Trends

27 నుంచి 32.. పెరుగుతున్న లెక్క‌.. జ‌గ‌న్ త‌ప్పులే కార‌ణ‌మా?

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం లేద‌ని.. ఎన్ని సార్టు చెబుతున్నా వారు ప‌ట్టించుకోవ‌డం లేదని సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గాల‌పై తెప్పించు కున్న నివేదికల ఆధారంగా.. దాదాపు 27 మంది ఎమ్మెల్యేల ప‌నితీరు బాగోలేద‌ని, వారు త‌మ పంథాను మార్చుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రించారు. దీంతో 151మందిలో 27 మాత్ర‌మేగా అనే చ‌ర్చ వ‌చ్చింది.

అయితే, ఇప్పుడు ఈ సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం లేదేని.. తాను చెప్పిన గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్ని అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తాజాగా సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. వీరిలో మంత్రులు కూడా ఉండ‌డం, వారిని కూడా సాధార‌ణ ఎమ్మెల్యేల మాదిరిగానే సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రించ‌డం వంటివి పార్టీలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే, ప్ర‌స్తుతం చెబుతున్న 32 మంది లెక్క కూడా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత పెరిగినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.

ఇదిలావుంటే, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌తి ఇంటినీ మూడు సార్ల‌యినా త‌ట్టా లనేది సీఎం జ‌గ‌న్ లెక్క‌. బాగానే ఉంది. కొంద‌రు ఈ ప‌నికూడా చేస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ఆయ‌న సమీక్షించి.. స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకుని ఊర‌ట చెందేలా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డమే అస‌లు స‌మ‌స్య గా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు క్షేత్ర‌స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తున్నారు.

రోడ్లు బాగాలేద‌ని, మురికినీటి వ్య‌వ‌స్థ బాగాలేద‌ని చెబుతున్నారు. మ‌రి క‌నీసంలో క‌నీసం వీటిని చేయించే విధంగా అయినా.. త‌మ‌కు నిధులు ఇవ్వాల‌న్న ఎమ్మ‌ల్యే మాట‌ల‌ను సీఎంజ‌గ‌న్ ఆల‌కించ‌డం లేద‌ని పార్టీలో నాయ‌కులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాలంటేనే సొంత ఖ‌ర్చులు పెట్టుకుని కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకువెళ్లి.. వ‌స్తున్నామ‌ని, ఇక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిధులు ఇవ్వాలంటే త‌మ వ‌ల్ల కాద‌ని చెబుతున్నారు. అంటే, మొత్తంగా ఎమ్మెల్యేలు తిర‌గ‌లేక పోవ‌డానికి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోతుండ‌డానికి ప్ర‌త్య‌క్షంగా అయినా.. ప‌రోక్షంగా అయినా.. ప్ర‌భుత్వం కాదా? అనే చ‌ర్చ పార్టీలోనే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

తెలంగాణలో జనసేన సింగిల్ గా గర్జిస్తుందా?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…

45 minutes ago

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

5 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

8 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

10 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

11 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

11 hours ago