Trends

కారులో వెళుతున్న ఐటీ ఉద్యోగిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు

దారుణం చోటు చేసుకుంది. కారులో వెళుతున్నఐటీ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు..కారును ఆపేసి మరీ పెట్రోల్ పోసి తగలబెట్టేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండటంలో చోటు చేసుకున్న ఈ హత్యోదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. చంద్రగిరి మండలం నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది.

కారులోఉండగానే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నట్లుగా స్థానిక పోలీసులు చెబుతున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి ఎవరన్నది గుర్తించటం కష్టంగా మారింది. దీనికి కారణం.. డెడ్ బాడీ గుర్తుపట్టలేని రీతిలో కాలిపోయి ఉండటమే. అయితే.. కారు ఆధారంగా వివరాల్నిసేకరించారు పోలీసులు.

కారులో మరణించిన వ్యక్తి వెదురుకుప్పం మండలం బ్రామ్మణపల్లికి చెందిన ఐటీ ఇంజనీర్ నాగరాజుగా పోలీసులు గుర్తించారు. అతడు బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తున్నట్లుగా గుర్తించారు. బెంగళూరు నుంచి బ్రాహ్మణ పల్లికి వెళుతున్నక్రమంలో అతడి హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు.

శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత వెళుతున్న కారును ఆపిని దుండగులు.. కారు మీద.. నాగరాజు మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లుగా భావిస్తున్నారు. అయితే.. ఈ దారుణానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దారుణ హత్య ఎందుకు జరిగిందన్న విషయం మీద ఫోకస్ చస్తున్నారు. మరణించిన నాగరాజుకు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ హత్యోదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

This post was last modified on April 2, 2023 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

49 minutes ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

2 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

3 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

4 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

6 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

8 hours ago