ఈమధ్య పిల్లలు యువకులు ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు. చేతిలో ఫోన్ లేదా టాబ్లెట్ ఉంటే చాలు డబ్బులు పెట్టు మరి గేమ్స్ లోని కొత్త ఫీచర్స్ ను అన్ లాక్ చేస్తున్నారు. ఇంకేముంది నిమిషాల్లో వేలు, లక్షల రూపాయలు గోవిందా.
రంగారెడ్డి జిల్లాలోని షాదాబ్ మండలం సీతారాంపూర్ చెందిన ఒక రైతు నిర్వాసితుడు కావడంతో అతనికి 95 లక్షల రూపాయలు పరిహారం వచ్చింది. ఇక ఆ డబ్బుని అతడు బ్యాంకులో భద్రపరుచుకున్నాడు. ఆన్లైన్ లో ‘కింగ్ 527’ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆడుకున్నాడు. ఆ గేమ్ ఆడాలంటే అతను బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేయవలసి ఉంది.
అలా లింక్ చేసి క్రమేపి డబ్బులు అతను డబ్బులు పెట్టి గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఇంకేముంది ఒక్కసారిగా 95 లక్షల రూపాయలు ఆ గేమ్ ఆడేందుకు పెట్టి స్వాహా అనిపించాడు. ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు లబోదిబోమన్నారు.
ఇటీవల భూసేకరణలో ప్రభుత్వం వారికి అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చింది. అవి బ్యాంకులో జాగ్రత్తగా ఉంటాయని డిపాజిట్ చేస్తే వాళ్ళ కొడుకు ఇలా ఆన్లైన్ గేమ్ లో కాజేశాడు. అటు భూమి పోయి… ఇటు డబ్బులు పోయి… ఆ కుటుంబం తీవ్రవేదనకు గురి అవుతుంది.
ఈమధ్య సైబన్ నేరాలు జోరుగా సాగుతున్న సమయంలో ఇలాంటి గేమ్స్ ఆడటం ఎంతైనా ప్రమాదం. వీటిలో గెలుపు ఒక్కసారి మనకు చూపించి తర్వాత మన మెదడుని వారి గేమ్ ద్వారా కంట్రోల్ లోకి తెచ్చుకొని మనకి దానిని మనకు ఒక వ్యసనంగా మార్చేస్తారు ఇలా లక్షల డబ్బును కాజేస్తారు.
This post was last modified on December 21, 2022 6:27 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…