Trends

చైనాను దాటేశాం.. ప్రపంచంలోనే తొలి స్థానానికి భారత్

ఏదైనా విభాగంలో మొదటి స్థానంలో నిలిస్తే ఆ అనందమే వేరు. కానీ.. ఇప్పుడు వెల్లడైన విషయం గురించి వింటే ఆనందం కంటే ఆందోళనే ఎక్కువ అవుతుంది. అవును.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఇంతకాలం ఈ స్థానంలో చైనా నిలిస్తే.. ఇప్పుడు భారత్ వచ్చేసింది. చైనాకు మించి భారత్ లో 29 లక్షల మంది జనాభా అధికంగా ఉన్నారన్న విషయాన్ని తాజాగా లెక్కించారు. భారత జనాభా 142.86 కోట్లుగా ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేసింది. ఇదే సమయంలో చైనాలో జనాభా 142.57 కోట్లుగా లెక్కించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశ జనాభా ఎంతన్న విషయాన్ని ఐక్యరాజ్యసమితి 1950నుంచి వెల్లడించటం మొదలు పెట్టింది. అలా లెక్కించటం మొదలు పెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారి ప్రథమ స్థానానికి చేరుకున్నట్లుగా ప్రకటించారు. తాజాగా ‘‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు 2023’’ పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ సిద్ధం చేసిన రిపోర్టులో భారత్ లో అత్యధిక జనాభా ఉన్నట్లుగా లెక్క కట్టింది. రెండోస్థానంలో చైనా నిలిస్తే.. మూడో స్థానంలో అమెరికా నిలిచింది. ఆ దేశంలో 34 కోట్ల మంది జనాభా ఉన్నట్లుగా వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా 804.5 కోట్ల జనాభా ఉన్నట్లుగా అంచనా వేయగా.. అందులో మూడో వంతులో ఒక వంతు జనాభా భారత్.. చైనాలో ఉన్నట్లుగా తేలింది. ఈ రెండు దేశాల జనాభానే 285 కోట్లు కావటం గమనార్హం. 2011తో పోలిస్తే ఇప్పుడు చైనాతో పాటు భారత్ లోనూ జనాభా పెరుగుదల శాతం కాస్తంత తగ్గింపు లోకి వస్తోంది. భారత్ లో జనాభా గణన ప్రతి పదేళ్లకు ఒకసారి జరగటం తెలిసిందే.
చివరి జన గణన 2011లోజరగ్గా.. షెడ్యూల్ ప్రకారం 2021లో చేపట్టాల్సి ఉంది. కొవిడ్ కారణంగా అది జరగలేదు. దీంతో.. జనాభా ఎంతన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

జనాభా పెరుగుదలను కొందరు ఆందోళన చెందే పరిస్థితి. కానీ.. జీవన ప్రమాణాలు.. వనరుల వినియోగం.. లాంటి అంశాల విషయానికి వస్తే.. విరుద్ధపరిస్థితులు నెలకొని ఉంటాయని చెప్పక తప్పదు. ఏమైనా.. సంతోషించదగ్గ ఎన్నో అంశాల్లో ముందు ఉండే కన్నా వెనక్కి ఉండే భారత్.. జనాభా పెరుగుదల విషయంలో మాత్రం ముందుకు దూసుకెళ్లింది. మరి.. దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలదు.

This post was last modified on April 19, 2023 5:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సాయిశ్రీనివాస డిస్కషన్ ఇప్పుడు ఎందుకు

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ కావాలనే డిమాండ్ పెరిగిపోయింది. అనగనగా ఒక రోజు…

23 minutes ago

సరదా ‘ఫంకీ’లో దర్శకుల కష్టాలు

గత ఏడాది లైలాతో చేదు ఫలితం చూసిన విశ్వక్ సేన్ దాని దెబ్బకు ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకుని బయట…

34 minutes ago

స్క్రీన్లు పెంచడం ఎలా సాధ్యం అమీర్ సాబ్

ఒక్కోసారి అమీర్ ఖాన్ ఏదేదో స్టేట్ మెంట్లు ఇచ్చేసి గందరగోళంలో పడేస్తారు. కొన్ని పనులు కూడా అలాగే అనిపించినా వాటి…

1 hour ago

మళ్లీ పవన్ మీదే ఇండస్ట్రీ ఆశలు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక పెద్ద సినిమాలకు టికెట్ల ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతులు…

2 hours ago

‘జగన్ ముత్తాత పేరు’…ఇదేమి లాజిక్ గోరంట్ల?

ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తమకు…

2 hours ago

అంబటి కోసం కదిలొచ్చిన కాపు నేతలు!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…

4 hours ago