బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి రెండున్నరేళ్లు దాటిపోయింది. నటనలో, సినిమాల ఎంపికలో ప్రతిభ, అభిరుచి చాటుకుంటూ పెద్ద స్టార్ అయ్యేలా కనిపించిన ఈ యువ నటుడు అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేసింది. ముందు అతడిది ఆత్మహత్యగా భావించినా.. తర్వాత అనుమానాస్పద మృతిగా భావించారు.
కానీ ఈ విషయంలో ఏ సాక్ష్యాధారాలు బయటికి రాకపోవడంతో కేసు క్లోజ్ అయిపోయింది. ఇటీవల సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన సిబ్బందిలో ఒకరు.. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనం రేపింది.
రెండేళ్ల పాటు సుశాంత్ మృతిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ వచ్చిన అతడి అభిమానులు.. ఈ ఆరోపణలతో మళ్లీ మేల్కొన్నారు. మళ్లీ బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చిన సుశాంత్ ఫ్యాన్స్.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. అందుక్కారణం సుశాంత్ కుక్క చనిపోవడమే. సుశాంత్కు కుక్కల మీద అమితమైన ప్రేమ ఉంది. అతను ఫడ్జ్ అనే జాతి కుక్కును పెంచుకుంటుండేవాడు. దాంతో కలిసి దిగిన అనేక ఫొటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి.
ఐతే సుశాంత్ మరణం తర్వాత అది బెంగ పెట్టేసుకుందట. ఆ బెంగతోనే తాజాగా అది ప్రాణాలు వదిలింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తన స్నేహితుడిని కలవడానికి ఫడ్జ్ స్వర్గానికి వెళ్లిపోయిందని.. దాన్ని అనుసరిస్తూ తాము కూడా త్వరలోనే వచ్చేస్తామని.. సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్టు పెట్టింది.
ఇది సుశాంత్ అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. సుశాంత్ మరణానంతరం అతడి ఫొటో పెట్టుకుని దిగాలుగా పడుతున్న ఫడ్జ్ ఫొటోను పెట్టి ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా మరోసారి బాలీవుడ్ సెలబ్రెటీలు, నెపో కిడ్స్ను టార్గెట్ చేస్తూ హేట్ పోస్టులతో ట్రెండ్ చేస్తున్నారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…