కొన్ని కొన్ని సంగతులు.. నమ్మేందుకు శక్యం కాదు! కానీ, అవి పక్కా నిజాలు. ఇలా కూడా జరుగుతాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ, ఈ దేశంలో ఏదైనా కూడా సాధ్యమే అంటున్నారు పరిశీలకులు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రొఫెసర్ రిటైర్ అయ్యారు. తాజాగా ఆయన తన ఇంట్లో ట్యూషన్లు చెబుతున్నారు. సరే.. అందరూ ఏమనుకుంటారు? ఆయనంత సీనియర్ కాబట్టి.. చాలా బాగా పాఠాలు చెబుతారు అనేకదా!
కానీ, సదరు ప్రొఫెసర్ గారు.. దొంగతనం ఎలా చేయాలి? అనే విషయాన్ని పక్కగా నూరి పోస్తున్నారు. అంతేకాదు.. అంతర్రాష్ట్ర దొంగలను ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకుని.. దొంగతాను చేయడం.. పోలీసులకు దొరికి పోకుండా.. బయట పడడం.. ఎప్పటికీ.. అంతుచిక్కకుండా వ్యవహరించడం.. అనే మూడు కాన్సెప్టులపై ఆయన ఇస్తున్న లెక్చరర్లు పోలీసుల ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యం గొలుపుతున్నాయి.
అంతేనా.. ఒక్కసారి ఆయన లెక్చర్ వింటే.. దొంగతనం చేయాలని అనిపించకుండా ఉండదు. మావోయిస్టు నేతలు ప్రసంగాలు విన్నాక.. వారిలో చేరిపోయినట్టే.. ఈ ప్రొఫెసర్ గారి పాఠాలు విన్నాక.. పదుల సంఖ్యలో యువత దొంగతనాల బాట పట్టారంటే.. మరింత ఆశ్చర్యం వేస్తుంది. ఇటీవల బిహార్ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం జరిగింది. డబ్బులు పోతే బాధపడేవారు కాదు. నగలు పోయినా.. ఇబ్బంది ఉండేది కాదు. కానీ, సదరు ఎమ్మెల్యే పదోతరగతి సర్టిఫికెట్ దొంగలు దోచుకెళ్లారు.
ఆయనకు ఉన్న ఒకే ఒక్క అర్హత టెన్త్క్లాస్. దీంతోనే ఆయన నాలుగు ఎన్నికల నుంచి నెట్టుకువస్తున్నారట. ఇప్పుడు అది పోవడంతో సీరియస్గా తీసుకుని..కంప్లెయింట్ ఇచ్చి.. ఫాలో అప్ చేశారు. ఈ క్రమం లో దొరికిన దొంగలను పోలీసులు విచారించారు. దీంతో విషయాలు వెల్లడయ్యాయి. ఇంకేముంది.. ప్రొపెసర్ను అరెస్టు చేశారు. అయితే.. ఆయన చోర కళ మెళుకువలను తెలుసుకున్నాక.. ఇప్పుడు పోలీసులపైనే నిఘా పెట్టే పరిస్థితి వచ్చిందట. ఇది జరిగింది.. కలకత్తా మహానగరంలోనే కావడం మరో చిత్రం!!
This post was last modified on April 27, 2023 12:38 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…