మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీలతో సహా పలు దిగ్గజ కంపెనీలు తమ ఖర్చులకు కోత పెట్టుకునే క్రమంలో ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా సాగుతున్న ఈ కోతల పర్వం ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి పలువురు ఉద్యోగుల్ని తీసేసిన సంస్థ.. తాజాగా మరో పదివేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లుగా తెలుస్తోంది.
ఖర్చుల్ని అదుపులోకి ఉంచుకోవటంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మెటా పరిధిలోనే ఫేస్ బుక్.. ఇన్ స్టా.. వాట్సాప్.. వర్చువల్ రియాలిటీపై పని చేస్తున్నరియాలిటీ ల్యాబ్.. ఇలాంటి తమకున్న అన్ని వ్యాపారాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను కోతపెట్టించుకోవటంలో భాగంగా పెద్ద ఎత్తున కోతలు వేస్తున్నారు. ఏ విభాగంలో ఎంతమందిని ఇంటికి పంపాలన్న విషయంపై ఇప్పటికే మేనేజర్ స్థాయిల్లోని వారికి సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
తమ కంపెనీ నుంచి మరింత మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించి వేయనున్నట్లు ఈ మార్చిలోనే జుకర్ బర్గ్ సంకేతాలు ఇవ్వటం తెలిసిందే. గత ఏడాది 11 వేల మందిని తొలగించిన కంపెనీ.. ఇప్పుడు మరో 10 వేల మందిని పంపేందుకు సిద్ధమైంది. లేఆఫ్ ల తర్వాత కొంతమందిని కొత్త ప్రాజెక్టులపై పని చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ షాక్ ఇలా ఉంటే.. తాజాగా ప్రపంచంలోనే ప్రముఖమైన ఎంటర్ టైన్ సంస్థగా పేర్కొనే వాల్ట్ డిస్నీ సైతం వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎంటర్ టైన్ విభాగంలో దాదాపు పదిహేను శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకురంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే డిస్నీ ఏడు వేల మందిని ఇంటికి పంపించేసింది. తాజా పరిణామాలుచూస్తే.. చుక్క రక్తం కూడా చిందని మహా కోతగా చెప్పాలి.
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…