బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి రెండున్నరేళ్లు దాటిపోయింది. నటనలో, సినిమాల ఎంపికలో ప్రతిభ, అభిరుచి చాటుకుంటూ పెద్ద స్టార్ అయ్యేలా కనిపించిన ఈ యువ నటుడు అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేసింది. ముందు అతడిది ఆత్మహత్యగా భావించినా.. తర్వాత అనుమానాస్పద మృతిగా భావించారు.
కానీ ఈ విషయంలో ఏ సాక్ష్యాధారాలు బయటికి రాకపోవడంతో కేసు క్లోజ్ అయిపోయింది. ఇటీవల సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన సిబ్బందిలో ఒకరు.. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనం రేపింది.
రెండేళ్ల పాటు సుశాంత్ మృతిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ వచ్చిన అతడి అభిమానులు.. ఈ ఆరోపణలతో మళ్లీ మేల్కొన్నారు. మళ్లీ బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చిన సుశాంత్ ఫ్యాన్స్.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. అందుక్కారణం సుశాంత్ కుక్క చనిపోవడమే. సుశాంత్కు కుక్కల మీద అమితమైన ప్రేమ ఉంది. అతను ఫడ్జ్ అనే జాతి కుక్కును పెంచుకుంటుండేవాడు. దాంతో కలిసి దిగిన అనేక ఫొటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి.
ఐతే సుశాంత్ మరణం తర్వాత అది బెంగ పెట్టేసుకుందట. ఆ బెంగతోనే తాజాగా అది ప్రాణాలు వదిలింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తన స్నేహితుడిని కలవడానికి ఫడ్జ్ స్వర్గానికి వెళ్లిపోయిందని.. దాన్ని అనుసరిస్తూ తాము కూడా త్వరలోనే వచ్చేస్తామని.. సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్టు పెట్టింది.
ఇది సుశాంత్ అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. సుశాంత్ మరణానంతరం అతడి ఫొటో పెట్టుకుని దిగాలుగా పడుతున్న ఫడ్జ్ ఫొటోను పెట్టి ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా మరోసారి బాలీవుడ్ సెలబ్రెటీలు, నెపో కిడ్స్ను టార్గెట్ చేస్తూ హేట్ పోస్టులతో ట్రెండ్ చేస్తున్నారు.
This post was last modified on January 17, 2023 8:53 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…