Trends

అమెరికాలో కాల్పులు.. 9 మంది దుర్మ‌రణం.

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో ద‌ద్ద‌రిల్లింది. కాలిఫోర్నియాలో శనివారం సాయంత్రం స్థానిక టెక్సాస్ మాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో టీనేజీ యువతి సహా 9 మంది చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని స‌మాచారం. కాల్పుల‌కు తెగ‌బడ్డ దుండ‌గుడు ఎందుకు అలా చేశాడ‌నేది మాత్రం తెలియ‌లేదు. అయితే.. కాల్పుల స‌మాచారం తెలుసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు.

దుండగుడిని వెంబ‌డించిన పోలీసులు అత‌నిని కాల్చిచంపారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అలెన్ పోలీసులు పేర్కొన్నారు. టెక్సాస్ పరిధిలోని అలెన్ ప్రాంతంలో.. అలెన్ ప్రీమియం అవుట్‌లెట్స్ మాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని సీటీ పోలీస్ చీఫ్ బ్రియాన్ హార్వే వెల్లడించారు.

ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. మాల్ నుంచి బయటకు వస్తున్న వందలాది మందిపై దుండగుడు తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు గుర్తించారు. అయితే.. కొంద‌రు కాల్పుల నుంచి త‌ప్పించుకున్నార‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ విచారం వ్యక్తం చేశారు.

దీనిని దారుణంగా పేర్కొన్నారు. ఈ కాల్పులను “మాటల్లో చెప్పలేని విషాదం”గా అభివర్ణిస్తూ, స్థానిక అధికారులకు అవసరమైన ఏదైనా సహాయం అందించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కాగా, యునైటెడ్ స్టేట్స్‌లో సామూహిక కాల్పులు ఇటీవల సర్వసాధారణంగా మారాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కనీసం 200 ఘటనలు చోటు జ‌రిగిన‌ట్టు గన్ వయోలెన్స్‌(తుపాకీ విధ్వంసాలు) అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మ‌రోవైపు.. దేశంలో తుపాకీ సంస్కృతిని నిషేధించాల‌న్న బిల్లు చ‌ట్ట‌స‌భ‌లోనే మూలుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

1 hour ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

3 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

4 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

4 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

5 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

5 hours ago