పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మూణ్నాలుగు చిత్రాలను లైన్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నాడు. ఐతే మిగతా చిత్రాలతో పోలిస్తే ముందుగా మొదలై.. అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ఈ చిత్రం రెండేళ్ల కిందట్నుంచి మేకింగ్ దశలోనే ఉంది. దీని తర్వాత మొదలైన సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఒకటి ఆల్రెడీ రిలీజైంది. ఇంకొకటి విడుదలకు ముస్తాబవుతోంది.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఇంకో రెండు సినిమాలు కూడా ‘హరిహర..’ కంటే ముందు వచ్చేస్తాయేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ శ్రమ లేకుండా, తక్కువ డేట్లతో అయిపోయే సినిమాలకే పవన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇది ‘హరిహర..’ దర్శక నిర్మాతలు క్రిష్, ఏఎం రత్నంలను కలవరపాటుకు గురి చేస్తోంది.
పరిస్థితి చూస్తుంటే.. 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమాకు అవసరమైనన్ని డేట్లు పవన్ ఇచ్చి పూర్తి చేసి, రిలీజ్కు సిద్ధం చేయడం కష్టమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిధి కొంచెం ఎక్కువే ఉన్న కథను రెండు భాగాలు చేసి రిలీజ్ చేద్దాం అనే ప్రతిపాదనపై క్రిష్, రత్నం సీరియస్గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా షూట్ చేసిన సినిమాకు ఒక మెరుపు లాంటి ముగింపును ఇచ్చి.. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేద్దామని.. 2024 ఎన్నికల తర్వాత సెకండ్ పార్ట్ సంగతి చూద్దామని అనుకుంటున్నారట.
కాకపోతే క్రిష్కు ఈ రెండు భాగాల సెంటిమెంటు కొంచెం టెన్షన్ పెట్టేదే. ‘యన్.టి.ఆర్’ను ఇలాగే ఒక సినిమాగా మొదలుపెట్టి మధ్యలో రెండు చేశారు. అది ఎటూ కాకుండా పోయింది. బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదురైంది. క్రిష్ ఇలాంటి సెంటిమెంట్లను పట్టించుకునే టైపులా కనిపించడు కానీ.. ఎంతో రిస్క్ చేసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రత్నం, చుట్టూ ఉన్న వాళ్లు దీనికి భయపడొచ్చు. మరి రెండు భాగాల విషయంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on May 6, 2023 10:43 am
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…