భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. వారికి ఇచ్చిన అప్పును తిరిగి అడుగుతున్నాడని కక్షతో ఇద్దరు దుండగులు ముత్యాలంపాడు కు చెందిన అశోక్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను నరికి చంపేశారు.
మృతుడు అశోక్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అతనికి తెలిసిన ఇద్దరు వ్యక్తులకు లక్ష రూపాయలను వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. ఇక వారు ఎన్ని రోజులకీ అప్పు తీర్చలేదు. అశోక్ పలుమార్లు అడిగినా వారి వద్ద సమాధానం లేదు.
ఇక సంఘటన జరిగిన రోజు అశోక్ ఆస్పత్రిలో ఉండగా… దుండగులు మూడు సార్లు అతనికి కాల్ చేశారు. చివరికి డబ్బులు ఇస్తాం అని ఘటనా స్థలానికి పిలిచి అతని పై దాడి చేసి చంపేశారు. కత్తితో గొంతు, చేతులు, కాళ్ళు మీద నరికి అశోక్ ను హతమార్చారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ హత్య అప్పు ఇచ్చిన లక్ష రూపాయల వల్లనే జరిగిందా లేదా దీనికి మరొక కోణం ఏదైనా ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. అశోక్ కి ఒక సంవత్సరం ముందే పెళ్లి జరుగగా అతనికి ఒక నెల రోజుల వయస్సు ఉన్న బాబు కూడా ఉన్నాడు.
This post was last modified on December 12, 2022 6:39 pm
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…