Trends

భూకంపం గురించి ముందే వార్నింగ్ ఇచ్చాడు

కనివినీ ఎరుగని విపత్తు విరుచుకుపడింది. పుడమితల్లి కాస్తంత కదిలింది. దానికే మనిషి కోలుకోలేనంత భారీ నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం చోటు చేసుకుంది. అత్యుత్తమ సాంకేతికతను అందిపుచ్చుకున్నామని చెప్పే ఈ రోజుల్లో భూకంపం లాంటి తీవ్ర విపత్తును ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థలు కచ్ఛితంగా ఏమీ లేని పరిస్థితి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తుర్కియే.. సిరియాల్లో చోటు చేసుకున్న భారీ భూకంపం కారణంగా 4500 మంది వరకు మరణించారని చెబుతున్నారు. ఇక.. ఆస్తి నష్టం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

అయితే.. ఈ భారీ భూకంపం గురించి ఒక నిపుణుడు ముందుగా హెచ్చరించిన విషయం తాజాగా వెలుగు చూసింది. భూకంపం చోటు చేసుకోవటానికి మూడు రోజులు ముందే ఆయన హెచ్చరికలు చేసినప్పటికీ సరైన రీతిలో స్పందించకపోవటం.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం కూడా భారీ ప్రాణ.. ఆస్తి నష్టానికి కారణమని చెబుతున్నారు. భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే సంస్థకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హుగర్ బీట్స్ విరుచుకుపడనున్న ఉత్పాతాన్ని గుర్తించి హెచ్చరికలు చేశారు.

దీనికి సంబంధించిన ట్వీట్ ఆయన ఫిబ్రవరి మూడున పోస్టు చేస్తూ.. “దక్షిణ మధ్య తుర్కియే..జోర్డాన్.. సిరియా.. లెబనాన్ ప్రాంతాల్లో భూకంపం సంభవించే అవకాశం ఉంది. 7.5 తీవ్రత ఉండనుంది” అని పేర్కొన్నారు. ఆయన అంచనా వేసినట్లే.. సరిగ్గా మూడు రోజులకు అంటే ఫిబ్రవరి ఆరున తెల్లవారుజామున మొదలైన భూకంప ప్రకంపనలు విలయాన్ని క్రియేట్ చేయటమే కాదు.. అంతులేని విషాదాన్ని తీసుకొచ్చాయి.

తాజాగా చోటు చేసుకున్న విలయం నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ సంఘటన తనను ఎంతగానో కలిచివేసిందని.. తాను భూకంపం వస్తుందని ముందే చెప్పానని ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ భూకంపం 115 ఏళ్ల క్రితం వచ్చిన మాదిరిగానే ఉంటుందని అంచనా వేశా. సంక్లిష్ట రేఖా గణితం ఆధారంగా అంచనా వేశాం. స్థానికంగా ఇప్పటివరకు సంభవించిన భూకంపాల్లో ఇదే అత్యంత తీవ్రమైనది. మరిన్ని ప్రకంపనలకు అవకాశం ఉంది” అని పేర్కొన్నారు.

ఆయన అలా చెప్పిన గంటల వ్యవధిలోనే ప్రకంపనలు చోటుచేసుకోవటం.. తీవ్రత ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే.. ఆయన మాటల్ని కొందరు తప్పు పడుతున్నారు. గతంలో ఆయన వేసిన అంచనాలు తప్పు అయ్యాయని చెబుతున్నారు. అయితే.. కొన్ని విపత్తుల మీద చెప్పే అంచనాలను నిపుణులు క్రాస్ చెక్ చేయటం ద్వారా.. మహా విషాదాల్ని అడ్డుకునే వీలుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది.

This post was last modified on February 7, 2023 2:16 pm

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

53 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

4 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

4 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

5 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

5 hours ago