనీసం 200 ఘటనలు చోటు జరిగినట్టు గన్ వయోలెన్స్(తుపాకీ విధ్వంసాలు) అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు.. దేశంలో తుపాకీ సంస్కృతిని నిషేధించాలన్న బిల్లు చట్టసభలోనే మూలుగుతుండడం గమనార్హం.
This post was last modified on May 7, 2023 12:00 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…