బ్రిడ్జర్ వాకర్.. బ్రిడ్జర్ వాకర్.. ప్రపంచవ్యాప్తంగా ఓ వారం రోజుల నుంచి మర్మోగుతున్న పేరిది. ఇది ఓ ఆరేళ్ల పిల్లాడి పేరు. ముఖం మీద తీవ్ర గాయాలతో.. పక్కన తన చిన్నారి చెల్లితో కలిసి నిలబడి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శభాష్ చిన్నోడా.. అంటూ కోట్లాది మంది అతణ్ని పొగుడుతున్నారు? అతను ఏం చేశాడో తెలిస్తే ఈ వార్త చదివాక చివర్లో మీరు కూడా ఆ కుర్రాడిని శభాష్ అనకుండా ఉండలేరు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
అమెరికాలోని వ్యోమింగ్కు చెందిన బ్రిడ్జర్ వాకర్కు నాలుగేళ్ల చిన్నారి చెల్లెలు ఉంది. ఇటీవల ఆ చిన్నారిపై ఓ పెద్ద కుక్క దాడి చేయబోయింది. అది చూసిన వాకర్.. చెల్లెని తప్పించి కుక్కకు ఎదురు నిలిచాడు. అది పాశవిక రీతిలో అతడిపై దాడి చేసింది. ఐతే ముఖం సహా ఒళ్లంతా గాయాలైనా.. పలు చోట్ల చీరుకుపోయినా.. రక్తం ధారలుగా కారుతున్నా అతను తన పోరాటాన్ని ఆపలేదు. ఆ కుక్క తన చెల్లెలి దరిదాపుల్లోకి వెళ్లకుండా చూసుకున్నాడు. చివరికి ఎవరో పక్కింటి వాళ్లు చూసి కుక్కును తరిమికొట్టారు.
అనంతరం వాకర్ను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన వాకర్కు వైద్యుల బృందం రెండు గంటలకు పైగా సర్జరీ చేయాల్సిన అవసరం పడింది. అతడి ఒంటిపై 90 దాకా కుట్లు పడ్డాయట. ముఖం మీద గాయాన్ని చూస్తే తీవ్రత అర్థమైపోతుంది. ఎందుకింత సాహసం చేశావని అడిగితే.. చెల్లెలంటే ప్రాణమని.. ఆ కుక్కో, తానో ఎవరో ఒకరే మిగలాలి తప్ప చెల్లెలిపై అది దాడి చేయకూడదని అనుకున్నానని ఆ కుర్రాడు చెప్పడం విశేషం. అతడి ధైర్యసాహసాలకు ఫిదా అయిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరల్డ్ బాక్సింగ్ సమాఖ్య అతడికి ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధమవడం విశేషం.
This post was last modified on July 18, 2020 4:19 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…