ఏ దర్శకుడికైనా తన అభిమాన హీరోతో సినిమా తీసే అవకాశం వస్తే ఆనందానికి అవధులు ఉండవు. ఆ సినిమాను చాలా ప్రత్యేకంగా భావిస్తారు. దాన్నొక మైలురాయిలా తీర్చిదిద్దాలని, బ్లాక్బస్టర్ చేయాలని ప్రయత్నిస్తారు. టాలీవుడ్ యువ దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు.
నందమూరి బాలకృష్ణకు తాను వీరాభిమాని అని ఆయనతో సినిమా కన్ఫమ్ కావడానికి ముందు నుంచే చెబుతూ వచ్చాడు గోపీచంద్. క్రాక్తో బ్లాక్బస్టర్ కొట్టడంతో అతడికి బాలయ్యతో సినిమా చేసే అవకాశం వచ్చింది. వీరి కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ వీరసింహారెడ్డి సినిమాను నిర్మిస్తోంది.
సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో, జీవితంలో అత్యంత ప్రత్యేకమైన సినిమా కావడంతో ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు గోపీచంద్.
వీరసింహారెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్ను తన సొంతగడ్డ అయిన ఒంగోలులో చేయించేందుకు హీరో, నిర్మాతలను అతను ఒప్పించాడు. జనవరి 6న ఈ ఈవెంట్ ఒంగోలులో జరగబోతోంది. ఈ విషయాన్ని సినిమాలోని మా బావ మనోభావాలు పాట లాంచ్ సందర్భంగా స్వయంగా గోపీచందే వెల్లడించాడు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఒక థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. అభిమానులు బాలయ్య డైలాగ్స్ చెప్పమంటూ గొడవ చేస్తుంటే.. వారికి గోపీచంద్ సర్ది చెప్పాడు. జనవరి 6న ఒంగోలులో ప్రి రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని.. అందులో బాలయ్య సినిమాలోని మాస్ డైలాగులు చెబుతారని వారిని సముదాయించాడు.
మొత్తానికి ప్రి రిలీజ్ ఈవెంట్ గురించి అధికారిక ప్రకటన రాకముందే విషయం గోపీచంద్ ఇలా లీక్ చేసేశాడు. ఏదైతేనేం తన అభిమాన కథానాయకుడితో తీసిన సినిమా ఈవెంట్ను తన సొంత ఊర్లో చేసుకోవడం గోపీచంద్కు చాలా ప్రత్యేకమే.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…