Trends

అగ్ర‌రాజ్యంలో ఆర్థిక సంక్షోభం.. మ‌రో బ్యాంకు మూత‌!!

అగ్ర‌రాజ్యం అమెరికాకు ఏమైంది? ఇటీవ‌ల సిలికాన్ వాలీ బ్యాంకు సంక్షోభంలో చిక్కుకున్న విష‌యం ప్ర‌పంచాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అనేక దేశాలు అలెర్ట్ అయ్యాయి. అయితే.. ఈ విష‌యం నుంచి ఇంకా తేరుకోక ముందుగానే.. ఇప్పుడు మ‌రో బ్యాంకు కూడా సంక్షోభ‌పు అంచుల‌కు చేరుకుని తాళం వేసే ప‌రిస్థితి వ‌చ్చింది. క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్‌ బ్యాంక్‌ ను మూసివేస్తున్నట్లు తెలిసింది.

సిగ్నేచర్‌ బ్యాంకును ‘ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీఐసీ)’ తన నియంత్రణలోకి తీసుకుంది. అయితే, బ్యాంకు ఖాతాదారులు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు మాత్రం అవ‌కాశం క‌ల్పించారు. దీనికి గాను తాత్కాలికంగా ఓ ‘బ్రిడ్జ్‌ బ్యాంక్‌’ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సిగ్నేచర్‌ కస్టమర్లు, డిపాజిటర్లు తమ నిధులను విత్ డ్రా చేసుకునే సౌల‌భ్యం ఏర్ప‌డింది.

సిగ్నేచర్‌కు గత ఏడాది ముగిసే నాటికి 110.36 బిలియన్‌ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. సిగ్నేచర్ బ్యాంక్‌ న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తోంది. స్థిరాస్తి, డిజిటల్‌ అసెట్స్‌ బ్యాంకింగ్‌ సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు సేవలందిస్తోంది. గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచి వచ్చినవే. బ్యాంకు ప్రారంభమైన 2001 నుంచి ఎంతో మంది డిపాజిట‌ర్లు ఈ బ్యాంకుకు ఖాతా దారులుగా ఉన్నారు. కానీ, ఇప్పుడు హ‌ఠాత్తుగా మూత‌బ‌డ‌డంతో బ్యాంకు ముందు క్యూ క‌ట్టారు.

This post was last modified on March 13, 2023 3:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

50 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

2 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

5 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago