తెలుగు బుల్లితెరపై కొన్ని వందల స్కిట్లు చేసి ప్రేక్షకులను అలరించిన కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు అతను జబర్దస్త్ వదిలేశాడు. ఈ మధ్యనే తాను ప్రేమించిన అమ్మాయితో ఈ మధ్యనే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
ఇక మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యనే ఆర్పీ హైదరాబాద్ లో ఒక కర్రీస్ పాయింట్ పెట్టాడు. తన స్వస్థలమైన నెల్లూరు చేపల పులుసుకి ప్రసిద్ధి కాబట్టి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కూకట్ పల్లిలో ఒక కర్రీస్ పాయింట్ పెట్టాడు.
మామూలుగా తాను చేసే చేపల పులుసుని అతని మిత్రులు లొట్టలు వేస్తూ ఆరగించేవారంట. ఇక ఇక్కడ కూడా ఆ చేపల పులుసుకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రారంభించాడు. ఇక్కడ చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్న చేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు లభిస్తాయి. ఇవన్నీ కట్టెల పొయ్యి మీదనే వండడం గమనార్హం.
ఇక త్వరలోనే నగరంలో మరో 15 పాయింట్స్ కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట మన ఆర్పీ. ఆర్పీ చివరగా నాగబాబు జడ్జి గా వ్యవహరించిన కామెడీ స్టార్స్ అనే టీవీ షో లో కనిపించాడు.
This post was last modified on December 12, 2022 3:01 pm
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ తరహా ఫలితాలు ఆ…
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది.…
ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ…
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార…
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…