థాయ్ ల్యాండ్ లో గ్యాంబ్లింగ్ ఆడటం పూర్తిగా నిషిద్ధం. థాయ్ లోని బ్యాంకాక్, పట్టాయా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాలన్న విషయం అందరికీ తెలిసిందే. పై రెండు ప్రాంతాల్లో క్యాసినోల రూపంలో గ్యాంబ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న లాటరీలు తప్ప ఇంకే విధమైన జూదాన్ని థాయ్ చట్టాలు అనుమతించవు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న గ్యాంబ్లింగ్ మొత్తం అనధికారికంగా జరుగుతున్నదే.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే గ్యాంబ్లింగ్ ఆడుతు పట్టుబడితే నిర్వాహకులతో పాటు ఆడుతూ దొరికిన వాళ్ళకు కూడా కఠినశిక్షలు తప్పవు. గతంలో క్యాసినోలు నిర్వహించిన సందర్భాల్లో పోలీసులు దాడులుచేసి అరెస్టులు చేసిన సందర్భాలున్నాయి. అప్పట్లో వాళ్ళకి థాయ్ కోర్టులు చాలా పెద్ద శిక్షలు విధించిన ఘటనలున్నాయి. ఇపుడిదంతా ఎందుకంటే సోమవారం గ్యాంబ్లింగ్ ఆడిస్తు చికోటి ప్రవీణ్ తో పాటు 93 మంది పట్టుబడ్డారు కాబట్టే.
తెలుగు రాష్ట్రాల్లో చికోటి ప్రవీణ్ అంటే పెద్ద గ్యాంబ్లర్ అన్న విషయం తెలియని వారుండరు. అందుకే ఇపుడు థాయ్ లో క్యాసినోల నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. 1935లోనే అక్కడ గ్యాంబ్లింగ్ ను నిషేధించారు. అందుకనే అనధికారికంగా సెల్లార్లలోను, హోటళ్ళల్లోను, రిసార్టుల్లోను, ప్రైవేటు పార్టీల్లోను క్యాసినోలను నిర్వహిస్తుంటారు. ఇపుడు చికోటి కూడా సెవన్ స్టార్ హోటల్లోని కన్వెన్షన్ హాళ్ళను అద్దెకు తీసుకున్నారు.
థాయ్ చట్టాల ప్రకారం గ్యాంబ్లింగ్ ఆడుతు పట్టుపడితే భారీ జరిమానాలు తప్పవు. అలాగే ఒక్కోసారి యావజ్జీవ శిక్షలు కూడా పడతాయి. మొదటిసారి గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని అనిపిస్తే దొరికిన వాళ్ళకి పోలీసులు ఫైన్ వేసి, కౌన్సిలింగ్ చేసి వార్నింగ్ ఇచ్చిన వదిలేస్తారు. ఇపుడు జరిగిందిదే. పట్టుబడ్డ 93 మందిలో 83 మంది తెలుగువాళ్ళే. చికోటితో పాటు మరో ఆరుగురిని మాత్రమే పోలీసులు అరెస్టుచేశారు. మిగిలిన 78 మందికి పోలీసులు కౌన్సిలింగ్ చేసి, ఫైన్ కట్టించుకుని వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేశారు. బహుశా వీళ్ళల్లో ఎక్కువమంది మొదటిసారి పటాయాకు వచ్చుంటారే. అందుకనే వదిలిపెట్టారు. చికోటి తదితరులు రెగ్యులర్ గా పట్టాయాకు వస్తున్నట్లు వాళ్ళ పాస్ పోర్టులను బట్టి అర్ధమయ్యుంటుంది. అందుకనే అరెస్టు చేసింది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on May 2, 2023 2:38 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…