Trends

కారులో వెళుతున్న ఐటీ ఉద్యోగిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు

దారుణం చోటు చేసుకుంది. కారులో వెళుతున్నఐటీ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు..కారును ఆపేసి మరీ పెట్రోల్ పోసి తగలబెట్టేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండటంలో చోటు చేసుకున్న ఈ హత్యోదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. చంద్రగిరి మండలం నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది.

కారులోఉండగానే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నట్లుగా స్థానిక పోలీసులు చెబుతున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి ఎవరన్నది గుర్తించటం కష్టంగా మారింది. దీనికి కారణం.. డెడ్ బాడీ గుర్తుపట్టలేని రీతిలో కాలిపోయి ఉండటమే. అయితే.. కారు ఆధారంగా వివరాల్నిసేకరించారు పోలీసులు.

కారులో మరణించిన వ్యక్తి వెదురుకుప్పం మండలం బ్రామ్మణపల్లికి చెందిన ఐటీ ఇంజనీర్ నాగరాజుగా పోలీసులు గుర్తించారు. అతడు బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తున్నట్లుగా గుర్తించారు. బెంగళూరు నుంచి బ్రాహ్మణ పల్లికి వెళుతున్నక్రమంలో అతడి హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు.

శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత వెళుతున్న కారును ఆపిని దుండగులు.. కారు మీద.. నాగరాజు మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లుగా భావిస్తున్నారు. అయితే.. ఈ దారుణానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దారుణ హత్య ఎందుకు జరిగిందన్న విషయం మీద ఫోకస్ చస్తున్నారు. మరణించిన నాగరాజుకు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ హత్యోదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

This post was last modified on April 2, 2023 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago