దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్దా వాకర్ దారుణ హత్య ఉదంతంలో నిందితుడిగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా. సహజీవనం చేస్తూ.. పెళ్లి కోసం ఒత్తిడి చేసిందన్న కారణంగా దారుణమైన రీతిలో ముక్కలు ముక్కలుగా నరికి.. ఇంట్లోని పెద్ద ఫ్రిజ్ లో అట్టి పెట్టి.. ఒక్కో ముక్కను విడిగా బయట పారేసి వచ్చిన భయంకర ఉదంతం వెలుగు చూడటం తెలిసిందే. కోర్టు విధించిన రిమాండ్ లో భాగంగా అతడ్ని తీహార్ జైలుకు తరలించారు.
జైల్లో ఉన్న అతను ఎవరితోనూ మాట్లాడటం లేదని.. ముభావంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. తన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు సైతం ఆసక్తి చూపటం లేదని జైలు అధికారులు వెల్లడించారు. జైల్లోని తన సెల్ లో పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్నట్లుగాచెబుతున్నారు. ఇప్పటికి తన కుటుంబ సభ్యులు.. స్నేహితుల జాబితాను ఆఫ్తాబ్ ఇవ్వలేదని చెబుతున్నారు.
తీహార్ జైల్లో ఉన్న ఖైదీలకు తమ కుటుంబ సభ్యులు.. మిత్రుల్ని కలుసుకునేందుకు వారంలో రెండు రోజులు అవకాశం ఇస్తారు. అంతేకాదు.. వారంలో రెండు రోజుల పాటు ఐదు నిమిషాల చొప్పున ఫోన్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. అయితే.. ఇందుకోసం రాతపూర్వకంగా సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది. అఫిడవిట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆఫ్తాబ్ అలాంటిదేమీ చేయలేదని చెబుతున్నారు.
ఎవరితో కలవకుండా తన మానాన తాను ఉంటున్న అతడికి జైలు అధికారులు ఇంగ్లిషు నవల్స్ ఇచ్చారు. అమెరికన్ రచయిత పాల్ థెరౌక్స్ ట్రావెల్ లాగ్ అయిన ది గ్రేట్ రైల్వే బజార్ పుస్తకాన్ని ఇవ్వగా.. మరికొన్ని పుస్తకాలు కూడా తనకు ఇవ్వాలని కోరినట్లుగా చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…