ఇటీవల కాలంలో విమాన ప్రయాణంలో చోటు చేసుకుంటున్న విపరీతాలు అన్నిఇన్ని కావు. ఎయిర్ హోస్టెస్ మీద వేధింపులు..వారిని ఇబ్బంది పెట్టటం కొత్తేం కాదు. కానీ.. తోటి ప్రయాణికుల మీద మూత్ర విసర్జన చేయటం.. అనుచితంగా ప్రవర్తిస్తున్న వైఖరులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజా ఉదంతంలో అయితే.. ఏకంగా కొట్టేసుకున్న వైనం షాకింగ్ గా మారింది.
ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన తాజా ఉదంతం గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. నలుగురు ప్రయాణికుల మధ్య మొదలైన వివాదం అంతకంతకూ పెరగటమే కాదు.. వారి మధ్య ముష్ఠిఘాతాలకు కారణమైంది. ఒకరినొకరు తన్నుకొంటూ.. విమానంలోని వస్తువుల్ని డ్యామేజ్ చేసే వరకు వెళ్లింది. క్యాన్జ్ నుంచి నార్త్ ఆస్ట్రేలియాకు వెళుతున్న విమానంలో ఈ అసాధారణ ఉదంతం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మొదట ముగ్గురు ప్రయాణికుల మధ్య వివాదం మొదలైంది. అది కాస్తా పెరిగి పెద్దదైంది. ఈ క్రమంలో ఒక మహిళ గాజు సీసాతో మరో ప్రయాణికుడి మీద దాడికి ప్రయత్నించింది. దీంతో ఒకరినొకరు తన్నుకోవటం.. తోసుకోవటం వరకు విషయం వెళ్లింది. విమాన సిబ్బంది ఎంత చెప్పినా వారు ఊరుకోలేదు.అంతకంతకూ గొడవ పెరిగి.. తన్నులాటకు వెళ్లటంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో విమానాన్ని గమ్యస్థానం వరకు వెళ్లకుండా దగ్గర్లోని ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లారు. అలా క్వీన్స్ ల్యాండ్ కు వెళ్లిన విమానం.. గొడవ సద్దుమణిగాక మళ్లీ టేకాఫ్ అయ్యింది. కానీ.. వారి మధ్య మళ్లీ గొడవ రాజుకుంది. ఈసారి గొడవ మరింత పెరిగి పెద్దది కావటమే కాదు.. విమాన కిటికీ అద్దం పగలటంతో పాటు.. కొన్ని వస్తువులు కూడా విరిగిపోయాయి. దీంతో హడలిపోయిన సిబ్బంది.. వారిని సముదాయించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. దీంతో.. విమానం గమ్యస్థానానికి చేరుకున్నంతనే నలుగురు ప్రయాణికుల్ని పోలీసులు అరెస్టు చేశారు. గొడవ పడిన ప్రయాణికుల్లో ఒకరి వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విమాన ప్రయాణం మిగిలిన ప్రయాణికులకు పీడకలగా మారిందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on April 27, 2023 5:51 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…