అవును.. వీడు మామూలోడు కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే మస్కా కొట్టేశాడు. నిఘా విభాగం ఏం చేస్తుందో కానీ అంత జరిగిపోయిన తర్వాత అసలు విషయం బయటకువచ్చి అవాక్కు అయ్యేలా చేసింది. తాజాగా ఈ పరిణామం తమిళనాడులో చోటు చేసుకుంది. తనకుతాను వీల్ ఛైర్ క్రికెట్ కెప్టెన్ గా పరిచయం చేసుకోవటమే కాదు.. ఈ మధ్యనే ప్రపంచకప్ ను సాధించినట్లుగా బిల్డప్ ఇచ్చి.. ముఖ్యమంత్రిగా ఫోటోలు దిగిన మాయగాడి ఉదంతమిది.
రామనాథపురం జిల్లా కడలాడి తాలూకాకు చెందిన వినోద్ బాబు దివ్యాంగుడు. భారత వీల్ ఛైర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా తనను తాను పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతుంటాడు. 2022లో తాను కెప్టెన్ గా వ్యవహరించిన జట్టు ఆసియా కప్ ను గెలిచినట్లుగా తమిళనాడు మంత్రులు రాజకన్నప్పన్.. ఉయనిధి స్టాలిన్ ను కలిశారు. అంతేకాదు.. లండన్ లో జరిగిన టీ20ప్రపంచ కప్ ను గెలిచామని తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిశారు.
అయితే.. వినోద్ బాబు చెప్పేవన్నీ అబద్ధాలుగా చెన్నై సచివాలయానికి సమాచారం అందింది. దీనిపై నిఘా వర్గాలు దర్యాప్తు చేయగా.. దొంగ మాటలు చెబుతూ వినోద్ బాబు మోసాలకు పాల్పడుతుంటాడే కానీ.. అసలు జట్టులోనే లేడన్న విషయాన్ని ధ్రువీకరించుకున్న అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. వినోద్ బాబుకు అసలు పాస్ పోర్టు కూడా లేదన్న విషయాన్ని తాజాగా గుర్తించారు.
ఇప్పటికే మాయమాటలతో పలువురిని మోసం చేసిన చరిత్ర అతనికి ఉందని గుర్తించారు. అతడి మాటల్ని నమ్మి పలువురు మంత్రులు..రాజకీయ నాయకులు ఆర్థిక సాయాన్ని అందించినట్లుగా గుర్తించారు. దీంతో.. ఉలిక్కిపడ్డ అధికారులు నిందితుడిపై తాజాగా కేసు నమోదు చేసి.. అతన్ని అదుపులోకి తీసుకునే పనిలో పడ్డారు. మోసాలు చేసేటోడు.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం మస్కా కొట్టిన వైనం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on April 29, 2023 11:15 am
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…