తెలుగు బుల్లితెరపై కొన్ని వందల స్కిట్లు చేసి ప్రేక్షకులను అలరించిన కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు అతను జబర్దస్త్ వదిలేశాడు. ఈ మధ్యనే తాను ప్రేమించిన అమ్మాయితో ఈ మధ్యనే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
ఇక మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యనే ఆర్పీ హైదరాబాద్ లో ఒక కర్రీస్ పాయింట్ పెట్టాడు. తన స్వస్థలమైన నెల్లూరు చేపల పులుసుకి ప్రసిద్ధి కాబట్టి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కూకట్ పల్లిలో ఒక కర్రీస్ పాయింట్ పెట్టాడు.
మామూలుగా తాను చేసే చేపల పులుసుని అతని మిత్రులు లొట్టలు వేస్తూ ఆరగించేవారంట. ఇక ఇక్కడ కూడా ఆ చేపల పులుసుకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రారంభించాడు. ఇక్కడ చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్న చేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు లభిస్తాయి. ఇవన్నీ కట్టెల పొయ్యి మీదనే వండడం గమనార్హం.
ఇక త్వరలోనే నగరంలో మరో 15 పాయింట్స్ కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట మన ఆర్పీ. ఆర్పీ చివరగా నాగబాబు జడ్జి గా వ్యవహరించిన కామెడీ స్టార్స్ అనే టీవీ షో లో కనిపించాడు.
This post was last modified on December 12, 2022 3:01 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…