డ్రీమ్ ఎలెవెన్.. ఈ రోజుల్లో ఈ పేరు తెలియని యూత్ ఉండరు. ఆ మాటకు వస్తే పెద్ద వాళ్లకు కూడా దీంతో బాగానే పరిచయం. క్రికెట్ సహా అనేక ఆటల్లో ఫాంటసీ లీగ్ ఆడేందుకు ఈ యాప్ ఒక వేదిక. ఇప్పుడు ఈ తరహాలో పదుల సంఖ్యలో యాప్స్ వచ్చాయి కానీ.. ముందు ఈ ఫాంటసీ లీగ్ పాపులర్ అయింది, ఎక్కువ ఆదరణ సంపాదించుకున్నది డ్రీమ్ ఎలెవెన్ ద్వారానే.
ఇప్పుడు ఎన్ని యాప్స్ ఉన్నప్పటికీ అన్నింట్లోకి డ్రీమ్ ఎలెవెనే టాప్. ఒక సీజన్లో ఐపీఎల్కు కూడా టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది ఈ సంస్థ. ఇప్పుడు రోహిత్ శర్మ, ఆమిర్ ఖాన్, హార్దిక్ పాండ్య లాంటి ప్రముఖులు దీనికి ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టే డ్రీమ్ ఎలెవెన్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సంస్థను ఆరంభించిన హర్ష్ జైన్ది ఒక ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీ.
1986లో ముంబయిలో పుట్టిన హర్ష్.. ఫిలడెల్ఫియాలో ఎకనామిక్స్ డిగ్రీ చేశాడు. చదువుకునే రోజుల్లో ఆటల మీద అమితాసక్తిని చూపించేవాడు. ఐపీఎల్ మొదలైన కొంత కాలానికి అతడికి ఫాంటసీ లీగ్ ఆలోచన వచ్చింది. ఐతే మూలధనం కోసం తన స్నేహితుడు భవిత్తో కలిసి ఎంతోమందిని కలిశాడు. 150 మంది పెట్టుబడిదారులను కలిసినా వాళ్లందరూ వారి ఆలోచనను తిరస్కరించారట.
అయినా పట్టు వదలకుండా పోరాడి.. ఎలాగోలా పెట్టుబడి సంపాదించి డ్రీమ్ ఎలెవెన్ స్థాపించారట. కొత్త సంస్థను ప్రారంభిస్తున్నపుడు నమ్మి ముందుడుగు వేసే వాళ్లు తక్కువమంది అని.. నమ్మితే ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పడానికి ‘డ్రీమ్ ఎలెవన్’యే నిదర్శనం అని అంటున్నాడు హర్ష్. డ్రీమ్ ఎలెవెన్తో నెమ్మదిగా మొదలైన అతడి ప్రయాణం ఇప్పుడు వేల కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం డ్రీమ్ ఎలెవెన్ రూ.65 వేల కోట్ల సంస్థగా ఎదిగింది. ఈ సంస్థకు ప్రస్తుతం 150 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. భవిష్యత్తులో డ్రీమ్ ఎలెవెన్ ఇంకా పెద్ద సంస్థగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. 2017లో హర్ష్.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ అధ్యక్షుడు అయ్యాడు. ప్రస్తుతం హర్ష్ అతడి కుటుంబం రూ.72 కోట్ల విలువైన లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది.
This post was last modified on April 5, 2023 6:34 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…