రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్.. భారత ప్రజల మనోభావాలు దెబ్బతీసే పనికి ఒడిగట్టింది. హిందువులు ఆరాధించే కాళీమాత ఫొటోను అభ్యంతరకరమైన రీతిలో పోస్ట్ చేసింది. కాళీమాతను హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోతో పోల్చుతూ రెండు ఫొటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తొలి ఫొటోలో బాంబు దాడి అనంతరం సంభవించే అగ్ని, దట్టమైన పొగ దృశ్యాలున్నాయి. మరో ఫొటోలో దట్టమైన పొగంతా స్కర్టి.. అగ్ని అంతా జుత్తుగా మారిపోయినట్లుగా ఉన్న కాళీమాత ఫొటో ఉంది.
నాలుక బయటకు తెరిచి.. పుర్రెలను మాలగా వేసుకున్న కాళీమాత ఫొటో చూస్తే మార్లిన్ మన్రోయే స్ఫురణకు వచ్చేవిధంగా అభ్యంతరకరంగా ఉంది. పైగా ఈ ఫొటోల కింద కళానైపుణ్యం అనే అర్థంలో ‘వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోపై హిందూత్వ వాదులు భగ్గుమన్నారు. కాళీమాతను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించడం అంటే తమ ధార్మిక భావాల మీద దాడి చేసి అవమానించడమేనని కన్నెర్ర చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఉక్రెయిన్ తీరుకు నిరసనగా పోస్టులు వెల్లువెత్తాయి.
‘హిందువుల విశ్వాసాలపై హాస్యం తగదు. ఈ పోస్టును ఉక్రెయిన్ తక్షణమే ఉపసంహరించుకోవడమే కాదు.. హిందువులకు క్షమాపణలూ చెప్పాలి’ అని మోనికా వర్మ అనే యువతి ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. ‘రష్యా బాధిత దేశంగా చెప్పుకొంటున్న ఉక్రెయిన్, కాళీమాతను ఇలా అభ్యంతరకమైన రీతిలో చిత్రీకరించడం మానుకొని, దుష్టశక్తులపై విజయం కోసం ఆమె ఆశీర్వాదం కోరాలి’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కొందరైతే ఉక్రెయిన్పై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్వత్రా విమర్శలు రావడంతో ఉక్రెలు ఎన్ రక్షణ మంత్రిత్వశాఖ కాళీమాత ఫొటోను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే డిలీట్ చేసింది. అయితే, దీనిపై భారత్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.
This post was last modified on May 1, 2023 11:22 am
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…