Trends

27 నుంచి 32.. పెరుగుతున్న లెక్క‌.. జ‌గ‌న్ త‌ప్పులే కార‌ణ‌మా?

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం లేద‌ని.. ఎన్ని సార్టు చెబుతున్నా వారు ప‌ట్టించుకోవ‌డం లేదని సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గాల‌పై తెప్పించు కున్న నివేదికల ఆధారంగా.. దాదాపు 27 మంది ఎమ్మెల్యేల ప‌నితీరు బాగోలేద‌ని, వారు త‌మ పంథాను మార్చుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రించారు. దీంతో 151మందిలో 27 మాత్ర‌మేగా అనే చ‌ర్చ వ‌చ్చింది.

అయితే, ఇప్పుడు ఈ సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం లేదేని.. తాను చెప్పిన గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్ని అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తాజాగా సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. వీరిలో మంత్రులు కూడా ఉండ‌డం, వారిని కూడా సాధార‌ణ ఎమ్మెల్యేల మాదిరిగానే సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రించ‌డం వంటివి పార్టీలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే, ప్ర‌స్తుతం చెబుతున్న 32 మంది లెక్క కూడా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత పెరిగినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.

ఇదిలావుంటే, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌తి ఇంటినీ మూడు సార్ల‌యినా త‌ట్టా లనేది సీఎం జ‌గ‌న్ లెక్క‌. బాగానే ఉంది. కొంద‌రు ఈ ప‌నికూడా చేస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ఆయ‌న సమీక్షించి.. స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకుని ఊర‌ట చెందేలా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డమే అస‌లు స‌మ‌స్య గా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు క్షేత్ర‌స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తున్నారు.

రోడ్లు బాగాలేద‌ని, మురికినీటి వ్య‌వ‌స్థ బాగాలేద‌ని చెబుతున్నారు. మ‌రి క‌నీసంలో క‌నీసం వీటిని చేయించే విధంగా అయినా.. త‌మ‌కు నిధులు ఇవ్వాల‌న్న ఎమ్మ‌ల్యే మాట‌ల‌ను సీఎంజ‌గ‌న్ ఆల‌కించ‌డం లేద‌ని పార్టీలో నాయ‌కులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాలంటేనే సొంత ఖ‌ర్చులు పెట్టుకుని కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకువెళ్లి.. వ‌స్తున్నామ‌ని, ఇక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిధులు ఇవ్వాలంటే త‌మ వ‌ల్ల కాద‌ని చెబుతున్నారు. అంటే, మొత్తంగా ఎమ్మెల్యేలు తిర‌గ‌లేక పోవ‌డానికి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోతుండ‌డానికి ప్ర‌త్య‌క్షంగా అయినా.. ప‌రోక్షంగా అయినా.. ప్ర‌భుత్వం కాదా? అనే చ‌ర్చ పార్టీలోనే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 16, 2022 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

55 minutes ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

1 hour ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

2 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

3 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

4 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

6 hours ago