టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయాల్లో సైలెంట్గా ఉంటారనే పేరున్నప్పటికీ.. అవసరం.. అవకాశం వచ్చిన ప్రతిసారీ.. బాలయ్య తన విశ్వరూపం చూపిస్తూనే ఉన్నారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు రూ.2 కే భోజనం అందిస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు ప్రాంతాల్లో నిత్యం మధ్యాహ్నం 11 – 2 గంటల వరకు ఈ భోజనం అందుతోంది.
మొబైల్ క్యాంటీన్లపై తీసుకువస్తున్న వేడి వేడి రుచికరమైన భోజనం అందుకునేందుకు అనేక మంది కార్మికులు, పేదలు, కూలీలు .. క్యూ కట్టి మరీ వేచి ఉంటున్నారు. ఇలాంటివి నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు.
దీనిని బాలయ్య సతీమణి వసుంధర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల అధునాతన వైద్య సేవలు అందించేలా.. మొబైల్ ఆసుపత్రిని కూడా నియోజకవర్గానికి బాలయ్య అందించారు.ఇలా.. తనదైన సేవలతో ఆయన ముందుంటున్నారు.
ఇక, తాజాగా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 200 రోజులు పూర్తయిన సందర్భంగా రూ.2కే చికెన్ బిర్యానీని వేడివేడిగా అందించారు. వాస్తవానికి ఏదైనా హోటల్లో చికెన్ బిర్యానీ తినాలంటే.. కనీసంలో కనీసం రూ.100 కేటాయించాలి. అలాంటిదిరూ.2కే ఘుమఘుమ లాడే బిర్యానీని వేడివేడిగా వండించి .. తన నియోజకవర్గం పేదల జిహ్వా చాపల్యాన్ని తీర్చారు బాలయ్య.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు దాదాపు క్వింటా బాసుమతి బియ్యం, 500 కిలోల చికెన్తో సుమారు 50 మంది ఈ బిర్యాన్ని రూపొందించి పేదలకు అందించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి బాలయ్య బిర్యానీని రుచి చూసేందుకు ప్రజలు క్యూకట్టి మరీ నిల్చోవడం ఆశ్చర్యకరంగా మారింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…