అగ్రరాజ్యం అమెరికాకు ఏమైంది? ఇటీవల సిలికాన్ వాలీ బ్యాంకు సంక్షోభంలో చిక్కుకున్న విషయం ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక దేశాలు అలెర్ట్ అయ్యాయి. అయితే.. ఈ విషయం నుంచి ఇంకా తేరుకోక ముందుగానే.. ఇప్పుడు మరో బ్యాంకు కూడా సంక్షోభపు అంచులకు చేరుకుని తాళం వేసే పరిస్థితి వచ్చింది. క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్ బ్యాంక్ ను మూసివేస్తున్నట్లు తెలిసింది.
సిగ్నేచర్ బ్యాంకును ‘ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్డీఐసీ)’ తన నియంత్రణలోకి తీసుకుంది. అయితే, బ్యాంకు ఖాతాదారులు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. దీనికి గాను తాత్కాలికంగా ఓ ‘బ్రిడ్జ్ బ్యాంక్’ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సిగ్నేచర్ కస్టమర్లు, డిపాజిటర్లు తమ నిధులను విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఏర్పడింది.
సిగ్నేచర్కు గత ఏడాది ముగిసే నాటికి 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. సిగ్నేచర్ బ్యాంక్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్ బ్యాంకింగ్ సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు సేవలందిస్తోంది. గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచి వచ్చినవే. బ్యాంకు ప్రారంభమైన 2001 నుంచి ఎంతో మంది డిపాజిటర్లు ఈ బ్యాంకుకు ఖాతా దారులుగా ఉన్నారు. కానీ, ఇప్పుడు హఠాత్తుగా మూతబడడంతో బ్యాంకు ముందు క్యూ కట్టారు.
This post was last modified on March 13, 2023 3:51 pm
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…