దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్దా వాకర్ దారుణ హత్య ఉదంతంలో నిందితుడిగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా. సహజీవనం చేస్తూ.. పెళ్లి కోసం ఒత్తిడి చేసిందన్న కారణంగా దారుణమైన రీతిలో ముక్కలు ముక్కలుగా నరికి.. ఇంట్లోని పెద్ద ఫ్రిజ్ లో అట్టి పెట్టి.. ఒక్కో ముక్కను విడిగా బయట పారేసి వచ్చిన భయంకర ఉదంతం వెలుగు చూడటం తెలిసిందే. కోర్టు విధించిన రిమాండ్ లో భాగంగా అతడ్ని తీహార్ జైలుకు తరలించారు.
జైల్లో ఉన్న అతను ఎవరితోనూ మాట్లాడటం లేదని.. ముభావంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. తన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు సైతం ఆసక్తి చూపటం లేదని జైలు అధికారులు వెల్లడించారు. జైల్లోని తన సెల్ లో పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్నట్లుగాచెబుతున్నారు. ఇప్పటికి తన కుటుంబ సభ్యులు.. స్నేహితుల జాబితాను ఆఫ్తాబ్ ఇవ్వలేదని చెబుతున్నారు.
తీహార్ జైల్లో ఉన్న ఖైదీలకు తమ కుటుంబ సభ్యులు.. మిత్రుల్ని కలుసుకునేందుకు వారంలో రెండు రోజులు అవకాశం ఇస్తారు. అంతేకాదు.. వారంలో రెండు రోజుల పాటు ఐదు నిమిషాల చొప్పున ఫోన్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. అయితే.. ఇందుకోసం రాతపూర్వకంగా సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది. అఫిడవిట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆఫ్తాబ్ అలాంటిదేమీ చేయలేదని చెబుతున్నారు.
ఎవరితో కలవకుండా తన మానాన తాను ఉంటున్న అతడికి జైలు అధికారులు ఇంగ్లిషు నవల్స్ ఇచ్చారు. అమెరికన్ రచయిత పాల్ థెరౌక్స్ ట్రావెల్ లాగ్ అయిన ది గ్రేట్ రైల్వే బజార్ పుస్తకాన్ని ఇవ్వగా.. మరికొన్ని పుస్తకాలు కూడా తనకు ఇవ్వాలని కోరినట్లుగా చెబుతున్నారు.
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…