ఇంకో అయిదు రోజుల్లో మార్చి 31న మొదలుకాబోతున్న ఐపీఎల్ 2023కి సర్వం సిద్ధమయ్యింది. కోట్లాది ప్రేక్షకులు టీవీలకు ఫోన్లకు అతుక్కుపోయి మరీ చూసే ఈ క్రికెట్ సంబరానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి టీమ్ లోనూ అన్ని దేశాల సభ్యులు కలగలిసి ఉండటంతో రాష్ట్రాలు లేదా నగరాల ప్రాతిపదికన అభిమానులు విడిపోయి మద్దతు ఇచ్చుకుంటున్నారు. ఈసారి ఈ మెగా స్పోర్ట్స్ కి స్టార్ అట్రాక్షన్ తోడు కానుంది. నందమూరి బాలకృష్ణ ఇప్పుడీ గేమ్ కోసం కామెంటేటర్ గా వ్యవహరించబోతున్నారు. మాస్ అండ్ బేస్ గొంతుతో బాలయ్య చమక్కులు విసరబోతున్నారు
స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేకంగా బాలయ్యతో డీల్ కుదుర్చుకుంది. అన్ని మ్యాచులకు చెబుతారా లేక హైదరాబాద్ ఆడే సన్ రైజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. స్టార్ నెట్ వర్క్ బాలకృష్ణను గత కొంత కాలంగా బ్రాండ్ గా మార్చేసుకుంది. అఖండ డిస్నీ హాట్ స్టార్ ఓటిటిలో వచ్చాక మిలియన్ల వ్యూస్ తో యాప్ హోరెత్తిపోయింది. అందుకే మైత్రి మూవీ మేకర్స్ సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు కొన్నప్పటికీ వీరసింహారెడ్డిని మాత్రం హాట్ స్టార్ చాలా ఫ్యాన్సీ రేట్ ఇచ్చి ప్రత్యేకంగా బాలయ్య రికమండేషన్ తో సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఇలా ఐపీఎల్ కోసం కొత్త భూమికను ఇచ్చింది. స్టార్ హీరోగా అశేష ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలయ్య ఆహా అన్ స్టాపబుల్ షోతో యాంకర్ గానూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇండియన్ ఐడల్ షో కోసం జడ్జ్ గా మారేందుకు ఎస్ చెప్పారు. యాడ్స్ లోనూ నటించారు. ఇప్పుడు కామెంటేటర్ గా కొత్త పాత్రలో ప్రవేశిస్తున్నారు. ఒకపక్క బసవతారకం ఆసుపత్రి అధిపతిగా హిందూపూర్ ఎమ్మెల్యేగా మరోవైపు కోట్ల పెట్టుబడులు పెడుతున్న నిర్మాతల సినిమాల్లో హీరోగా ఈ వయసులోనూ ఇంత కష్టపడటం చూస్తుంటే జై బాలయ్య అనక ఉండగలరా
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…