భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. వారికి ఇచ్చిన అప్పును తిరిగి అడుగుతున్నాడని కక్షతో ఇద్దరు దుండగులు ముత్యాలంపాడు కు చెందిన అశోక్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను నరికి చంపేశారు.
మృతుడు అశోక్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అతనికి తెలిసిన ఇద్దరు వ్యక్తులకు లక్ష రూపాయలను వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. ఇక వారు ఎన్ని రోజులకీ అప్పు తీర్చలేదు. అశోక్ పలుమార్లు అడిగినా వారి వద్ద సమాధానం లేదు.
ఇక సంఘటన జరిగిన రోజు అశోక్ ఆస్పత్రిలో ఉండగా… దుండగులు మూడు సార్లు అతనికి కాల్ చేశారు. చివరికి డబ్బులు ఇస్తాం అని ఘటనా స్థలానికి పిలిచి అతని పై దాడి చేసి చంపేశారు. కత్తితో గొంతు, చేతులు, కాళ్ళు మీద నరికి అశోక్ ను హతమార్చారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ హత్య అప్పు ఇచ్చిన లక్ష రూపాయల వల్లనే జరిగిందా లేదా దీనికి మరొక కోణం ఏదైనా ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. అశోక్ కి ఒక సంవత్సరం ముందే పెళ్లి జరుగగా అతనికి ఒక నెల రోజుల వయస్సు ఉన్న బాబు కూడా ఉన్నాడు.
This post was last modified on December 12, 2022 6:39 pm
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…