మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీలతో సహా పలు దిగ్గజ కంపెనీలు తమ ఖర్చులకు కోత పెట్టుకునే క్రమంలో ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా సాగుతున్న ఈ కోతల పర్వం ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి పలువురు ఉద్యోగుల్ని తీసేసిన సంస్థ.. తాజాగా మరో పదివేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లుగా తెలుస్తోంది.
ఖర్చుల్ని అదుపులోకి ఉంచుకోవటంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మెటా పరిధిలోనే ఫేస్ బుక్.. ఇన్ స్టా.. వాట్సాప్.. వర్చువల్ రియాలిటీపై పని చేస్తున్నరియాలిటీ ల్యాబ్.. ఇలాంటి తమకున్న అన్ని వ్యాపారాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను కోతపెట్టించుకోవటంలో భాగంగా పెద్ద ఎత్తున కోతలు వేస్తున్నారు. ఏ విభాగంలో ఎంతమందిని ఇంటికి పంపాలన్న విషయంపై ఇప్పటికే మేనేజర్ స్థాయిల్లోని వారికి సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
తమ కంపెనీ నుంచి మరింత మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించి వేయనున్నట్లు ఈ మార్చిలోనే జుకర్ బర్గ్ సంకేతాలు ఇవ్వటం తెలిసిందే. గత ఏడాది 11 వేల మందిని తొలగించిన కంపెనీ.. ఇప్పుడు మరో 10 వేల మందిని పంపేందుకు సిద్ధమైంది. లేఆఫ్ ల తర్వాత కొంతమందిని కొత్త ప్రాజెక్టులపై పని చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ షాక్ ఇలా ఉంటే.. తాజాగా ప్రపంచంలోనే ప్రముఖమైన ఎంటర్ టైన్ సంస్థగా పేర్కొనే వాల్ట్ డిస్నీ సైతం వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎంటర్ టైన్ విభాగంలో దాదాపు పదిహేను శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకురంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే డిస్నీ ఏడు వేల మందిని ఇంటికి పంపించేసింది. తాజా పరిణామాలుచూస్తే.. చుక్క రక్తం కూడా చిందని మహా కోతగా చెప్పాలి.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…