Trends

చైనాను దాటేశాం.. ప్రపంచంలోనే తొలి స్థానానికి భారత్

ఏదైనా విభాగంలో మొదటి స్థానంలో నిలిస్తే ఆ అనందమే వేరు. కానీ.. ఇప్పుడు వెల్లడైన విషయం గురించి వింటే ఆనందం కంటే ఆందోళనే ఎక్కువ అవుతుంది. అవును.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఇంతకాలం ఈ స్థానంలో చైనా నిలిస్తే.. ఇప్పుడు భారత్ వచ్చేసింది. చైనాకు మించి భారత్ లో 29 లక్షల మంది జనాభా అధికంగా ఉన్నారన్న విషయాన్ని తాజాగా లెక్కించారు. భారత జనాభా 142.86 కోట్లుగా ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేసింది. ఇదే సమయంలో చైనాలో జనాభా 142.57 కోట్లుగా లెక్కించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశ జనాభా ఎంతన్న విషయాన్ని ఐక్యరాజ్యసమితి 1950నుంచి వెల్లడించటం మొదలు పెట్టింది. అలా లెక్కించటం మొదలు పెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారి ప్రథమ స్థానానికి చేరుకున్నట్లుగా ప్రకటించారు. తాజాగా ‘‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు 2023’’ పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ సిద్ధం చేసిన రిపోర్టులో భారత్ లో అత్యధిక జనాభా ఉన్నట్లుగా లెక్క కట్టింది. రెండోస్థానంలో చైనా నిలిస్తే.. మూడో స్థానంలో అమెరికా నిలిచింది. ఆ దేశంలో 34 కోట్ల మంది జనాభా ఉన్నట్లుగా వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా 804.5 కోట్ల జనాభా ఉన్నట్లుగా అంచనా వేయగా.. అందులో మూడో వంతులో ఒక వంతు జనాభా భారత్.. చైనాలో ఉన్నట్లుగా తేలింది. ఈ రెండు దేశాల జనాభానే 285 కోట్లు కావటం గమనార్హం. 2011తో పోలిస్తే ఇప్పుడు చైనాతో పాటు భారత్ లోనూ జనాభా పెరుగుదల శాతం కాస్తంత తగ్గింపు లోకి వస్తోంది. భారత్ లో జనాభా గణన ప్రతి పదేళ్లకు ఒకసారి జరగటం తెలిసిందే.
చివరి జన గణన 2011లోజరగ్గా.. షెడ్యూల్ ప్రకారం 2021లో చేపట్టాల్సి ఉంది. కొవిడ్ కారణంగా అది జరగలేదు. దీంతో.. జనాభా ఎంతన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

జనాభా పెరుగుదలను కొందరు ఆందోళన చెందే పరిస్థితి. కానీ.. జీవన ప్రమాణాలు.. వనరుల వినియోగం.. లాంటి అంశాల విషయానికి వస్తే.. విరుద్ధపరిస్థితులు నెలకొని ఉంటాయని చెప్పక తప్పదు. ఏమైనా.. సంతోషించదగ్గ ఎన్నో అంశాల్లో ముందు ఉండే కన్నా వెనక్కి ఉండే భారత్.. జనాభా పెరుగుదల విషయంలో మాత్రం ముందుకు దూసుకెళ్లింది. మరి.. దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలదు.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

1 hour ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

3 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

3 hours ago