రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో రాగన్నగూడలో ఈరోజు ఉదయం చోటు చేసుకున్న ఒక డెంటిస్ట్ యువతి కిడ్నాప్ సంజనాత్మకంగా మారిన విషయం తెలిసిందే. సినీఫక్కీలో నవీన్ అనే యువకుడు ఏకంగా వందమంది యువకులంతో తను ప్రేమించిన యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను ఎత్తుకెళ్లిన ఘటన అందర్నీ సంప్రమాశ్చర్యాలకు గురిచేసింది. అయితే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకొని యువతిని రక్షించడం జరిగింది.
గత కొన్నాళ్లుగా టీ టైమ్ వ్యవస్థాపకుడు నవీన్ ప్రేమ పేరుతో ఒక యువతని వేధిస్తున్నాడు. ఈ విషయమై ఆమె గతంలో షీ టీంకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే మధ్యవర్తులతో పెళ్లికి నవీన్ సంప్రదింపులు జరగా ఆ యువత తల్లిదండ్రులు సంబంధానికి ససేమిరా అన్నారు. ఈరోజు ఆ యువతికి పెళ్లిచూపులు జరగవలసి ఉంది. ఈ విషయం తెలుసుకున్న నవీన్ దౌర్జన్యంగా దాదాపు 100 మందితో అమ్మాయి ఇంటిలోకి చొరబడి వస్తువును ద్వంసం చేసి అడ్డుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులపై శారీరకంగా దాడి చేసి మరీ ఆ యువతీని తనతో బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇక యువతి ఆచూకీ పోవడంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డుపై ధర్నాకు దిగారు.
ఎంతో సంచలనంగా మారిన ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీని కొద్ది గంటల్లోనే కనిపెట్టడం జరిగింది. ఇక కిడ్నాపర్ తో పాటు దొరికిన అతని బృందాన్ని అరెస్టు చేసిన పోలీసులు యువతని క్షేమంగా ఆమె ఇంటిలో కుటుంబ సభ్యుల వద్ద వదిలిపెట్టారు. మరి ఇంతటి ఉన్మాదానికి పాల్పడిన ఆ యువకుడు పై కేసు నమోదు చేయగా అతనికి ఎటువంటి శిక్ష పడుతుంది అన్న విషయం వేచి చూడాలి.
This post was last modified on December 9, 2022 9:44 pm
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది.…
ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ…
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార…
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…