మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీలతో సహా పలు దిగ్గజ కంపెనీలు తమ ఖర్చులకు కోత పెట్టుకునే క్రమంలో ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా సాగుతున్న ఈ కోతల పర్వం ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి పలువురు ఉద్యోగుల్ని తీసేసిన సంస్థ.. తాజాగా మరో పదివేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లుగా తెలుస్తోంది.
ఖర్చుల్ని అదుపులోకి ఉంచుకోవటంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మెటా పరిధిలోనే ఫేస్ బుక్.. ఇన్ స్టా.. వాట్సాప్.. వర్చువల్ రియాలిటీపై పని చేస్తున్నరియాలిటీ ల్యాబ్.. ఇలాంటి తమకున్న అన్ని వ్యాపారాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను కోతపెట్టించుకోవటంలో భాగంగా పెద్ద ఎత్తున కోతలు వేస్తున్నారు. ఏ విభాగంలో ఎంతమందిని ఇంటికి పంపాలన్న విషయంపై ఇప్పటికే మేనేజర్ స్థాయిల్లోని వారికి సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
తమ కంపెనీ నుంచి మరింత మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించి వేయనున్నట్లు ఈ మార్చిలోనే జుకర్ బర్గ్ సంకేతాలు ఇవ్వటం తెలిసిందే. గత ఏడాది 11 వేల మందిని తొలగించిన కంపెనీ.. ఇప్పుడు మరో 10 వేల మందిని పంపేందుకు సిద్ధమైంది. లేఆఫ్ ల తర్వాత కొంతమందిని కొత్త ప్రాజెక్టులపై పని చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ షాక్ ఇలా ఉంటే.. తాజాగా ప్రపంచంలోనే ప్రముఖమైన ఎంటర్ టైన్ సంస్థగా పేర్కొనే వాల్ట్ డిస్నీ సైతం వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎంటర్ టైన్ విభాగంలో దాదాపు పదిహేను శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకురంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే డిస్నీ ఏడు వేల మందిని ఇంటికి పంపించేసింది. తాజా పరిణామాలుచూస్తే.. చుక్క రక్తం కూడా చిందని మహా కోతగా చెప్పాలి.
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…