Trends

ఆన్ లైన్ గేమ్ లో రూ.95 లక్షలు పోగొట్టిన కుర్రాడు..!

ఈమధ్య పిల్లలు యువకులు ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు. చేతిలో ఫోన్ లేదా టాబ్లెట్ ఉంటే చాలు డబ్బులు పెట్టు మరి గేమ్స్ లోని కొత్త ఫీచర్స్ ను అన్ లాక్ చేస్తున్నారు. ఇంకేముంది నిమిషాల్లో వేలు, లక్షల రూపాయలు గోవిందా.

రంగారెడ్డి జిల్లాలోని షాదాబ్ మండలం సీతారాంపూర్ చెందిన ఒక రైతు నిర్వాసితుడు కావడంతో అతనికి 95 లక్షల రూపాయలు పరిహారం వచ్చింది. ఇక ఆ డబ్బుని అతడు బ్యాంకులో భద్రపరుచుకున్నాడు. ఆన్లైన్ లో ‘కింగ్ 527’ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆడుకున్నాడు. ఆ గేమ్ ఆడాలంటే అతను బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేయవలసి ఉంది.

అలా లింక్ చేసి క్రమేపి డబ్బులు అతను డబ్బులు పెట్టి గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఇంకేముంది ఒక్కసారిగా 95 లక్షల రూపాయలు ఆ గేమ్ ఆడేందుకు పెట్టి స్వాహా అనిపించాడు. ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు లబోదిబోమన్నారు.

ఇటీవల భూసేకరణలో ప్రభుత్వం వారికి అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చింది. అవి బ్యాంకులో జాగ్రత్తగా ఉంటాయని డిపాజిట్ చేస్తే వాళ్ళ కొడుకు ఇలా ఆన్లైన్ గేమ్ లో కాజేశాడు. అటు భూమి పోయి… ఇటు డబ్బులు పోయి… ఆ కుటుంబం తీవ్రవేదనకు గురి అవుతుంది.

ఈమధ్య సైబన్ నేరాలు జోరుగా సాగుతున్న సమయంలో ఇలాంటి గేమ్స్ ఆడటం ఎంతైనా ప్రమాదం. వీటిలో గెలుపు ఒక్కసారి మనకు చూపించి తర్వాత మన మెదడుని వారి గేమ్ ద్వారా కంట్రోల్ లోకి తెచ్చుకొని మనకి దానిని మనకు ఒక వ్యసనంగా మార్చేస్తారు ఇలా లక్షల డబ్బును కాజేస్తారు.

This post was last modified on December 21, 2022 6:27 pm

Share
Show comments

Recent Posts

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

1 hour ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

1 hour ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

2 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

3 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

5 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

7 hours ago