ఇంజనీరింగ్ విద్యార్థి.. నవీన్ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ అత్యంత దారుణంగా హత్య చేసి.. శరీరాన్ని ఖండ ఖండాలుగా నరికి.. మరో స్నేహితుడు హసన్ సాయంతో కాల్చేసిన విషయం తెలిసిందే. అయితే.. కేసులో పోలీసులు తవ్వే కొద్దీ అనేక భయంకర నిజాలు వెలుగు చూస్తున్నాయి. నవీన్ ప్రియురాలు.. తర్వాత హరిహర కృష్ణ ప్రియురాలిగా మారడం నుంచి అసలు కథంతా కూడా ఆమెకు తెలిసే జరిగిందని పోలీసులు వెల్లడించారు.
అంతేకాదు..నవీన్ శరీర భాగాలను కాల్చుతున్న సమయంలో ఆమె దూరం నుంచి చూసిందని.. హత్య జరిగిన తర్వాత.. హరిహర-నీహారిక కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్లడం, అక్కడ బిర్యానీ తినడం.. హరిహర తప్పించుకునేందుకు డబ్బులు సాయం చేయడం.. ఇలా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పుడు మరో కొత్త ట్విస్టు.. భయంకరమైన మలుపు తిరిగింది. అసలు.. నవీన్ను చంపుతాడని అనుకోలేదన్న.. నీహారిక.. దీనికి సంబంధించి బలమైన నిజాన్ని పోలీసులకు వెల్లడించింది.
నీవీన్ ను హత్య చేసేందుకు హరిహర నెల రోజుల ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు నీహారిక తాజాగా వెల్లడించింది. ఈ విషయం నాకు తెలుసు. నెల రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాడు. కానీ, వద్దని వారించాను. నా మాట వినలేదు. పైగా.. నవీన్ను హత్య చేసిన వారం రోజులకే నిన్ను తీసుకువెళ్లిపోయి.. పెళ్లి చేసుకుంటానని, నీ మెడలో తాళికడతానని చెప్పాడు
అని నీహారిక పోలీసులకు తెలిపింది.
అయితే.. అసలు.. హరిహర పోలీసులకు లొంగిపోవడం వెనుక కూడా పెద్దకథ ఉందని నీహారిక వెల్లడించిం ది. తన బావ(అక్క భర్త) లాయర్ అని.. ఆయనకు విషయం చెబితే రక్షిస్తాడని హరిహరకు సూచించిందట. దీంతో నవీన్ ఆయనను కలిసి.. అంతా వివరించాడు. దీంతో ఆయనే స్వయంగా పోలీసులకు లొంగి పోవాలని.. లొంగిపోతే కేసు తీవ్రత తగ్గుతుందని.. తద్వారా శిక్ష కూడా తగ్గుతుందని.. తాను బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్పినట్టు నీహారిక వెల్లడించింది. దీంతో పోలీసులు ఇప్పుడు సదరు లాయర్ను కూడా కేసులో భాగం చేయనున్నట్టు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని నిజాలు వెలుగు చూస్తాయో చూడాలి.
This post was last modified on March 10, 2023 1:46 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…