ఈరోజుల్లో సెల్ ఫోన్ చేతుల్లో లేకుండా ఎవరూ కనిపించడం లేదు. మన రోజు వారి జీవితంలో చరవాణి భాగం అయిపోయింది. అయితే వీటి వల్లే భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలకు దారితీస్తోందని ఒక సర్వే తెలిపింది. ప్రతి 10 మంది భారతీయ దంపతుల్లో 8 మంది సెల్ ఫోన్ కారణంగానే విడిపోతున్నారు అన్న షాకింగ్ వాస్తవం వెల్లడింది.
మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాదాపు 67 శాతం మంది తన భాగస్వామితో సెల్ ఫోన్ వాడుతూనే కాలం గడుపుతున్నట్లు చెబుతున్నారు. ఇక 66% మంది సెల్ ఫోన్ వల్ల తమ భాగస్వామితో సరిగ్గా కాలం గడపలేకపోతున్నామని వారి వివాహ సంబంధం బలహీన పడిందని ఒప్పుకున్నారు. 70 శాతం మంది అయితే ఫోన్ వాడుతున్నప్పుడు అంతరాయం కలిగిస్తే చిరాకు పడతామని కూడా చెప్పారు.
సైబర్ మీడియా రీసర్చ్ (CMR) వివో (Vivo) వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పైన విషయాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో 1.2 బిలియన్ల మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు 600 మిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్లు వాడుకలో ఉన్నాయి. వీళ్ళలో 68 శాతం మంది తమ భాగస్వామితో సంభాషించేటప్పుడు శ్రద్ధ వహించట్లేదని తెలుపుతూనే అర్థవంతమైన జీవితం కోసం ఈ అలవాటును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు.
మొత్తానికి భారతీయుల వైవాహిక జీవితంలో స్మార్ట్ ఫోన్ సవతి పాత్ర పోషిస్తోందన్న విషయం మాత్రం అర్థమవుతుంది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…