పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మూణ్నాలుగు చిత్రాలను లైన్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నాడు. ఐతే మిగతా చిత్రాలతో పోలిస్తే ముందుగా మొదలై.. అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ఈ చిత్రం రెండేళ్ల కిందట్నుంచి మేకింగ్ దశలోనే ఉంది. దీని తర్వాత మొదలైన సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఒకటి ఆల్రెడీ రిలీజైంది. ఇంకొకటి విడుదలకు ముస్తాబవుతోంది.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఇంకో రెండు సినిమాలు కూడా ‘హరిహర..’ కంటే ముందు వచ్చేస్తాయేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ శ్రమ లేకుండా, తక్కువ డేట్లతో అయిపోయే సినిమాలకే పవన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇది ‘హరిహర..’ దర్శక నిర్మాతలు క్రిష్, ఏఎం రత్నంలను కలవరపాటుకు గురి చేస్తోంది.
పరిస్థితి చూస్తుంటే.. 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమాకు అవసరమైనన్ని డేట్లు పవన్ ఇచ్చి పూర్తి చేసి, రిలీజ్కు సిద్ధం చేయడం కష్టమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిధి కొంచెం ఎక్కువే ఉన్న కథను రెండు భాగాలు చేసి రిలీజ్ చేద్దాం అనే ప్రతిపాదనపై క్రిష్, రత్నం సీరియస్గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా షూట్ చేసిన సినిమాకు ఒక మెరుపు లాంటి ముగింపును ఇచ్చి.. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేద్దామని.. 2024 ఎన్నికల తర్వాత సెకండ్ పార్ట్ సంగతి చూద్దామని అనుకుంటున్నారట.
కాకపోతే క్రిష్కు ఈ రెండు భాగాల సెంటిమెంటు కొంచెం టెన్షన్ పెట్టేదే. ‘యన్.టి.ఆర్’ను ఇలాగే ఒక సినిమాగా మొదలుపెట్టి మధ్యలో రెండు చేశారు. అది ఎటూ కాకుండా పోయింది. బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదురైంది. క్రిష్ ఇలాంటి సెంటిమెంట్లను పట్టించుకునే టైపులా కనిపించడు కానీ.. ఎంతో రిస్క్ చేసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రత్నం, చుట్టూ ఉన్న వాళ్లు దీనికి భయపడొచ్చు. మరి రెండు భాగాల విషయంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా…
ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా……
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…