Trends

రెండు రూపాయ‌ల‌కే.. బాల‌య్య చికెన్‌ బిర్యానీ!

టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. రాజ‌కీయాల్లో సైలెంట్‌గా ఉంటార‌నే పేరున్న‌ప్ప‌టికీ.. అవ‌స‌రం.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ.. బాల‌య్య త‌న విశ్వ‌రూపం చూపిస్తూనే ఉన్నారు.

టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. పేద‌ల‌కు రూ.2 కే భోజ‌నం అందిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు ప్రాంతాల్లో నిత్యం మ‌ధ్యాహ్నం 11 – 2 గంట‌ల వ‌ర‌కు ఈ భోజ‌నం అందుతోంది.

మొబైల్ క్యాంటీన్ల‌పై తీసుకువ‌స్తున్న వేడి వేడి రుచిక‌ర‌మైన భోజ‌నం అందుకునేందుకు అనేక మంది కార్మికులు, పేద‌లు, కూలీలు .. క్యూ క‌ట్టి మరీ వేచి ఉంటున్నారు. ఇలాంటివి నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు.

దీనిని బాల‌య్య స‌తీమ‌ణి వ‌సుంధ‌ర ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇటీవ‌ల అధునాతన వైద్య సేవ‌లు అందించేలా.. మొబైల్ ఆసుప‌త్రిని కూడా నియోజ‌క‌వ‌ర్గానికి బాల‌య్య అందించారు.ఇలా.. త‌న‌దైన సేవ‌ల‌తో ఆయ‌న ముందుంటున్నారు.

ఇక‌, తాజాగా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 200 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా రూ.2కే చికెన్ బిర్యానీని వేడివేడిగా అందించారు. వాస్త‌వానికి ఏదైనా హోట‌ల్‌లో చికెన్ బిర్యానీ తినాలంటే.. క‌నీసంలో క‌నీసం రూ.100 కేటాయించాలి. అలాంటిదిరూ.2కే ఘుమ‌ఘుమ లాడే బిర్యానీని వేడివేడిగా వండించి .. త‌న నియోజ‌క‌వ‌ర్గం పేద‌ల జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చారు బాల‌య్య‌.

ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు దాదాపు క్వింటా బాసుమ‌తి బియ్యం, 500 కిలోల చికెన్‌తో సుమారు 50 మంది ఈ బిర్యాన్ని రూపొందించి పేద‌ల‌కు అందించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. మొత్తానికి బాల‌య్య బిర్యానీని రుచి చూసేందుకు ప్ర‌జ‌లు క్యూక‌ట్టి మ‌రీ నిల్చోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

3 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

7 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

7 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

9 hours ago