నిన్న రాత్రి డివై పాటిల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఇండియా-ఆస్ట్రేలియా అమ్మాయిల రెండవ టి20 లో భారత జట్టు సూపర్ ఓవర్ లో 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు మూనీ (82), మెక్ గ్రాత్ (70) పరుగులతో అజేయంగా నిలవడంతో 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది.
చేధనలో భారత్ ఓపెనర్లు స్మృతి మందన (79), షెఫాలీ (34) అదిరిపోయే ఆరంభం ఇవ్వగా… మధ్య ఓవర్లలో ఆసీస్ జట్టు పుంజుకుంది. చివరి 4 ఓవర్లలో 46 పరుగులు కావాల్సి ఉండగా… రిచా ఘోష్ (26) తో చెలరేగా… వైద్య (15) పరుగులు చేసి చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా ఫోర్ కొట్టి మ్యాచ్ ను టై గా ముగించింది.
సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ కి భారత్ జట్టులో రిచా సిక్సర్ కొట్టి ఔట్ అయింది. మందన తన ఫామ్ కొనసాగించి ఒక 4, 6 కొత్తగా భారత్ 20 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరుపున హీలే మొదటి బంతినే బౌండరీ బాదింది కానీ తరువాత బంతికే ఔట్ అయింది. ఇక చివరికి సూపర్ ఓవర్ లో ఆస్ట్రేలియా 16 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ విజయంతో భారత్ 3 మ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 1-1 తో సమం చేసింది.
This post was last modified on December 12, 2022 5:46 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…