క్రికెటర్ హార్దిక్ పాండ్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు? అదేంటి విదేశీ అమ్మాయి నటాషా స్టాంకోవిచ్ను అతను పెళ్లాడి రెండేళ్లే కదా అయింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు కదా? భార్యతో అతను చాలా అన్యోన్యంగానే కనిపిస్తున్నాడు కదా?
ఇంతలో మళ్లీ అతడికి పెళ్లేంటి? అంటే నటాషా నుంచి అప్పుడే హార్దిక్ విడాకులు తీసేసుకున్నాడా అని సందేహాలు కలగడం సహజం. కానీ హార్దిక్కు మళ్లీ పెళ్లి జరుగుతున్న మాట వాస్తవమే కానీ.. ఆ పెళ్లి వేరే అమ్మాయితో కాదు. నటాషాతోనే. ఇదేం ట్విస్టు అంటారా? అక్కడే ఉంది విశేషం. 2020లో లాక్ డౌన్ టైంలో చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్య నటాషాను పెళ్లాడాడు హార్దిక్.
అంతకు కొన్ని నెలల ముందే నటాషాకు బోట్ మీద ఉంగరం తొడిగి ఆమెతో ఎంగేజ్ అయినట్లు ప్రకటించాడు. కానీ పెళ్లి ఎప్పుడు జరిగింది ఏంటన్నది వెల్లడించకుండానే.. తమకు బిడ్డ పుట్టిన విషయాన్ని బయటపెట్టాడు. కరోనా, లాక్ డౌన్ వల్ల పెళ్లి ఘనంగా చేసుకోవడానికి అవకాశం లేకపోయింది.
ఐతే తన పెళ్లి ఘనంగా చేసుకోలేదన్న లోటు హార్దిక్ను వెంటాడుతున్నట్లుంది. అందుకే ఈ వీకెండ్లో మళ్లీ నటాషాను బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా మళ్లీ పెళ్లాడానికి రెడీ అయ్యాడు హార్దిక్. సెలబ్రెటీల వివాహ వేడుకలకు కేంద్రంగా నిలిచే రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో వీరి పెళ్లి జరగనుంది.
రెగ్యులర్ మ్యారేజెస్ తరహాలోనే నాలుగు రోజుల పాటు వివాహ వేడుకలు జరగనున్నాయి. మెహందీ, సంగీత్.. ఇలా అన్ని రకాల తంతులూ ఈ పెళ్లిలో ఉండబోతున్నాయి. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
ఇటీవలే న్యూజిలాండ్లో టీ20 సిరీస్లో కెప్టెన్గా హార్దిక్ జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఆ జట్టులో హార్దిక్ లేడు. తనకు దొరికిన ఖాళీ సమయంలో అతను పెళ్లి వేడుకలు పెట్టుకున్నాడు. హార్దిక్, నటాషా జంటకు పుట్టిన బిడ్డకు అగస్త్య అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 13, 2023 8:05 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…