Trends

అప్పు ఇచ్చిన సాప్ట్ వేర్ ను చంపేశారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. వారికి ఇచ్చిన అప్పును తిరిగి అడుగుతున్నాడని కక్షతో ఇద్దరు దుండగులు ముత్యాలంపాడు కు చెందిన అశోక్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను నరికి చంపేశారు.

మృతుడు అశోక్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అతనికి తెలిసిన ఇద్దరు వ్యక్తులకు లక్ష రూపాయలను వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. ఇక వారు ఎన్ని రోజులకీ అప్పు తీర్చలేదు. అశోక్ పలుమార్లు అడిగినా వారి వద్ద సమాధానం లేదు.

ఇక సంఘటన జరిగిన రోజు అశోక్ ఆస్పత్రిలో ఉండగా… దుండగులు మూడు సార్లు అతనికి కాల్ చేశారు. చివరికి డబ్బులు ఇస్తాం అని ఘటనా స్థలానికి పిలిచి అతని పై దాడి చేసి చంపేశారు. కత్తితో గొంతు, చేతులు, కాళ్ళు మీద నరికి అశోక్ ను హతమార్చారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ హత్య అప్పు ఇచ్చిన లక్ష రూపాయల వల్లనే జరిగిందా లేదా దీనికి మరొక కోణం ఏదైనా ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. అశోక్ కి ఒక సంవత్సరం ముందే పెళ్లి జరుగగా అతనికి ఒక నెల రోజుల వయస్సు ఉన్న బాబు కూడా ఉన్నాడు.

This post was last modified on December 12, 2022 6:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

1 hour ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

1 hour ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

2 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

3 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

5 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

7 hours ago