బ్రిడ్జర్ వాకర్.. బ్రిడ్జర్ వాకర్.. ప్రపంచవ్యాప్తంగా ఓ వారం రోజుల నుంచి మర్మోగుతున్న పేరిది. ఇది ఓ ఆరేళ్ల పిల్లాడి పేరు. ముఖం మీద తీవ్ర గాయాలతో.. పక్కన తన చిన్నారి చెల్లితో కలిసి నిలబడి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శభాష్ చిన్నోడా.. అంటూ కోట్లాది మంది అతణ్ని పొగుడుతున్నారు? అతను ఏం చేశాడో తెలిస్తే ఈ వార్త చదివాక చివర్లో మీరు కూడా ఆ కుర్రాడిని శభాష్ అనకుండా ఉండలేరు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
అమెరికాలోని వ్యోమింగ్కు చెందిన బ్రిడ్జర్ వాకర్కు నాలుగేళ్ల చిన్నారి చెల్లెలు ఉంది. ఇటీవల ఆ చిన్నారిపై ఓ పెద్ద కుక్క దాడి చేయబోయింది. అది చూసిన వాకర్.. చెల్లెని తప్పించి కుక్కకు ఎదురు నిలిచాడు. అది పాశవిక రీతిలో అతడిపై దాడి చేసింది. ఐతే ముఖం సహా ఒళ్లంతా గాయాలైనా.. పలు చోట్ల చీరుకుపోయినా.. రక్తం ధారలుగా కారుతున్నా అతను తన పోరాటాన్ని ఆపలేదు. ఆ కుక్క తన చెల్లెలి దరిదాపుల్లోకి వెళ్లకుండా చూసుకున్నాడు. చివరికి ఎవరో పక్కింటి వాళ్లు చూసి కుక్కును తరిమికొట్టారు.
అనంతరం వాకర్ను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన వాకర్కు వైద్యుల బృందం రెండు గంటలకు పైగా సర్జరీ చేయాల్సిన అవసరం పడింది. అతడి ఒంటిపై 90 దాకా కుట్లు పడ్డాయట. ముఖం మీద గాయాన్ని చూస్తే తీవ్రత అర్థమైపోతుంది. ఎందుకింత సాహసం చేశావని అడిగితే.. చెల్లెలంటే ప్రాణమని.. ఆ కుక్కో, తానో ఎవరో ఒకరే మిగలాలి తప్ప చెల్లెలిపై అది దాడి చేయకూడదని అనుకున్నానని ఆ కుర్రాడు చెప్పడం విశేషం. అతడి ధైర్యసాహసాలకు ఫిదా అయిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరల్డ్ బాక్సింగ్ సమాఖ్య అతడికి ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధమవడం విశేషం.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…