మద్యం మత్తు తలకెక్కితే మనిషి ఎలా అదుపు తప్పుతాడో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. ఒక అమ్మాయి పూటుగా మందుకొట్టి తానేం మాట్లాడుతున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియకుండా చేసిన వీరంగం తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మన ఆంధ్రప్రదేశ్కు చెందింది కావడం విశేషం.
విశాఖపట్నంలో ఓ అమ్మాయి మందు కొట్టడమే కాక గంజాయి నిండిన సిగరెట్ కాల్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందని, న్యూసెన్స్ చేస్తోందని తెలుసుకుని సత్యనారాయణ అనే ఏఎస్ఐ తన టీంతో కలిసి వెళ్లారు. గొడవ చేస్తుండడం గురించి ప్రశ్నిస్తుండగా.. ఆ అమ్మాయి రెచ్చిపోయింది.
ఏఎస్సైని పట్టుకుని ‘‘ఎర్రి… లం……కా..’’.. ‘‘నీ అమ్మని..’’ లాంటి దారుణమైన బూతులు మాట్లాడుతూ ఆ అమ్మాయి వీరంగం సృష్టించింది. ఇలా బూతులు మాట్లాడుతుండగా. పక్కన ఆ అమ్మాయి తల్లి కూడా ఉంది. ఆమెకు పోలీసులు గురించి కంప్లైంట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయిందా అమ్మాయి. తనను ఐదుసార్లు కొట్టారని, అయినా పట్టించుకోలేదని.. ఏం పీకుతావో చూస్తా అంటూ బూతులు అందుకుంది. లం…..కా అని తిడుతూ ఆమె ఏఎస్ఐని ఎగిరి తన్నడం గమనార్హం. దీంతో ఆయన లాఠీతో ఆమెను ఒక దెబ్బ కొట్టారు.
వీడియోను గమనిస్తే ఆ అమ్మాయికి తనేం చేస్తోందో తెలియని మైకంలో ఉందని అర్థమవుతోంది. కేవలం మందుకొడితే ఈ స్థాయిలో అదుపు తప్పే అవకాశం లేదు. ఇదంతా గంజాయి ప్రభావం అన్నది స్పష్టం.
ఆంధ్రాలో మునుపెన్నడూ లేని విధంగా గంజాయి సరఫరా పెరిగిందని, యువత దాని మత్తులో చిత్తయిపోతున్నారని ఇటీవల తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో చూశాక పరిస్థితి ఎంత అదుపు తప్పుతోందో అర్థం అవుతోంది. అర్జెంటుగా దీనికి అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందనడానికి ఈ వీడియో ఉదాహరణ.
This post was last modified on December 15, 2022 4:46 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…