ఇంజనీరింగ్ విద్యార్థి.. నవీన్ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ అత్యంత దారుణంగా హత్య చేసి.. శరీరాన్ని ఖండ ఖండాలుగా నరికి.. మరో స్నేహితుడు హసన్ సాయంతో కాల్చేసిన విషయం తెలిసిందే. అయితే.. కేసులో పోలీసులు తవ్వే కొద్దీ అనేక భయంకర నిజాలు వెలుగు చూస్తున్నాయి. నవీన్ ప్రియురాలు.. తర్వాత హరిహర కృష్ణ ప్రియురాలిగా మారడం నుంచి అసలు కథంతా కూడా ఆమెకు తెలిసే జరిగిందని పోలీసులు వెల్లడించారు.
అంతేకాదు..నవీన్ శరీర భాగాలను కాల్చుతున్న సమయంలో ఆమె దూరం నుంచి చూసిందని.. హత్య జరిగిన తర్వాత.. హరిహర-నీహారిక కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్లడం, అక్కడ బిర్యానీ తినడం.. హరిహర తప్పించుకునేందుకు డబ్బులు సాయం చేయడం.. ఇలా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పుడు మరో కొత్త ట్విస్టు.. భయంకరమైన మలుపు తిరిగింది. అసలు.. నవీన్ను చంపుతాడని అనుకోలేదన్న.. నీహారిక.. దీనికి సంబంధించి బలమైన నిజాన్ని పోలీసులకు వెల్లడించింది.
నీవీన్ ను హత్య చేసేందుకు హరిహర నెల రోజుల ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు నీహారిక తాజాగా వెల్లడించింది. ఈ విషయం నాకు తెలుసు. నెల రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాడు. కానీ, వద్దని వారించాను. నా మాట వినలేదు. పైగా.. నవీన్ను హత్య చేసిన వారం రోజులకే నిన్ను తీసుకువెళ్లిపోయి.. పెళ్లి చేసుకుంటానని, నీ మెడలో తాళికడతానని చెప్పాడు అని నీహారిక పోలీసులకు తెలిపింది.
అయితే.. అసలు.. హరిహర పోలీసులకు లొంగిపోవడం వెనుక కూడా పెద్దకథ ఉందని నీహారిక వెల్లడించిం ది. తన బావ(అక్క భర్త) లాయర్ అని.. ఆయనకు విషయం చెబితే రక్షిస్తాడని హరిహరకు సూచించిందట. దీంతో నవీన్ ఆయనను కలిసి.. అంతా వివరించాడు. దీంతో ఆయనే స్వయంగా పోలీసులకు లొంగి పోవాలని.. లొంగిపోతే కేసు తీవ్రత తగ్గుతుందని.. తద్వారా శిక్ష కూడా తగ్గుతుందని.. తాను బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్పినట్టు నీహారిక వెల్లడించింది. దీంతో పోలీసులు ఇప్పుడు సదరు లాయర్ను కూడా కేసులో భాగం చేయనున్నట్టు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని నిజాలు వెలుగు చూస్తాయో చూడాలి.
This post was last modified on March 10, 2023 1:46 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…