Trends

షాకింగ్ సర్వే: కాపురాల్లో చిచ్చు రేపుతున్న స్మార్ట్ ఫోన్

ఈరోజుల్లో సెల్ ఫోన్ చేతుల్లో లేకుండా ఎవరూ కనిపించడం లేదు. మన రోజు వారి జీవితంలో చరవాణి భాగం అయిపోయింది. అయితే వీటి వల్లే భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలకు దారితీస్తోందని ఒక సర్వే తెలిపింది. ప్రతి 10 మంది భారతీయ దంపతుల్లో 8 మంది సెల్ ఫోన్ కారణంగానే విడిపోతున్నారు అన్న షాకింగ్ వాస్తవం వెల్లడింది.

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాదాపు 67 శాతం మంది తన భాగస్వామితో సెల్ ఫోన్ వాడుతూనే కాలం గడుపుతున్నట్లు చెబుతున్నారు. ఇక 66% మంది సెల్ ఫోన్ వల్ల తమ భాగస్వామితో సరిగ్గా కాలం గడపలేకపోతున్నామని వారి వివాహ సంబంధం బలహీన పడిందని ఒప్పుకున్నారు. 70 శాతం మంది అయితే ఫోన్ వాడుతున్నప్పుడు అంతరాయం కలిగిస్తే చిరాకు పడతామని కూడా చెప్పారు.

సైబర్ మీడియా రీసర్చ్ (CMR) వివో (Vivo) వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పైన విషయాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో 1.2 బిలియన్ల మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు 600 మిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్లు వాడుకలో ఉన్నాయి. వీళ్ళలో 68 శాతం మంది తమ భాగస్వామితో సంభాషించేటప్పుడు శ్రద్ధ వహించట్లేదని తెలుపుతూనే అర్థవంతమైన జీవితం కోసం ఈ అలవాటును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు.

మొత్తానికి భారతీయుల వైవాహిక జీవితంలో స్మార్ట్ ఫోన్ సవతి పాత్ర పోషిస్తోందన్న విషయం మాత్రం అర్థమవుతుంది.

This post was last modified on December 13, 2022 11:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

2 hours ago

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

5 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

5 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

8 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

9 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

9 hours ago