ఇంజనీరింగ్ విద్యార్థి.. నవీన్ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ అత్యంత దారుణంగా హత్య చేసి.. శరీరాన్ని ఖండ ఖండాలుగా నరికి.. మరో స్నేహితుడు హసన్ సాయంతో కాల్చేసిన విషయం తెలిసిందే. అయితే.. కేసులో పోలీసులు తవ్వే కొద్దీ అనేక భయంకర నిజాలు వెలుగు చూస్తున్నాయి. నవీన్ ప్రియురాలు.. తర్వాత హరిహర కృష్ణ ప్రియురాలిగా మారడం నుంచి అసలు కథంతా కూడా ఆమెకు తెలిసే జరిగిందని పోలీసులు వెల్లడించారు.
అంతేకాదు..నవీన్ శరీర భాగాలను కాల్చుతున్న సమయంలో ఆమె దూరం నుంచి చూసిందని.. హత్య జరిగిన తర్వాత.. హరిహర-నీహారిక కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్లడం, అక్కడ బిర్యానీ తినడం.. హరిహర తప్పించుకునేందుకు డబ్బులు సాయం చేయడం.. ఇలా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పుడు మరో కొత్త ట్విస్టు.. భయంకరమైన మలుపు తిరిగింది. అసలు.. నవీన్ను చంపుతాడని అనుకోలేదన్న.. నీహారిక.. దీనికి సంబంధించి బలమైన నిజాన్ని పోలీసులకు వెల్లడించింది.
నీవీన్ ను హత్య చేసేందుకు హరిహర నెల రోజుల ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు నీహారిక తాజాగా వెల్లడించింది. ఈ విషయం నాకు తెలుసు. నెల రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాడు. కానీ, వద్దని వారించాను. నా మాట వినలేదు. పైగా.. నవీన్ను హత్య చేసిన వారం రోజులకే నిన్ను తీసుకువెళ్లిపోయి.. పెళ్లి చేసుకుంటానని, నీ మెడలో తాళికడతానని చెప్పాడు
అని నీహారిక పోలీసులకు తెలిపింది.
అయితే.. అసలు.. హరిహర పోలీసులకు లొంగిపోవడం వెనుక కూడా పెద్దకథ ఉందని నీహారిక వెల్లడించిం ది. తన బావ(అక్క భర్త) లాయర్ అని.. ఆయనకు విషయం చెబితే రక్షిస్తాడని హరిహరకు సూచించిందట. దీంతో నవీన్ ఆయనను కలిసి.. అంతా వివరించాడు. దీంతో ఆయనే స్వయంగా పోలీసులకు లొంగి పోవాలని.. లొంగిపోతే కేసు తీవ్రత తగ్గుతుందని.. తద్వారా శిక్ష కూడా తగ్గుతుందని.. తాను బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్పినట్టు నీహారిక వెల్లడించింది. దీంతో పోలీసులు ఇప్పుడు సదరు లాయర్ను కూడా కేసులో భాగం చేయనున్నట్టు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని నిజాలు వెలుగు చూస్తాయో చూడాలి.
This post was last modified on March 10, 2023 1:46 pm
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…