తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికీ అర్థం కావు. ఎవరితో ఎప్పుడు స్నేహంగా ఉంటారో..ఎవరిని ఎప్పుడు గెంటి వేస్తారో చెప్పడం ఎంతటి రాజకీయ దురంధరుడికైనా కష్టమే.తిట్టిన వారినే అక్కున చేర్చుకునే సమర్థత కూడా కేసీఆర్ కే ఉంది. అందుకే బీఆర్ఎస్ అధినేత విషయంలో అవునంటే కాదనిలే… కాదంటే అవుననిలే అన్న పాట పాడుతుంటారు..
నాలుగు నెలల క్రితం కేసీఆర్ ఒక పాచిక వదిలారు. ఈ సారి సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని వారంతా బాగా పనిచేసుకుని నియోజకవర్గాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించారు. దానితో సిట్టింగులు అమితానందంలో మునిగిపోగా, ఆశావహులు తీవ్ర నిరాశలోకి జారుకున్నారు. ఇంతకాలం కష్టపడి పనిచేసినందుకు ఈసారైనా టికెట్ వస్తుందనుకుంటే ఇలా బాంబు పేల్చాడేమిట్రా అని కొందరు బయటకు తిట్టుకుంటే మరికొందరు లోలోన మథనపడ్డారు.
కేసీఆర్ స్టేట్ మెంట్స్ ను నమ్మాల్సిన పనిలేదని కొన్ని వర్గాల్లో వినిపించిన మాట. బీజేపీ దూకుడు తారా స్థాయిలో ఉన్న రోజుల్లో ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించినట్లు కొందరు వాదించారు. ఎన్నికల నాటికి ఆయన ప్లేట్ ఫిరాయిస్తారని కొందరికి మొండి చేయి చూపించి కొత్తవారికి అవకాశం ఇస్తారని చెప్పుకున్నారు. ఇప్పుడు వారి మాటే నిజమయ్యేలా ఉంది.
గురువారం జరిగిన పార్టీ సమావేశంలో కేసీఆర్, తమ ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితబంధు నిధులను లబ్ధిదారులకు అందించే క్రమంలో రెండు మూడు లక్షలు కమిషన్ కొట్టేస్తున్నారని వారి జాబితా మొత్తం తన వద్ద ఉందని చెప్పారు. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని, వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఉండవని హెచ్చరించారు. పార్టీలో వర్గపోరు ఎక్కువైందని, కొందరు ఎమ్మెల్యేల ప్రోగ్రస్ సరిగ్గా లేదని వివరించారు.
తాజా మీటింగుతో కేసీఆర్ వైఖరి వెల్లడైందని ఇంటా బయట వినిపిస్తున్న మాట. సీఎం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము ముందే హెచ్చరించామని వారు పట్టించుకోనందునే ఇప్పుడు కేసీఆర్ ట్రాప్ లో పడ్డారని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనని బీజేపీ విమర్శిస్తోంది. మరి అది నిజమో కాదో చూడాలి….
This post was last modified on April 29, 2023 4:34 pm
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…