పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మూణ్నాలుగు చిత్రాలను లైన్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నాడు. ఐతే మిగతా చిత్రాలతో పోలిస్తే ముందుగా మొదలై.. అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ఈ చిత్రం రెండేళ్ల కిందట్నుంచి మేకింగ్ దశలోనే ఉంది. దీని తర్వాత మొదలైన సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఒకటి ఆల్రెడీ రిలీజైంది. ఇంకొకటి విడుదలకు ముస్తాబవుతోంది.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఇంకో రెండు సినిమాలు కూడా ‘హరిహర..’ కంటే ముందు వచ్చేస్తాయేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ శ్రమ లేకుండా, తక్కువ డేట్లతో అయిపోయే సినిమాలకే పవన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇది ‘హరిహర..’ దర్శక నిర్మాతలు క్రిష్, ఏఎం రత్నంలను కలవరపాటుకు గురి చేస్తోంది.
పరిస్థితి చూస్తుంటే.. 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమాకు అవసరమైనన్ని డేట్లు పవన్ ఇచ్చి పూర్తి చేసి, రిలీజ్కు సిద్ధం చేయడం కష్టమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిధి కొంచెం ఎక్కువే ఉన్న కథను రెండు భాగాలు చేసి రిలీజ్ చేద్దాం అనే ప్రతిపాదనపై క్రిష్, రత్నం సీరియస్గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా షూట్ చేసిన సినిమాకు ఒక మెరుపు లాంటి ముగింపును ఇచ్చి.. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేద్దామని.. 2024 ఎన్నికల తర్వాత సెకండ్ పార్ట్ సంగతి చూద్దామని అనుకుంటున్నారట.
కాకపోతే క్రిష్కు ఈ రెండు భాగాల సెంటిమెంటు కొంచెం టెన్షన్ పెట్టేదే. ‘యన్.టి.ఆర్’ను ఇలాగే ఒక సినిమాగా మొదలుపెట్టి మధ్యలో రెండు చేశారు. అది ఎటూ కాకుండా పోయింది. బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదురైంది. క్రిష్ ఇలాంటి సెంటిమెంట్లను పట్టించుకునే టైపులా కనిపించడు కానీ.. ఎంతో రిస్క్ చేసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రత్నం, చుట్టూ ఉన్న వాళ్లు దీనికి భయపడొచ్చు. మరి రెండు భాగాల విషయంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on May 6, 2023 10:43 am
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…