హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు అనూహ్యరీతిలో మరణించారు. గుర్రాన్ని కాపాడే క్రమంలో వారు ప్రాణాలు కోల్పోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిషన్ బాగ్ కు చెందిన అజం అనే వ్యక్తి కిస్మత్ పూర్ లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుంటాడు. అజం అన్న కొడుకు సైఫ్ అతడికి సాయం చేస్తుంటాడు. ఒకట్రెండు రోజుల క్రితమే రాజస్థాన్ కు చెందిన అశీష్ సింగ్ అనే యువకుడు వారి వద్ద పనికి చేరాడు.
ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం గుర్రాన్ని ఈసా నదికి తీసుకెళ్లారు. వేసవి తాపాన్ని తట్టుకోలేని గుర్రం.. ఈసా నదిలోకి పరుగులు తీసింది. దీంతో.. దాని కళ్లాన్ని పట్టుకున్న అశీశ్ సింగ్ దాంతో నదిలోకి వెళ్లాడు. అనూహ్యంగా గుర్రం నీట మునిగిపోయింది. దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించిన అశీష్ సింగ్ గుర్రంతో పాటు నీట మునిగాడు. వీరిని రక్షించేందుకు సైఫ్ నదిలోకి దిగాడు. అయితే.. అతను సైతం నీట మునిగిపోయాడు.
వీరిని గుర్తించిన స్థానికులు గుర్రం శిక్షణ కేంద్రం నిర్వాహకుడు అజంకు సమాచారం ఇవచ్చారు. వారు గుర్రంతోపాటు నీట మునిగిన ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. వారు గల్లంతయ్యారు. దీంతో.. వారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే గుర్రంతో పాటు అశీష్ సింగ్.. సైఫ్ లు మరణించినట్లుగా తేలింది. గుర్రాన్ని కాపాడే క్రమంలో ఇద్దరు యువకులు మరణించిన వైనం స్థానికంగా విషాదాన్ని నింపింది.
This post was last modified on April 27, 2023 12:30 pm
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు. బుద్ధి…
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…
మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…
సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి…