ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. తాజాగా దిల్లీ ఒక వ్యక్తి వద్ద 50 లక్షలు టోకరా వేశారు. కేవలం అతని ఫోన్ కి మిస్డ్ కాల్స్ రావడం వల్ల అతను ఈ డబ్బుని పోగొట్టుకున్నాడు. అతను ఆ ఫోన్ కాల్స్ ఎత్తితే అవతల వేరొకరు మాట్లాడకపోగా కొద్దిసేపటికి అతని అకౌంట్ లో నుండి 50 లక్షలు రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విషయం ఏమిటంటే రాత్రి 7:00 నుండి 8:30 గంటల ప్రాంతంలో అతనికి వేరు వేరు నెంబర్లనుండి ఫోన్లు వచ్చాయి. ఇతను ఎత్తి మాట్లాడితే అవతల వైపు నుండి సమాధానం ఉండదు. ఎటువంటి ఓటీపీ నెంబర్ ను ఇతని వద్ద తెలుసుకోకుండా సైబర్ నేరగాళ్లు ఇంత మొత్తాన్ని ఎలా కాజేయగలిగారు అన్న విషయం అంతుచిక్కడం లేదు.
ఇక పోలీసులు కేసుని రాసుకొని సిమ్ స్వాపింగ్ పద్ధతిలో ఈ మోసం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. సిమ్ స్వాపింగ్ అంటే. తన సిమ్ పోయిందని మరొక వ్యక్తి లాగా టెలిఫోన్ ప్రొవైడర్ తో మాట్లాడి అదే నెంబర్ పై ఇంకొక సిమ్ తీసుకొని వీరికి వచ్చే కాల్స్, మెసేజెస్ వారికి డైవర్ట్ చేసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారానే ఈ మోసం జరిగి ఉంటుందని సైబర్ పోలీసులు అనుమాన పడుతున్నారు. మరి నిజానిజాలు ఎలా ఉన్నా ఇలాంటి ఫోన్ కాల్స్ మాత్రం చాలా డేంజర్ అన్న విషయం అర్థం అవుతోంది.
This post was last modified on December 13, 2022 7:21 pm
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…