Trends

హైదరాబాద్ లో గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు చనిపోయారు

హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు అనూహ్యరీతిలో మరణించారు. గుర్రాన్ని కాపాడే క్రమంలో వారు ప్రాణాలు కోల్పోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిషన్ బాగ్ కు చెందిన అజం అనే వ్యక్తి కిస్మత్ పూర్ లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుంటాడు. అజం అన్న కొడుకు సైఫ్ అతడికి సాయం చేస్తుంటాడు. ఒకట్రెండు రోజుల క్రితమే రాజస్థాన్ కు చెందిన అశీష్ సింగ్ అనే యువకుడు వారి వద్ద పనికి చేరాడు.

ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం గుర్రాన్ని ఈసా నదికి తీసుకెళ్లారు. వేసవి తాపాన్ని తట్టుకోలేని గుర్రం.. ఈసా నదిలోకి పరుగులు తీసింది. దీంతో.. దాని కళ్లాన్ని పట్టుకున్న అశీశ్ సింగ్ దాంతో నదిలోకి వెళ్లాడు. అనూహ్యంగా గుర్రం నీట మునిగిపోయింది. దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించిన అశీష్ సింగ్ గుర్రంతో పాటు నీట మునిగాడు. వీరిని రక్షించేందుకు సైఫ్ నదిలోకి దిగాడు. అయితే.. అతను సైతం నీట మునిగిపోయాడు.

వీరిని గుర్తించిన స్థానికులు గుర్రం శిక్షణ కేంద్రం నిర్వాహకుడు అజంకు సమాచారం ఇవచ్చారు. వారు గుర్రంతోపాటు నీట మునిగిన ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. వారు గల్లంతయ్యారు. దీంతో.. వారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే గుర్రంతో పాటు అశీష్ సింగ్.. సైఫ్ లు మరణించినట్లుగా తేలింది. గుర్రాన్ని కాపాడే క్రమంలో ఇద్దరు యువకులు మరణించిన వైనం స్థానికంగా విషాదాన్ని నింపింది.

Satya

Recent Posts

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

18 minutes ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

3 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

6 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

7 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

9 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

9 hours ago