ఇంజనీరింగ్ విద్యార్థి.. నవీన్ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ అత్యంత దారుణంగా హత్య చేసి.. శరీరాన్ని ఖండ ఖండాలుగా నరికి.. మరో స్నేహితుడు హసన్ సాయంతో కాల్చేసిన విషయం తెలిసిందే. అయితే.. కేసులో పోలీసులు తవ్వే కొద్దీ అనేక భయంకర నిజాలు వెలుగు చూస్తున్నాయి. నవీన్ ప్రియురాలు.. తర్వాత హరిహర కృష్ణ ప్రియురాలిగా మారడం నుంచి అసలు కథంతా కూడా ఆమెకు తెలిసే జరిగిందని పోలీసులు వెల్లడించారు.
అంతేకాదు..నవీన్ శరీర భాగాలను కాల్చుతున్న సమయంలో ఆమె దూరం నుంచి చూసిందని.. హత్య జరిగిన తర్వాత.. హరిహర-నీహారిక కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్లడం, అక్కడ బిర్యానీ తినడం.. హరిహర తప్పించుకునేందుకు డబ్బులు సాయం చేయడం.. ఇలా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పుడు మరో కొత్త ట్విస్టు.. భయంకరమైన మలుపు తిరిగింది. అసలు.. నవీన్ను చంపుతాడని అనుకోలేదన్న.. నీహారిక.. దీనికి సంబంధించి బలమైన నిజాన్ని పోలీసులకు వెల్లడించింది.
నీవీన్ ను హత్య చేసేందుకు హరిహర నెల రోజుల ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు నీహారిక తాజాగా వెల్లడించింది. ఈ విషయం నాకు తెలుసు. నెల రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాడు. కానీ, వద్దని వారించాను. నా మాట వినలేదు. పైగా.. నవీన్ను హత్య చేసిన వారం రోజులకే నిన్ను తీసుకువెళ్లిపోయి.. పెళ్లి చేసుకుంటానని, నీ మెడలో తాళికడతానని చెప్పాడు అని నీహారిక పోలీసులకు తెలిపింది.
అయితే.. అసలు.. హరిహర పోలీసులకు లొంగిపోవడం వెనుక కూడా పెద్దకథ ఉందని నీహారిక వెల్లడించిం ది. తన బావ(అక్క భర్త) లాయర్ అని.. ఆయనకు విషయం చెబితే రక్షిస్తాడని హరిహరకు సూచించిందట. దీంతో నవీన్ ఆయనను కలిసి.. అంతా వివరించాడు. దీంతో ఆయనే స్వయంగా పోలీసులకు లొంగి పోవాలని.. లొంగిపోతే కేసు తీవ్రత తగ్గుతుందని.. తద్వారా శిక్ష కూడా తగ్గుతుందని.. తాను బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్పినట్టు నీహారిక వెల్లడించింది. దీంతో పోలీసులు ఇప్పుడు సదరు లాయర్ను కూడా కేసులో భాగం చేయనున్నట్టు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని నిజాలు వెలుగు చూస్తాయో చూడాలి.
This post was last modified on March 10, 2023 1:46 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…