దేశంలో చిత్రవిచిత్రమైన కేసులు వెలుగు చూస్తున్నాయి. తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఓవ్యక్తి ఎలాంటి కేసులు పెట్టకుండా..ఎలాంటి కక్షా సాధించకుండా.. ఏకంగా అతడి భార్యను వివాహం చేసుకున్నాడు. బిహార్లోని ఖగాడియా జిల్లాలో ప్రేమ, పగలతో కూడిన ఓ వింత వివాహాల ఘటన వెలుగు చూసింది. కొంతకాలం తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించి, చివరకు పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతో ఆ వ్యక్తి అతని భార్యను వివాహం చేసుకున్నాడు .
నలుగురు పిల్లల తల్లిని ప్రేమించి..
బిహార్లోని ఖగాడియా జిల్లాలోని హర్దియా గ్రామానికి చెందిన నీరజ్.. పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లికి ముందు నీరజ్ భార్య పస్రాహా గ్రామానికి చెందిన ముకేశ్ అనే వ్యక్తితో చనువుగా ఉండేది. అది కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అయితే, రూబీ నీరజ్ను వివాహం చేసుకున్న కొన్నాళ్లు ఆమె ప్రియుడికి దూరంగానే ఉంది. మరి మధ్యలో ఏం జరిగిందో ఏమో.. వెంటనే ముకేశ్తో సంబంధాన్ని కొనసాగించింది. మరోవైపు ముకేశ్.. అమ్నీ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కూడా రూబీనే కావడం విశేషం. వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతేడాది ఫిబ్రవరిలో నీరజ్ భార్య రూబీ దేవి, ముకేశ్లు ఊరు విడిచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
ఆయన భార్యను ఈయన!
ఈ విషయం తెలుసుకున్న నీరజ్.. పోలీస్ స్టేషన్లో ముకేశ్పై కిడ్నాప్ కేసు పెట్టాడు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా ముకేశ్ తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితుడు నీరజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన భార్య రూబీ దేవి, ముకేశ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు నీరజ్ ఏకంగా ముకేశ్ భార్యతో వివాహేతర సంబంధాన్ని ప్రారంభించాడు.
అంతటితో ఆగకుండా ఆమెను ఈ నెల 18న స్థానిక ఆలయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ఇందులో సరదా విషయమేంటంటే ఇద్దరి భర్తల భార్యల పేర్లు కూడా రూబీనే కావడం. నీరజ్ ప్రముఖ టాటా కంపెనీలో పనిచేస్తుండగా.. ముకేశ్ దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఇదీ.. చిత్రం అంటే..!!
This post was last modified on February 28, 2023 11:19 pm
రోమ్లో ఉన్నపుడు రోమన్లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…