Trends

కారులో వెళుతున్న ఐటీ ఉద్యోగిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు

దారుణం చోటు చేసుకుంది. కారులో వెళుతున్నఐటీ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు..కారును ఆపేసి మరీ పెట్రోల్ పోసి తగలబెట్టేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండటంలో చోటు చేసుకున్న ఈ హత్యోదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. చంద్రగిరి మండలం నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది.

కారులోఉండగానే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నట్లుగా స్థానిక పోలీసులు చెబుతున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి ఎవరన్నది గుర్తించటం కష్టంగా మారింది. దీనికి కారణం.. డెడ్ బాడీ గుర్తుపట్టలేని రీతిలో కాలిపోయి ఉండటమే. అయితే.. కారు ఆధారంగా వివరాల్నిసేకరించారు పోలీసులు.

కారులో మరణించిన వ్యక్తి వెదురుకుప్పం మండలం బ్రామ్మణపల్లికి చెందిన ఐటీ ఇంజనీర్ నాగరాజుగా పోలీసులు గుర్తించారు. అతడు బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తున్నట్లుగా గుర్తించారు. బెంగళూరు నుంచి బ్రాహ్మణ పల్లికి వెళుతున్నక్రమంలో అతడి హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు.

శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత వెళుతున్న కారును ఆపిని దుండగులు.. కారు మీద.. నాగరాజు మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లుగా భావిస్తున్నారు. అయితే.. ఈ దారుణానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దారుణ హత్య ఎందుకు జరిగిందన్న విషయం మీద ఫోకస్ చస్తున్నారు. మరణించిన నాగరాజుకు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ హత్యోదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

This post was last modified on April 2, 2023 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

2 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

3 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

3 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

4 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

4 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

5 hours ago