అగ్రరాజ్యం అమెరికాకు ఏమైంది? ఇటీవల సిలికాన్ వాలీ బ్యాంకు సంక్షోభంలో చిక్కుకున్న విషయం ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక దేశాలు అలెర్ట్ అయ్యాయి. అయితే.. ఈ విషయం నుంచి ఇంకా తేరుకోక ముందుగానే.. ఇప్పుడు మరో బ్యాంకు కూడా సంక్షోభపు అంచులకు చేరుకుని తాళం వేసే పరిస్థితి వచ్చింది. క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్ బ్యాంక్ ను మూసివేస్తున్నట్లు తెలిసింది.
సిగ్నేచర్ బ్యాంకును ‘ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్డీఐసీ)’ తన నియంత్రణలోకి తీసుకుంది. అయితే, బ్యాంకు ఖాతాదారులు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. దీనికి గాను తాత్కాలికంగా ఓ ‘బ్రిడ్జ్ బ్యాంక్’ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సిగ్నేచర్ కస్టమర్లు, డిపాజిటర్లు తమ నిధులను విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఏర్పడింది.
సిగ్నేచర్కు గత ఏడాది ముగిసే నాటికి 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. సిగ్నేచర్ బ్యాంక్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్ బ్యాంకింగ్ సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు సేవలందిస్తోంది. గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచి వచ్చినవే. బ్యాంకు ప్రారంభమైన 2001 నుంచి ఎంతో మంది డిపాజిటర్లు ఈ బ్యాంకుకు ఖాతా దారులుగా ఉన్నారు. కానీ, ఇప్పుడు హఠాత్తుగా మూతబడడంతో బ్యాంకు ముందు క్యూ కట్టారు.
This post was last modified on March 13, 2023 3:51 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…