తెలుగు బుల్లితెరపై కొన్ని వందల స్కిట్లు చేసి ప్రేక్షకులను అలరించిన కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు అతను జబర్దస్త్ వదిలేశాడు. ఈ మధ్యనే తాను ప్రేమించిన అమ్మాయితో ఈ మధ్యనే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
ఇక మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యనే ఆర్పీ హైదరాబాద్ లో ఒక కర్రీస్ పాయింట్ పెట్టాడు. తన స్వస్థలమైన నెల్లూరు చేపల పులుసుకి ప్రసిద్ధి కాబట్టి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కూకట్ పల్లిలో ఒక కర్రీస్ పాయింట్ పెట్టాడు.
మామూలుగా తాను చేసే చేపల పులుసుని అతని మిత్రులు లొట్టలు వేస్తూ ఆరగించేవారంట. ఇక ఇక్కడ కూడా ఆ చేపల పులుసుకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రారంభించాడు. ఇక్కడ చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్న చేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు లభిస్తాయి. ఇవన్నీ కట్టెల పొయ్యి మీదనే వండడం గమనార్హం.
ఇక త్వరలోనే నగరంలో మరో 15 పాయింట్స్ కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట మన ఆర్పీ. ఆర్పీ చివరగా నాగబాబు జడ్జి గా వ్యవహరించిన కామెడీ స్టార్స్ అనే టీవీ షో లో కనిపించాడు.
This post was last modified on December 12, 2022 3:01 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…